Skip to main content

25May2020



💠"పేతురు రెండు సంకెళ్ళతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలివారు తలుపు యెదుట చెరసాల కాచుకొనుచుండిరి" (అ.కా 12:6)💠

🔶 అప్పటికి కొద్ది రోజుల క్రితమే హేరోదు, క్రీస్తు శిష్యుడైన యాకోబును ఖడ్గంతో చంపించి, యూదుల మెప్పు కోసం కూడా పేతురును చెరసాలలో వేయించాడు. పేతురు మరణానికి అతి సమీపంలో ఉన్నప్పటికీని.. పేతురు నిశ్చింతగా నిద్రపోతున్నట్లు మనం లేఖనాలల్లో చూస్తాము. కానీ ఇదే పేతురు ఒకప్పుడు ప్రాణ భయంతో ఉన్న వ్యక్తిగా మనకు తెల్సు(మత్తయి 8:25, 14:30, మార్కు 14:71)
అప్పటికి కూడా పేతురు విశ్వసే అయినప్పటికీ ప్రాణ భయంతో భయపడే వానిగా ఉన్నాడు. దానికి గల కారణాన్ని ప్రభువు చెప్పాడు. అదే "అల్ప విశ్వాసం" (మత్తయి 8:26, 14:31).

🔶 సమస్త పరిస్థితులు దేవుని అధీనంలో ఉన్నాయని సంపూర్ణంగా నమ్మి, ఆయనను ఆనుకోవడం విశ్వాసం. ఆయన అనుమతి లేకుండా విశ్వాసి జీవితంలో ఏమి జరగదని, ఆయన అనుమతితోనే ప్రతికూల పరిస్తితుల్లోకి మనం అడుగు పెట్టామని సంపూర్ణంగా నమ్మడం.
ఆ విశ్వాసమే క్రీస్తును పిలాతు ముందు దైర్యంగా నిలబడునట్లు చేసింది (యోహాను 19:11)
పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనమందరం (ప్రతి విశ్వాసి)అడుగు పెట్టాలనేదే పరమ తండ్రి కోరిక. ఇది విశ్వాసిలో దేవుడు తన ఆత్మ ద్వారా ఆరంభించే కార్యం. క్రీస్తు పరిశుద్ధాత్మపూర్ణుడై దేవుని సంపూర్ణ అధీనంలో జీవించాడు. అపొస్తలలు పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా నింపబడినప్పుడే వారి ప్రవర్తనలో గొప్ప మార్పును చూస్తాము. పరిశుద్ధాత్మ పరమ దేవుణ్ణి స్పష్టంగా మనకు చూపు సహాయకారియై ఉన్నాడు. మనపై దేవుని ఆధిపత్యాన్ని (ఆత్మ నింపుదలకు) మనం ఒప్పుకున్నప్పుడు మనలో కలిగే ఫలం-'విశ్వాసం'..విశ్వాస సంపూర్ణతలోకి దినదినం నడిపింపబడటం జరుగుతుంది.

🔶 కనుక రేపటిని గూర్చిన చింత, పరిస్థితుల గురించిన ఆందోళన, మరణ భయాలు ఇకను మనలను యెలవు.
అవన్నీ ఆయన అధీనంలో ఉంచబడివున్నాయి. దేని గురించి ఆందోళన చెందుతున్నావు? దేవుడు వాటన్నింటినీ పైన ఉన్నాడని గుర్తిస్తున్నావా?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...