Skip to main content

Posts

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...
Recent posts

23May2020

✴   యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు. కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు. యెహోవా కయీనుతో౼"ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు నీ మొఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుని ఉండేవాడివి కదా!" (ఆది 4:4-7)   ✴ ■ దేవుడు ఆ అన్నదమ్ములిద్దరూ అర్పించిన అర్పణల కంటే వారి జీవితాలను, వారి ఉద్దేశ్యాలను పరిగణనలోకి తీసుకుంటున్నాడు. దేవుడు  హేబెలును అంగీకరించాడు కానీ కయూను అంగీకరించలేదు. ఐతే కయూను దీనిని బట్టి కోపం తెచ్చుకున్నాడు... కానీ నిజానికి అది అతను చూపించాల్సిన సరైన చర్య కాదు (It's a wrong reaction). దీనిని బట్టే అతని హృదయం చెడిపోయినదని స్పష్టంగా తెలుస్తుంది. తనను తాను పరీక్షించుకొని, తన క్రియలను బట్టి పశ్చాత్తాపడాల్సిన దానికి బదులుగా అసూయ, క్రోధాలతో హృదయం అతని నిండిపోయింది. ■ ప్రతి మనిషిలో తన స్వంత స్వభావం మరియు మనస్సాక్షిలు పని చేస్తాయి. ఈ మనస్సాక్షిలో దేవుడు ఆయన నియమావళిని వ్రాశాడు. కనుకనే మన ప్రవర్తనతో సంభంధం లేకుండానే మనస్సాక్షి మంచిని గూర్చిన హెచ్చరికలు చేస్తూ ఉంటుంది(మన జీవితాల్లో చాలా సార్లు తొంద...

22May2020

✴   ఫిలిష్తీయుల సైన్యంలోనుండి గొల్యాతు అనే బలశాలి బయలుదేరాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జానెడు. అతడు తన తలపై కంచు శిరస్త్రాణం ధరించాడు. అతడు యుద్ధ కవచం పెట్టుకున్నాడు. కవచం బరువు 57 కిలోలు. అతని కాళ్లకు కంచు కవచం, అతని భుజాల మధ్య ఒక కంచు బల్లెం ఉన్నాయి. అతని చేతిలోని ఈటె, చేనేత పనివాడి అడ్డకర్ర అంతపెద్దది. ఈటె కొన బరువు 7 కిలోల ఇనుమంత బరువు. ఒక సైనికుడు బల్లెం మోస్తూ గొల్యాతు ముందు నడుస్తున్నాడు.. దావీదు-"యెహోవా కత్తిచేత, ఈటెచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. య ుద్ధం యెహోవాయే చేస్తాడు"(1సమూ 17:4-7,47)   ✴ ■ గొల్యాతు యొక్క రూపు, బలం వర్ణన ఎంతో గొప్పగా వివరించబడింది. గొల్యాతుతో పోల్చితే దావీదు అత్యంత స్వల్పమైన,బలహీనమైన వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ కధ ముగింపుకు దావీదు చేతిలో గొల్యాతు ఎవరూ ఊహించని రీతిలో చంపబడతాడు. ఇది దావీదు శక్తితో లేక బలంతో జరిగిందా? కాదు.. రాజైన సౌలు, ఇశ్రాయేలీయులు దేవుని వైపు చూడకయే గొల్యాతు దేహదారుఢ్యాన్ని చూసి భయపడ్డారు. కానీ దావీదు బలశాలియైన దేవుని బలం వైపు తీక్షణంగా చూస్తూ, ఆయన బలాన్ని సరిగ్గా అంచనా వేశాడు. విర్రవీగిన శత్రువు బలాన్ని అణచి...

30May2020

★ యేసు సుంకరియైన మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలా మంది అన్యాయస్థులైన పన్నులు వసూలు చేసే వారూ, పాపులూ వచ్చి ఆయనతోనూ, ఆయన శిష్యులతో పాటు కూర్చున్నారు. మతనిష్ఠ గల పరిసయ్యులు అది గమనించి౼“మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యుల్ని అడిగారు. యేసు అది విని౼“ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడాన ికే వచ్చాను, నీతిపరులను కాదు.” అని చెప్పాడు. (మత్తయి 9:10-13) ★ ■ పరిసయ్యులు దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో, విశ్రాంతి దినం-పవిత్ర పండుగలను ఆచరించడంలోనూ ఎంతో మతనిష్ఠను పాటిస్తారు మరియు నిత్యం ఉపవాసాలతో, ప్రార్ధనల్లో తాము ఉంటారు గనుక తామే పవిత్రలమని అనుకుంటారు. మత నిష్ఠలేని, తప్పుడు పనులు చేసే వారంతా పాపాత్ములనేది వారి భావన. కనుక వారితో కలిసి భోజనం (సహవాసం) చెయ్యడానికి కూడా ఇష్టపడరు. అలా చేయడం ద్వారా దేవుడు తమ పట్ల ఎంతో సంతోషిస్తాడని భావిస్తారు. ■ కానీ దేవుని స్వభావం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. యేసు పాపుల స్నేహితునిగా పిలవబడ్డాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ వారి మధ్యలో జీవించాడు. భూమిపై నివసించ...

29May2020

★యేసు జాలరియైన సీమోను పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు. ఆయన బోధించడం అయిపోయిన తరువాత సీమోనుతో౼"పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి" అన్నాడు. సీమోను"౼ప్రభూ! రాత్రంతా మేము కష్టపడ్డాం..కానీ ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు. వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి.. . సీమోను పేతురు అది చూసి, యేసు ముందు మోకరించి౼"ప్రభూ! నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు" అన్నాడు. అందుకు యేసు సీమోనుతో౼ "భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషుల్ని పట్టే జాలరివౌతావు” అన్నాడు(లూకా 5:1-10) ★ ■ సీమోను పేతురు అతని తోటి జాలరులు రాత్రంతా కష్టపడ్డారు కానీ ఫలితం శూన్యం. నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు యేసు వారి యొద్దకు వచ్చాడు. బైబిల్ అంతటిలో నిరాశ, కొదువ, ఒంటరితనం, అనారోగ్యం, దుఃఖం, నిరీక్షణలేని జీవితం, పాపపు బంధకాలు లాంటి వివిధ రకరకాలైన సమస్యలతో మనుష్యులు ఉన్నప్పుడు, యేసు అక్కడికి వచ్చిన వెంటనే ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అద...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

27May2020

💠  దేవుడు యోనాతో- "నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము"...... యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు. నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు... నీనెవె వాళ్ళు తమ చెడు  ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు. (యోనా 1:2; 3:4,5,10) 💠 ◾  నీనెవె అహంకారంతోనూ, హింసాత్మకంగా, పూర్తిగా చెడిపోయిన క్రూరమైన పట్టణం. అటువంటి పట్టణానికి దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన తీర్పులను భూమి పైకి పంపుతాడు. దేవుని మౌనాన్ని కొన్నిసార్లు ఆయనేమి పట్టించుకొనట్లుగా మనకు అనిపిస్తుంది కానీ ఆయన మౌనంలో కూడా ఆయన పనిచేస్తుంటాడు. ఆయన చెయ్యాలకున్న పనిని ఒక ఘడియ ఆలస్యం చెయ్యడు, ఒక ఘడియ ముందు చెయ్యడు గాని ఆయన సమయంలోనే చేస్తాడు. అయినప్పటికీ దేవుడు కనికరం గలవాడే కానీ శిక్షించాలని ఎదురు చూచువాడు కాదు...

26May2020

💠  ఆయన (యేసు) ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి-"ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు" అనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి-"నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని" చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను. (మత్తయి 8:1-3) 💠 ◾  ఆ రోజుల్లో కుష్టరోగము వైద్యం లేని భయంకరమైన వ్యాధి. గొప్ప పాపాత్ములకు దేవుడు విధించే శిక్షగా ప ్రజలు భావించేవారు. సొంత కుటుంబీకులకు, సమాజానికి దూరంగా వెలివేయబడి, శారీరక-మానసిక క్షోభకులోనవుతూ బ్రతికే దుర్భరమైన జీవితం. ఈ కుష్ఠు రోగి కూడా అటువంటి పరిస్థితిల్లో యేసుని గూర్చి విని, ఆయన తనను బాగుచేయగలడని నమ్మి, ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో జనసమూహంలోకి కుష్ఠు రోగులకు ప్రవేశం లేదు కానీ, ఆ కుష్ఠు రోగి ఏదో ఒక విధంగా ఆయన్ను సమీపించాడు. ◾  విశ్వాసం- అననుకూల పరిస్థితులను అధిగమిస్తుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో దేవుని దృష్టి అటుగా మరలుతుంది. అతను యేసు దగ్గరకు రాకముందే, అతనిలో విశ్వాసం క్రియను ఆరంభించిన దేవుడు, ముందుగానే అతణ్ణి యెరిగి ఉన్నాడు. అతనితో పాటు ఇంకొంత మంది కూడ...

25May2020

💠 "పేతురు రెండు సంకెళ్ళతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలివారు తలుపు యెదుట చెరసాల కాచుకొనుచుండిరి" (అ.కా 12:6) 💠 🔶  అప్పటికి కొద్ది రోజుల క్రితమే హేరోదు, క్రీస్తు శిష్యుడైన యాకోబును ఖడ్గంతో చంపించి, యూదుల మెప్పు కోసం కూడా పేతురును చెరసాలలో వేయించాడు. పేతురు మరణానికి అతి సమీపంలో ఉన్నప్పటికీని.. పేతురు నిశ్చింతగా నిద్రపోతున్నట్లు మనం లేఖనాలల్లో చూస్తాము. కానీ ఇదే పేతురు ఒకప్ పుడు ప్రాణ భయంతో ఉన్న వ్యక్తిగా మనకు తెల్సు(మత్తయి 8:25, 14:30, మార్కు 14:71) అప్పటికి కూడా పేతురు విశ్వసే అయినప్పటికీ ప్రాణ భయంతో భయపడే వానిగా ఉన్నాడు. దానికి గల కారణాన్ని ప్రభువు చెప్పాడు. అదే "అల్ప విశ్వాసం" (మత్తయి 8:26, 14:31). 🔶  సమస్త పరిస్థితులు దేవుని అధీనంలో ఉన్నాయని సంపూర్ణంగా నమ్మి, ఆయనను ఆనుకోవడం విశ్వాసం. ఆయన అనుమతి లేకుండా విశ్వాసి జీవితంలో ఏమి జరగదని, ఆయన అనుమతితోనే ప్రతికూల పరిస్తితుల్లోకి మనం అడుగు పెట్టామని సంపూర్ణంగా నమ్మడం. ఆ విశ్వాసమే క్రీస్తును పిలాతు ముందు దైర్యంగా నిలబడునట్లు చేసింది (యోహాను 19:11) పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనమందరం (ప్రతి విశ్...

24May2020

✴   దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది. దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు. అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు. (ఆది 6: 11,12, 8 ) ✴ ■ నోవహు దినాల్లో ప్రజల అక్రమము ప్రబలిపోయింది. హింసతోను, దురాక్రమణతో నింపబడి..దేవుడు-'నేను నరుణ్ణి ఎందుకు చ ేశానని' నొచ్చుకునేంతగా చెడుతనం విస్తరించింది. ఎవరి మూలంగా మనిషి ఉనికిలోకి వచ్చి ఈ లోకంలో బ్రతుకుతున్నాడో, ఆయన్ను విడచి, మరచి తమ సొంత మార్గాల్లో ఇష్టానుసారంగా జీవిస్తూ తమ నడత లను చేరిపి వేసుకున్నారు. ప్రతి మనిషి విషయంలో దేవుడు నిర్దిష్టమైన, శ్రేష్టమైన ప్రణాళికలను ముందుగానే కలిగి ఉంటాడు. అది దేవుడు వారి మేలు కోసమే ఏర్పాటు చేసిన మంచి మార్గం. దానికి అవతలనున్న దేవుడు లేని ప్రతి మార్గం శరీర సంబంధమైనదై లోకపు దురాశలతో పాపంతో నిండి ఉంటుంది. ఐతే మంచిని చెడును తమ స్వేచ్ఛలో నుండి కోరుకునే దేవుని లాంటి లక్షణాలతో నరుడు పుట్టించబడ్డాడు. అలాంటి స్వేచ్ఛ నరునికి దేవునిచే ఇవ్వబడింది. దేవుడు లేని జీవిత...

01Oct2018

✴️ ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు. యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు-"చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు. నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు" (న్యాయ 13:1-5) ✴️ ■ మనోహ దంపతులు భక్తిపరులు. దేవుడు తన ప్రణాళికల నెరవేర్పును ఈ కుటుంబం నిలబెట్టుతుందని, తాను పంపబోయే రక్షకుణ్ణి ఈ దంపతులు చక్కగా పెంచగలుగుతారని నమ్మాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడిపించే రక్షకుడు, న్యాయధిపతికి వారు తల్లిదండ్రులగా ఉండబోతారని ఉహించి కూడా ఉండరు. దైవ ప్రణాళికల్లో భాగంగానే వారు కొంతకాలంగా పిల్లలు లేని దంపతులుగా ఉన్నారు. సహజంగానే దుఃఖం, ఆవేదన, అవమానాల గ...

13Jun2018

✴️ రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. వెంటనే యేసు-“ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు. పేతురు-“ప్రభూ! నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. యేసు-“రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని, గాలిని చూసి భయపడి మునిగిపోతూ-“ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు.వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని-“అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు. యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది...✴️ ■ ఇక్కడ 'నీళ్ళ మీద నడవడం' అనే సంగతి కంటే లోతైన ఆత్మీయ పాఠాన్ని దేవుడు తన శిష్యులకు నేర్పిస్తున్నాడని మనకు అర్ధమౌతుంది (తర్వాత రోజుల్లో ఎవరూ నీటి మీద నడిచినట్లుగాని, దాని గూర్చి మాట్లాడినట్లు గాని మనం చూడము). పేతురు కూడా మన వంటి పాపపు స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండినప్పటికీ(లుకా 5:8), యేసు వలె నీటిపై నడవడం నిజంగా మనకు మరింత గొప్ప ప్రోత్సాహన్ని కలిగిస్తుంది. మన జీవితంలో దేవుడు పంప...

25Apr2018

✴️ అబ్రాముకు అతని భార్యయైన శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఐగుప్తు దేశానికి చెందిన హాగరు అను ఒక దాసి ఉంది. శారయి అబ్రాముతో౼ "ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో" అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.(ఆది 16:1,2) ✴️ ■ రాహేలు, లేయాలు కూడా సరిగ్గా ఇలాగే యకోబుకు సలహా ఇచ్చారు(ఆది 30:3,9). కానీ దేవుడు వారిని తప్పు పట్టినట్లుగా చూడము. వారి దాసీలకు పుట్టిన పిల్లలను కూడా తక్కిన వారితో సమాన గోత్రాలుగా దేవుడు చేశాడు. ఎందుకంటే అబ్రాము విషయంలో పుట్టబోవు సంతానం గూర్చి స్పష్టమైన దేవుడు వాగ్ధానం ఉంది. అబ్రాము విశ్వాసంతో కనిపెట్టి ఆ వాగ్ధానం పొందుకోవాలి. దేవుని వాక్కు ఎవరికి స్పష్టంగా తెలియజేయబడుతుందో (ప్రత్యక్షత) వారి నుండి దేవుడు ఎక్కువ విధేయతను ఎదురుచూస్తాడు. దేవుడు అబ్రాముతో సంతానం గూర్చి వాగ్దానం(నిబంధన) చేశాడు. సుమారు 10 సం|| ల తర్వాత కూడా పిల్లలు కలుగనందుకు అబ్రాము, అతని భార్యయైన శారయిల విశ్వాసం సన్నగిల్లి పోయింది(ఆది 15:2,16,2). శారయి తనకు ఇక పిల్లలు పుట్టరని దృఢ నిర్ణయానికి వచ్చినదై, అబ్రాముకు పై...

17Apr2018

✴️ యేసు ఆ మాటలు చెప్పి ముగించిన తరువాత ప్రజలు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారి ధర్మశాస్త్ర పండితుల్లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన వారికి ఉపదేశించాడు. (మత్తయి 7:28,29) ✴️ ■ క్రీస్తు బోధ ఆ ప్రజలు విన్న మిగితా భోధకుల కంటే చాలా భిన్నమైనది. శాస్త్రులు పరిసయ్యులు బోధ౼వినువారి తలలను మాత్రమే నింపేవి. ఈ లోకంలో ఎలాగైతే లోకజ్ఞానం ఉందో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా జ్ఞానం ఉంది. అది మనల్ని ఆకట్టుకునే (సత్యమైన) జ్ఞానమై, తప్పుడు భోధకు వెళ్ళకుండా నిన్ను అప్రమత్తం చేసేదిగా ఉండొచ్చు కానీ దేవుని జీవపు ఊటల దగ్గరకు నిన్ను నడుప లేనిదిగా ఉండొచ్చు. అంటే ఈ జ్ఞానం బయట నుండి వచ్చే తప్పుడు భోధల నుండి జాగ్రత్త చేస్తూ, అంతరంగం నుండి 'వ్యక్తిగతంగా దేవున్ని తెలుసుకోవడం' అనే విలువైన జీవపు మాటలను (విస్మరించే) నిర్లక్ష్యం చేసేదిగా ఉండొచ్చు. విత్తనం విత్తనంగా ఉన్నట్లైతే జీవం గల మొక్కను పుట్టించలేదు. అనుకూలమైన వాతావరణంలోనే (నేల, నీరు మొ||) అది జీవం పోసుకుంటుంది. సరైన వాక్యము-దాని వివరణ కూడా 'విత్తనమే' గాని జీవం కాదు. సరైన సిద్ధాంత జ్ఞానం కొన్నిసార్లు ఇతరులను తమ కంటే తక్కువైన వారిగా చిన్న...

12Apr2018

✴️ ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషాను చూచి ఇలా మొర పెట్టింది. ౼“మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. ఆయనకు యెహోవా అంటే భయభక్తులని  మీకు తెలుసు గదా. మాకు అప్పిచ్చిన వాడు వచ్చి నా ఇద్దరు కొడుకులను బానిసలుగా తీసుకుపోవాలని ఉన్నాడు.”  ఎలీషా౼“నేను నీకు ఎలా సహాయం చేయాలి? నీ ఇంట్లో ఏం ఉన్నదో నాకు చెప్పు” అన్నాడు. అందుకామె౼“మీ దాసురాలైన నా ఇంట్లో ఒక కుండ నిండా నూనె తప్ప ఇంకేమీ లేదు” అంది. ఎలీషా ౼“నీవు బయటికి వెళ్ళి నీ పొరుగువాళ్ళందరి దగ్గర దొరకగలగినన్ని ఖాళీ పాత్రలు ఎరవుగా తెచ్చుకో. అప్పుడు నీవు నీ కొడుకులను ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసివేసి, ఆ పాత్రలన్నిట్లో నూనె పోయండి. నిండిన వాటిని ప్రక్కన పెట్టు”.... ఆమె ఆ విధంగా చేసి, ఆ పాత్రలు నిండిపోయినప్పుడు ఆమె “ఇంకో పాత్ర తీసుకురా” అని కొడుకుతో చెప్తే అతడు “ఇంకొకటి లేదు” అన్నాడు. వెంటనే కుండలో నుండి నూనె సరఫరా నిలిచింది. ఆమె వచ్చి ఎలీషాకు ఆ విషయం తెలియజేసింది. ఎలీషా౼“నీవు వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పు తీర్చు. మిగిలిన దానితో నీవూ, నీ కొడుకులూ బ్రతకండి” అన్నాడు. ✴️ ■ ఒకని జీవితం ఎంత చెడిపోయి, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నపాటున దేవుని దగ్...