❇ ఆకాశమా, ఆలకించు!భూమీ, విను! దేవుడు మాట్లాడు తున్నాడు౼
“నేను నా పిల్లలను పెంచి పోషించాను. వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దుకు తన యజమాని తెలుసు,
గాడిదకు యజమాని మేత పెట్టే స్థలం తెలుసు.
కానీ (ఇశ్రాయేలు) నా ప్రజలకు నేను తెలియదు. నా ప్రజలు గ్రహించరు.
అయ్యో! ఈ ప్రజలు దోషులు...!వారు దేవుణ్ణి వదలిపెట్టారు,
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుడ్ని) తిరస్కరించారు,
ఆయనను విడిచి తొలగిపోయారు"(యెషయా 1:2-4) ❇
■ దేవుని ఇంట్లో(సన్నిధిలో) ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉంటుంది. ఆయన మనుష్యులను ప్రాణం లేని గ్రహాల్లాగా, నక్షత్రాల్లాగా, సముద్రాల్లాగా పుట్టించలేదు గాని ఆయన్ను స్వేచ్ఛగా కోరుకుంటూ, సేవించగలిగే వారిగా ఆయన స్వభావంలో పుట్టించాడు. దేవుడు సృష్టిని ఆరు దినాల్లో ముగించాడు. ప్రతి దినం సృష్టిని రూపొందిస్తున్నప్పుడు ఆయన మనస్సులో మానవుని గూర్చి ఆలోచిస్తున్నాడు. సృష్టినంతా వాని కోసమే నిర్మించాడు. ప్రేమగల తండ్రి తన బిడ్డల గురించి ముందుగానే ఆలోచిస్తూ, సిద్ధపర్చినట్లుగా..ప్రతి చిన్న విషయం గురించి ఆలోచించాడు. ఆహారానికి రకరకాల పండ్లను, కూరగాయలను, ధాన్యాలను ఇచ్చాడు. ఈ అందమైన ప్రకృతిలో వానికి ఏ కొదువా ఆయన చెయ్యలేదు. ఆరవ రోజున మనిషిని చేసేటప్పుడు ప్రతి అవయవానికి ఒక పనిని నియమించి, నాశికలో ప్రాణాత్మలను ఊదాడు. స్త్రీ, పురుషులుగా నిర్మించాడు. సృష్టిని ఏలుమని దీవించాడు. ప్రతి మనిషి ఆయనకు ప్రత్యేకమైన వాడే! (ఇప్పటికీ)ఆయన ఎల్లప్పుడూ మనల్ని గురించే ఆలోచిస్తున్నాడు. మనిషి దేవుని స్వభావంలో నిర్మించబడ్డాడు గనుక వాని పరిపూర్ణమైన ఆనందం దేవుని లోనే ఉన్నది. ఆయనకు వెలుపల ఉన్నదంతా మోసపుచ్చే పాపపు ఆనందం,మనల్ని నాశనానికి నడిపే మార్గం.
■ దేవుడు పరిశుద్ధుడు!! ఒకప్పుడు ఆయన సన్నిధిలో, ఆయనే నియమించిన ప్రకాశవంతమైన ప్రధానదూత(సైతాను), దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆయన నిలిపిన ఆ స్థానం నుండి ఆయనే త్రోసివేశాడు. దేవునితో అత్యంత సన్నిహిత్యంలో ఉండటానికి నియమించబడిన వాడు, దేవుణ్ని విడిచి శాశ్వితంగా నిత్యనాశనానికి వెళ్లబోతున్నాడు. ఏదెను తోటలో దేవుడే మనవుణ్ణి అందులో ఉంచాడు, సేద్యపరచే బాధ్యతనిచ్చాడు. దేవుని మాటనుండి వైదొలగి జీవిచడానికి తీర్మానించుకున్నప్పుడు(ఒకే ఒక్క తీర్మానం), శాశ్వతంగా ఆ ప్రదేశం నుండి దేవుడే తోలివేశాడు.ప్రేమగల దేవుడు ఆయన పరిశుద్ధతకు, ఆయన న్యాయానికి వేరుగా ఆయన ప్రవర్తించడు. వారు కోరుకున్నది వారికి ఇవ్వబడుతుంది. దేవుని మాటకు విరోధంగా పోరాడి వారి నాశనాన్ని వారు కోరుకున్నప్పుడు, ప్రేమగల తండ్రిగా ఆ స్వేచ్ఛను గౌరవిస్తూనే, న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో దేవునికి వేరుగా ఉన్నది, దేవుని నుండి ఒకరోజు శాశ్వితంగా వెరైపోతుంది. కానీ అలా జరుగుతునప్పుడు సర్వశక్తుడు ఆవేదన చెందుతాడు..
■ తప్పిపోయిన కుమారుని కథలో తండ్రి నుండి వేరై ఉండగోరిన చిన్న కుమారుని స్వేచ్ఛను గౌరవించి, ఆస్తిని పంచి ఇచ్చినట్లుగా నేడు మానవుని స్వేచ్ఛను దేవుడు గౌరవిస్తు న్నాడు. ఆ స్వేచ్ఛలో నుండే తిరిగి వస్తే, ఏ మాత్రం ప్రశ్నించక వెంటనే అక్కున చేర్చుకుంటాడు. దేవుడిచ్చిన ప్రతి వనరులను మానవుడు వాడుకుంటున్నాడు కానీ 'ఆ దేవుడు మాకు అవసరం లేదని' ఆయనకు దుఃఖాన్ని రేపుతున్నారు. చెడు మార్గం పట్టి, నాశనానికి సిద్ధంగా ఉన్న మానవాళిని చూసి దుఃఖంతో తండ్రియైన దేవుడు పడ్తున్న ఆవేదనను లేఖనాలు చూపిస్తున్నాయి. కనుకనే క్రీస్తును ఈ లోకానికి రక్షకునిగా పంపి ఆయనలో విమోచన(రక్షణ)ను సిద్ధం చేశాడు. మన దోషాలు ఆయనపై మోపాడు,మన నిత్యశిక్షను ఆయన భరించాడు. ఎవరైతే క్రీస్తులో విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది, మారుమనస్సు పొందుతారో, క్రీస్తు కృపలో నిలిచి వుంటారో..అంత్యదినాన దేవుడు వారిని కాపాడుకుంటాడు..
“నేను నా పిల్లలను పెంచి పోషించాను. వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దుకు తన యజమాని తెలుసు,
గాడిదకు యజమాని మేత పెట్టే స్థలం తెలుసు.
కానీ (ఇశ్రాయేలు) నా ప్రజలకు నేను తెలియదు. నా ప్రజలు గ్రహించరు.
అయ్యో! ఈ ప్రజలు దోషులు...!వారు దేవుణ్ణి వదలిపెట్టారు,
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుడ్ని) తిరస్కరించారు,
ఆయనను విడిచి తొలగిపోయారు"(యెషయా 1:2-4) ❇
■ దేవుని ఇంట్లో(సన్నిధిలో) ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉంటుంది. ఆయన మనుష్యులను ప్రాణం లేని గ్రహాల్లాగా, నక్షత్రాల్లాగా, సముద్రాల్లాగా పుట్టించలేదు గాని ఆయన్ను స్వేచ్ఛగా కోరుకుంటూ, సేవించగలిగే వారిగా ఆయన స్వభావంలో పుట్టించాడు. దేవుడు సృష్టిని ఆరు దినాల్లో ముగించాడు. ప్రతి దినం సృష్టిని రూపొందిస్తున్నప్పుడు ఆయన మనస్సులో మానవుని గూర్చి ఆలోచిస్తున్నాడు. సృష్టినంతా వాని కోసమే నిర్మించాడు. ప్రేమగల తండ్రి తన బిడ్డల గురించి ముందుగానే ఆలోచిస్తూ, సిద్ధపర్చినట్లుగా..ప్రతి చిన్న విషయం గురించి ఆలోచించాడు. ఆహారానికి రకరకాల పండ్లను, కూరగాయలను, ధాన్యాలను ఇచ్చాడు. ఈ అందమైన ప్రకృతిలో వానికి ఏ కొదువా ఆయన చెయ్యలేదు. ఆరవ రోజున మనిషిని చేసేటప్పుడు ప్రతి అవయవానికి ఒక పనిని నియమించి, నాశికలో ప్రాణాత్మలను ఊదాడు. స్త్రీ, పురుషులుగా నిర్మించాడు. సృష్టిని ఏలుమని దీవించాడు. ప్రతి మనిషి ఆయనకు ప్రత్యేకమైన వాడే! (ఇప్పటికీ)ఆయన ఎల్లప్పుడూ మనల్ని గురించే ఆలోచిస్తున్నాడు. మనిషి దేవుని స్వభావంలో నిర్మించబడ్డాడు గనుక వాని పరిపూర్ణమైన ఆనందం దేవుని లోనే ఉన్నది. ఆయనకు వెలుపల ఉన్నదంతా మోసపుచ్చే పాపపు ఆనందం,మనల్ని నాశనానికి నడిపే మార్గం.
■ దేవుడు పరిశుద్ధుడు!! ఒకప్పుడు ఆయన సన్నిధిలో, ఆయనే నియమించిన ప్రకాశవంతమైన ప్రధానదూత(సైతాను), దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆయన నిలిపిన ఆ స్థానం నుండి ఆయనే త్రోసివేశాడు. దేవునితో అత్యంత సన్నిహిత్యంలో ఉండటానికి నియమించబడిన వాడు, దేవుణ్ని విడిచి శాశ్వితంగా నిత్యనాశనానికి వెళ్లబోతున్నాడు. ఏదెను తోటలో దేవుడే మనవుణ్ణి అందులో ఉంచాడు, సేద్యపరచే బాధ్యతనిచ్చాడు. దేవుని మాటనుండి వైదొలగి జీవిచడానికి తీర్మానించుకున్నప్పుడు(ఒకే ఒక్క తీర్మానం), శాశ్వతంగా ఆ ప్రదేశం నుండి దేవుడే తోలివేశాడు.ప్రేమగల దేవుడు ఆయన పరిశుద్ధతకు, ఆయన న్యాయానికి వేరుగా ఆయన ప్రవర్తించడు. వారు కోరుకున్నది వారికి ఇవ్వబడుతుంది. దేవుని మాటకు విరోధంగా పోరాడి వారి నాశనాన్ని వారు కోరుకున్నప్పుడు, ప్రేమగల తండ్రిగా ఆ స్వేచ్ఛను గౌరవిస్తూనే, న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో దేవునికి వేరుగా ఉన్నది, దేవుని నుండి ఒకరోజు శాశ్వితంగా వెరైపోతుంది. కానీ అలా జరుగుతునప్పుడు సర్వశక్తుడు ఆవేదన చెందుతాడు..
■ తప్పిపోయిన కుమారుని కథలో తండ్రి నుండి వేరై ఉండగోరిన చిన్న కుమారుని స్వేచ్ఛను గౌరవించి, ఆస్తిని పంచి ఇచ్చినట్లుగా నేడు మానవుని స్వేచ్ఛను దేవుడు గౌరవిస్తు న్నాడు. ఆ స్వేచ్ఛలో నుండే తిరిగి వస్తే, ఏ మాత్రం ప్రశ్నించక వెంటనే అక్కున చేర్చుకుంటాడు. దేవుడిచ్చిన ప్రతి వనరులను మానవుడు వాడుకుంటున్నాడు కానీ 'ఆ దేవుడు మాకు అవసరం లేదని' ఆయనకు దుఃఖాన్ని రేపుతున్నారు. చెడు మార్గం పట్టి, నాశనానికి సిద్ధంగా ఉన్న మానవాళిని చూసి దుఃఖంతో తండ్రియైన దేవుడు పడ్తున్న ఆవేదనను లేఖనాలు చూపిస్తున్నాయి. కనుకనే క్రీస్తును ఈ లోకానికి రక్షకునిగా పంపి ఆయనలో విమోచన(రక్షణ)ను సిద్ధం చేశాడు. మన దోషాలు ఆయనపై మోపాడు,మన నిత్యశిక్షను ఆయన భరించాడు. ఎవరైతే క్రీస్తులో విశ్వాసముంచి పాప క్షమాపణ పొంది, మారుమనస్సు పొందుతారో, క్రీస్తు కృపలో నిలిచి వుంటారో..అంత్యదినాన దేవుడు వారిని కాపాడుకుంటాడు..
Comments
Post a Comment