Skip to main content

22Nov2017


❇ యెహోవా మోషేతో౼"నేను బెసెలేలును ప్రత్యేకించుకొన్నాను. నేను అతణ్ణి దైవాత్మతో నింపాను. అతనికి జ్ఞానం, తెలివి, వివేకం ప్రసాదించాను.నేర్పుతో పనులను కల్పించడానికీ, బంగారం, వెండి, కంచుతో పని చెయ్యడానికీ పొదగడం కోసం రత్నాలను సానపెట్టడానికీ, మ్రానులను చెక్కడానికీ, అన్ని విధాల పనులను చెయ్యడానికీ అతణ్ణి ప్రవీణుణ్ణి చేశాను".

బెసెలేలు తుమ్మకర్రతో దేవుని మందసాన్ని చేశాడు. రెక్కలు పైకి విప్పి ఉన్న రెండు కెరూబు ఆకారాలు బంగారంతో, మందసపు మూతపై కప్పి ఉన్నట్లుగా చేశాడు. మరియు తుమ్మకర్రతో బల్లను-ధూపవేదికను-బలిపీఠాన్ని, మేలిమి బంగారంతో దీపస్తంభాన్ని , కంచుతో గంగాళాన్నీ-దాని పీఠాన్నీ, మరియు ఆవరణాన్ని-వాటి తెరలను తయారు చేశాడు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించినది అంతా బెసెలేలు, అహోలీయాబుతో కలిసి చేశాడు. ❇


■ దేవుడు ఇశ్రాయేలీయులకిచ్చిన ప్రత్యక్ష గుడారం నమూనా పరలోక పోలికగా (గుర్తుగా) ఉంటుంది. దేవుడు మెషేకు ప్రత్యక్ష గుడారపు నమూనాను కొండపైన చూపాడు(నిర్గ 25:40).దానిని సరిగ్గా అలాగే చెయ్యడానికి అనగా మోషే దాని గూర్చి వివరణ ఇవ్వగా, ఒకరు సరిగ్గా దేవుడు చెప్పినట్లుగానే మలచాల్సివుంది. ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తికే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు(1కోరింధి 2:11). కనుక దేవుడు మోషేకు చూపిన నమూనాను, దేవుని ఆత్మతో నింపబడిన బెసెలేలు తెల్సుకోగలిగాడు. బెసెలేలు నేర్పరిగల పనివాడే మాత్రమే కాదు గాని, దేవునికి తనను తాను అప్పగించుకొని, దేవునిపై ఆధారపడే భక్తిపరుడు. ఎక్కడ ఆయన పని ఉంటుందో అక్కడ దేవుని చిత్తప్రకారం, ఎంతో ప్రణాళికాబద్దంగా వ్యక్తులను సిద్ధపరుస్తాడు. ఆది నుండి(ఇప్పటి వరకు కూడా) దేవుని ఆత్మే దేవుని పనులను అమలుచేస్తున్నట్లు గమనించగలం. ఆత్మపూర్ణుడైన బెసెలేలు, అహోలీయాబుతో కలిసి దేవుడు కోరుకున్నట్లుగా ఆ పనిని సంపూర్ణంగా ముగించాడు.

■ నేడు క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మ భూమిపై ఉన్న నమూనాను కట్టడం లేదు గాని, దాని సంపూర్ణతైన ఆత్మ సంభంధమైన దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు. దేవుని ఆత్మ వారి మీదకు రానంత వరకు శిష్యులు పునరుద్దానుడైన క్రీస్తును చూసినప్పటికీ భూసంబంధులుగా మాట్లాడారు(అపో 1:6), కానీ వారు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని ఆలోచనలతో నింపబడ్డారు, ఆయన రాజ్యాన్ని నిర్మించే భాగస్వాయులయ్యారు. ఇథియోపియుడైన నపుంసకుడు దేవుని కోసం అన్వేషిస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పును పంపాడు. ఆయన పని-అవసరం ఎక్కడుందో ఆయన ఆత్మకు బాగా తెల్సు గనుక ఆత్మపూర్ణులుగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తులను వాడుకుంటాడు. విశ్వాసులందరూ దేవుని ఆత్మ ఆధీనంలో ఉండాలనే దేవుడు బలవంతం చెయ్యడు గాని, అది విశ్వాసి స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంది(అపో 6:5).ఎవరి జీవితంలోనైనతే దేవుణ్ని మహిమ పర్చడమే ధ్యేయంగా ఉంటుందో, ఎవరి జీవితంలోనైనతే ఇహలోక కోరికల కంటే, దేవుని చిత్తం తన జీవితంలో నెరవేర్చడమే మనఃపూర్వకమైన వాంఛగా ఉంటుందో వారికి దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తూ వాడుకుంటాడు.

౼ ఆది అపొస్తలలు, శిష్యులు దేవుని ఆత్మపూర్ణులై దేవుని చేత వాడబడటానికి కారణం ఇదే! ప్రాణాత్మ దేహాలను దేవునికి ఇష్టపూర్వకంగా సమర్పించుకున్నారు. దేవుని మహిమ పరచడమే మొదట ప్రాధాన్యతగా ఎంచుకున్నారు. విశ్వాసి ఆత్మపూర్ణుడుగా ఉండొచ్చు లేదా ఆత్మను ఆర్పుకొనేవారిగానూ ఉండొచ్చు. ఒకటే జీవితం..ఎలాంటి వ్యక్తివిగా నీవుంటావు? తర్వాత జీవితమనే పుస్తకం మూసి వేయబడుతుంది. అది శాశ్విత సాక్ష్యంగా నిత్యత్వంలో నిలిచిపోతుంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...