Skip to main content

25Nov2017

❇ గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో పెళ్ళికి యేసుని, ఆయన తల్లిని, ఆయన శిష్యుల్ని కూడా పిలిచారు. ఆ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది.
యేసు తల్లి ఆయనతో౼“వీరి దగ్గర ఇక ద్రాక్షారసం అయిపోయింది” అంది.
యేసు ఆమెతో౼“అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు” ఆయన తల్లి పనివారితో౼“మీతో ఆయన చెప్పినది చేయండి” అంది.
అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి.

యేసు పనివారితో౼“ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు. అప్పుడాయన వారితో౼“ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకు వెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీరు గురించి ఆ పనివారికి మాత్రమే తెలుసు. విందు ప్రధానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి౼“ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్రాక్షరసం పోస్తారు.ఆ తర్వాత నాసిరకంది పోస్తారు. మీరైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసమే ఉంచారు” అన్నాడు ❇


■ మొదట ద్రాక్షారసం మనుష్యుల చేత తయారు చేయబడినదైతే, రెండవది దేవుని చేత చేయబడినది. ఖచ్చితంగా రెండవదే శ్రేష్ఠమైన ద్రాక్షారసమై ఉండి ఉంటుంది(త్రాగిన వెంటనే విందు ప్రధాని పెండ్లి కుమారుని కలిశాడు). మొదటి ద్రాక్షరసం దేవుని ప్రమేయం లేకుండా మానవుని స్వనీతికి గుర్తుగా ఉంది. 'నీరు'.. రుచిలేని జీవితానికి, మనుష్యల చేత అంగీకరించబడని పాపులకు, అల్పులుగా పిలవబడే బలహీనులకు గుర్తుగా ఉంది. అలాంటి వారికి క్రీస్తు దగ్గర గొప్ప నిరీక్షణ ఉంది(నిజానికి భూమిపై బలవంతుడు లేడు! వేషధారులు, స్వనీతిపరులు మినహా..యధార్థవంతులంతా తాము దేవుని యెదుట బలహీనులమని వారు ఒప్పుకుంటారు). ఇది క్రీస్తు ద్వారా, ఆయన కనికరం వల్ల మనకు ఇవ్వబడిన ఉచితమైన నీతి. దేవుని చేత మార్చబడే శ్రేష్ఠమైన జీవితం, అంతరంగంలో నుండి శుద్ధికరిస్తుంది. మనుష్యుల యెదుట కాక, దేవుని యెదుటే జీవించే జీవితం.

■ఒకవేళ దాక్షారసం అయిపోక పోతే(కొరత లేకపోతే) క్రీస్తు అద్భుత శక్తి అవసరం ఉండేది కాదు! అలాగే మన జీవితంలో కొదువలు(సమస్యలు/బలహీనతలు) ఉండటం మన మంచికే! దేవుని శక్తి మీద ఆధారపడి, ఆయన బలాన్ని మన జీవితంలో అనుభవపూర్వకంగా తెల్సుకోవడానికి అవి చక్కటి ద్వారాలు. ఆధ్యాత్మిక అవగాహనలో ఎదుగుతున్న ప్రతి విశ్వాసి తెల్సుకోవాల్సిన సత్యం ఇది! ఏ బలహీనతల్ని గూర్చి కృంగిపోవాల్సిన అవసరం లేదు గానీ, మనకు మరి యెక్కువగా దేవుని కృప అవసరమని గ్రహించి, దృఢ విశ్వాసంతో ఆపేక్షిస్తూ, క్రీస్తు కృపలో నిలకడగా ఉండాలి. ఎక్కడ బంధకాలు బలంగా ఉంటాయో అక్కడ క్రీస్తు కృప మరెక్కువ బలంగా పని చేస్తుంది. విశ్వాసం దేవుని శక్తిని మానవునిలోకి ప్రవేశింపజేస్తుంది. మనల్ని జయజీవితంలోకి నడిపేది దేవుని బలాన్ని నమ్మే దృఢ విశ్వాసమే!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...