Skip to main content

08Dec2017


సాయంత్రమైనప్పుడు యేసు తన శిష్యులతో ౼“సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి!” అన్నాడు. శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు.
వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సముద్రంపై బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది.

కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి౼“ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం!మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలను గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు.. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది.

అప్పుడు ఆయన౼“మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు(మార్కు 4:35-40) ❇


■ దేవుడు తోడున్న పడవపైకి గాలివాన-తుఫానులు(శ్రమలు) వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి! ఇంకా చెప్పాలంటే ఆయనే (శ్రమలను) పంపుతాడు! ఈ సంఘటనకు ముందు యేసు శిష్యులకు అనేక పరలోక సత్యాలను భోధించాడు (మార్కు 4:33,34). అదే రోజు సాయంత్రం ఆయనే వారిని ఈ ప్రయాణానికి పిలిచాడు. ఇప్పుడు వారి ముందున్న యేసు(దేవుని) మాట౼"అవతలి ఒడ్డుకు వెళ్దాం!". కానీ కొద్దిసేపటి తర్వాత తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకొచ్చాయి. అటువంటి సమయంలో..'మన జీవితం' అనే పడవలో చెలరేగే తుఫానులను మనమే పరిష్కరించుకోవాలని భావిస్తే భయానదోళనలే కలుగుతాయి. అవి కొన్నిసార్లు మన శక్తికి మించినవి. 'నేనే దీన్ని పరిష్కరించుకోవాలి' ౼ 'నేనే'-అనే మానవ బలం నుండి బయటకి వచ్చి, 'నేను ఒంటరిని కాదు, నా దేవుడే నా సహాయకుడు' (ఆయనకు తెలిసే,ఆయన పంపగా ఈ తుఫాను వచ్చింది)అనే దైవబలంలోకి విశ్వాసంతో ప్రవేశిస్తూ..శ్రమలో చెయ్యి విడువని, దేవుని విలువైన ఆధ్యాత్మిక పాఠాలను శ్రద్ధగా నేర్చుకుంటూ ఆధారపడవాల్సిన వారమైవున్నాము(ఇది మాట పలికినంత సుళువు కాదని నాకు తెల్సు!నమ్మకస్థుడైన దేవుడు మనల్ని చెయ్యి విడువక, నడిపిస్తాడని మాత్రం నాకు తెల్సు!).

■ శిష్యులు-'మేము దేవుణ్ని బట్టి విశ్వాసంతో సమస్తాన్ని వదులుకున్నాం' అనుకుంటున్నారు కానీ శ్రమ వచ్చేవరకు తెలియదు,వారింకా అల్పవిశ్వాసంతోనే ఉన్నారని! 'శ్రమ'-మన నిజమైన ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తూ,మనపై మనకున్న సొంత అభిప్రాయాలను తొలగిస్తుంది. దేవునితో నడిచే జీవితం..ఒక విద్యార్థిని పోలినట్లుగా 'సత్యాన్ని గూర్చిన వెలిగింపుతో పాటుగా, పరీక్షా అనుభవాలు, ఆధ్యాత్మిక ఆశీర్వదాలు ఉంటాయి'. 'ప్రతి పరీక్ష' విశ్వాసిని మరొక మెట్టుకు తీసుకెళ్తాయి(ఆయన ఏమై ఉన్నాడో అనుభవపూర్వకంగా కనపర్చుకుంటాడు). లోతుల్లోకి వెళ్ళేకొలది పరీక్ష తీవ్రత పెరుగుతుంది.లోతైన, బలమైన పాఠానికి సిద్ధమౌతున్నామని దానర్థం.మరొక ప్రామాణికం(standard) లోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. శ్రమ అనే పరీక్షలు విశ్వాసి దేవుణ్ని ఆనుకోవడానికి చక్కటి అవకాశాలు. సముద్రపు అలలు, గాలి తుఫాను వైపు చూస్తే ఖచ్చితంగా భయమే కలుగుతుంది గానీ, ఇప్పటివరకు మనల్ని నడిపిన, నమ్మకస్తుడునూ, నిత్యుడైన పరలోక రాజు యొక్క బలం వైపు చూస్తే, 'నిరీక్షణ' కలుగుతుంది. ఆయన ఒక్క మాటతో వాతావరణం తిరిగి నిమ్మళంగా మారిపోయింది. సమస్తంపై సర్వాధికారం కలిగిన దేవుణ్ని మనం దేవునిగా కలిగి ఉన్నాం!సమస్తం ఆయన ఆధీనంలోనే ఉంది. భయపడొద్దు!విశ్వాసం మాత్రం ఉంచుదాం!మన రక్షకుడైన దేవుని చేతిలో మనం భద్రంగా ఉన్నాం!మన హృదయాల్లో రేగే అలజడులను దేవుడు శీఘ్రంగా నిమ్మళ్ళపర్చును గాక!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...