Skip to main content

14Nov2017

❇ యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా, ఓడ బ్రద్దలైపోయే తీవ్రమైన తుఫాను రేగింది. నావికులకు భయపడి ప్రతివాడు తన తన దేవుళ్ళకి మొర పెట్టాడు, ఓడ తేలిక చేయడానికి వారు దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అప్పటికే యోనా ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకొని బాగా నిద్రపోయాడు.

ఓడ నాయకుడు యోనాదగ్గరికి వెళ్ళి౼“ఓయ్! నువ్విక్కడ నిద్రపోతున్నావా?లేచి నీ దేవునికి ప్రార్ధన చెయ్!ఒకవేళ ఆయన మనల్ని కనికరించి నాశనం కాకుండా కాపాడతాడేమో"అన్నాడు

అప్పుడు నావికులు౼"ఎవరి కారణంగా ఈ ఆపద మనమీదికి వచ్చిందో చీట్లు వేసి తెలుసుకొందాం, రండి" అని చెప్పుకొన్నారు. వారు చీట్లు వేసినప్పుడు..చీటి 'యోనా' పేరు మీద వచ్చింది. ❇


■ దేవుడు ప్రవక్తయైన యోనాను నీనెవే మహా పట్టణానికి వెళ్లి ఆ ప్రజల ఘోర పాపాలను బట్టి హెచ్చరించమని చెప్పాడు. కానీ యోనా దేవుని మాట వినకుండా పారిపోయ్యాడు. అప్పుడు దేవుడు గొప్ప తుఫానును సముద్రం పైకి పంపాడు. పెద్ద గాలి తుఫానులతో నీటిలో నివసించే ప్రాణులు, అందులో ప్రయాణించే ఓడలు (మనుష్యులు) భయాందోళనకు గురైయ్యారు. ఓడను తేలిక చేయడానికి వారి వస్తువులు సముద్రంలో పడేశారు. ఎంతో నష్టం వారికి జరిగింది. ఒక్క మనిషి యొక్క అవిధేయతను బట్టి దేవుడు సముద్రాన్ని అల్లకల్లోలం చేశాడు.(ఆత్మీయతను లైటుగా తీసుకొనే విశ్వాసిని, దేవుడు కూడా లైటుగానే తీసుకుంటాడు కానీ) దేవుని చిత్తం నుండి యదార్థవంతుడైన, ఆత్మలో తీవ్రత కలిగిన విశ్వాసి బుద్ధిహీనంగా దేవుని చిత్తానికి ఎదురాడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఇందులో దేవుని ప్రేమ ఉంది. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించడం, దెబ్బ కొట్టటం వానికి ఎంతో మేలు! ఇది ఆ వ్యక్తిని గురించి దేవుడు ఎంత ఆలోచిస్తున్నాడో, పట్టించుకుంటున్నాడో తెలియజేస్తుంది. (దేవుడు)తండ్రిగా లేని/విడచిన అనాధ యొక్క స్వేచ్ఛ కంటే, సౌఖ్యం కంటే ఇది ఎంతో గొప్ప విలువైన సంగతి!

■ దేవుని నుండి వైదొలగిన విశ్వాసి (నులివెచ్చని)స్థితి, లోకానుసారుల స్థితి కంటే అద్వాన్నంగా ఉంటుందనేది సుస్పష్టమే! కొన్నిసార్లు లోకస్తులు, వారి విలువలు-ఆధ్యాత్మిక చింతన దిగజారిన విశ్వాసికి సిగ్గును కలిగించే విధంగా ఉంటాయి. లోకానికి దేవుని హెచ్చరికగా ఉండాల్సిన వారు, లోకం చేత హెచ్చరించబడే స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు నావికులు నమ్మే (చీట్లు వేసే)విధానాల్లో నుండే యోనాను దోషిగా నిలువబెట్టి, వారి మధ్యలో నుండి ప్రత్యేక పరచాడు. మన పడిన స్థితిని మనసాక్షి ద్వారా, కొన్నిసార్లు ఇతరుల చేత ఆయన గుర్తు చేస్తాడు. అవన్ని తిరిగి తండ్రి ఇంటికి బుద్ది తెచ్చుకుని మునుపటి స్థితికి తిరిగి రావాడానికి మేలుకొలుపులే! ఒకడు దేవుని(వాక్యం)లో మేధావిని అనుకుంటే, ఆ స్థాయికి తగిన వ్యక్తిగత విధేయతను, వాక్యానుసారమైన జీవితాన్ని దేవుడు ఎదురుచూస్తాడు.దేవుని ప్రత్యక్షత, ఆయన వాక్కు యోనాతో వద్ద ఉంది కనుక మిగితా వారందరి కంటే ఎక్కువ జవాబుదారీగా అతనున్నాడు. యోనాను ఆ ఓడ నుండి బయట పడేసేంత వరకు ఆ కల్లోలం ఆగలేదు. అప్పుడు ఆ ఓడలో వారంతా నివ్వెర పోయి, దేవుని ఆరాధించారు. దేవుడు సమకూడి జరిగించే పరిస్థితులను, ఆయన చిత్తాలను ఒకడు ఆత్మీయ సూక్ష్మ బుద్ధి (ఆత్మీయ నేత్రాలు, చెవులు కలిగి) తెల్సుకుంటూ, దానికి విధేయత చూపే జీవితం నిజంగా ఎంత ఆశీర్వాదకరమైన జీవితం! అదే నిజమైన ఆశీర్వాదం!

౼'దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి' అని కోరిక ఉన్న ప్రతివానికి ఆయన తెలియజేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవుని వాక్యం ద్వారా, వివిధ విధానాల్లో ఆయన మనస్సును మనకు తెలియజేస్తాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...