Skip to main content

27May2020



💠 దేవుడు యోనాతో- "నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము"......
యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు. నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు...
నీనెవె వాళ్ళు తమ చెడు ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు. (యోనా 1:2; 3:4,5,10)💠

 నీనెవె అహంకారంతోనూ, హింసాత్మకంగా, పూర్తిగా చెడిపోయిన క్రూరమైన పట్టణం. అటువంటి పట్టణానికి దేవుడు శిక్ష విధించాలనుకున్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన తీర్పులను భూమి పైకి పంపుతాడు. దేవుని మౌనాన్ని కొన్నిసార్లు ఆయనేమి పట్టించుకొనట్లుగా మనకు అనిపిస్తుంది కానీ ఆయన మౌనంలో కూడా ఆయన పనిచేస్తుంటాడు. ఆయన చెయ్యాలకున్న పనిని ఒక ఘడియ ఆలస్యం చెయ్యడు, ఒక ఘడియ ముందు చెయ్యడు గాని ఆయన సమయంలోనే చేస్తాడు. అయినప్పటికీ దేవుడు కనికరం గలవాడే కానీ శిక్షించాలని ఎదురు చూచువాడు కాదు. అందుకు పైన తెలిపిన లేఖన భాగం ఒక చక్కటి ఉదాహరణ.

 నీనెవె పట్టణం మారుమనస్సు పొందడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మారుమనస్సు అనగా ఒకడు దేవునిచే ఒప్పింపబడి తన చెడు స్థితిని గ్రహించి ఉన్నపాటున దేవుని వైపు తిరగడం. యోనా దేవుని హెచ్చరికను నీనెవెకు ప్రకటించాడు. ఆ ప్రజలు దేవుని వాక్కుకు విధేయత చూపారు. ప్రకటించింది యోనా ఐనప్పటికీ ఆ మాటలు దేవునివని గుర్తించారు. పశ్చాత్తాపడి దేవునికి ప్రార్ధించారు (గొనె పట్ట అప్పటికి రోజుల్లో తమ దుఃఖాన్ని తెలియజేసే ఒక విధానం).

 దేవుడు నీతిమంతుడు, న్యాయమంతుడు మాత్రమే కాదు ఆయన గొప్ప తండ్రీ. సర్వోన్నతుడైన దేవుడు తన బిడ్డల పట్ల వాత్సల్యం చూపే తండ్రి వంటి వాడు. పాపం నుండి వెనుతీసి, దేవుని వైపు తిరిగిన (మారుమనస్సు పొందిన) మరుక్షణం, ఆ వ్యక్తి అప్పటి వరకు ఎంత పాపంలో ఉన్నప్పటికిని వాటి గూర్చి లెక్కలు అడగడు గాని వెంటనే తన అక్కున చేర్చుకుంటాడు. మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామో ఎదురు చూస్తుంటాడు. ఇది మన గమనానికి లేకపోయినా, ఇది నిజం!

 నీనెవె పట్టణం విషయంలోనూ దేవుడు అలాగే చేశాడు. నీనెవెతో మాత్రమే కాదు, ఆయన వద్దకు వచ్చే ప్రతి వ్యక్తితో దేవుడు అలాగే ప్రవర్తిస్తాడు. నేడు ఆయన మన వద్ద నుండి కోరేది ఒక్కటే.
౼ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నపాటున దేవుని వైపు తిరగడం.
౼ తప్పుడు జీవితం విషయంలో పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ కొరకు వేడుకోవడం.
౼ దేవుని మార్గంలో నిలవడం
ఐతే న్యాయవంతుడైన దేవుడు మనం చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే! అదే సరైన న్యాయం. కనుకనే ఆ పాపం క్రీస్తుపై మోపి, ఆయన శరీరంలో మన పాపానికి శిక్ష విధించాడు. పరిశుద్ధుడైన క్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఎందుకంటే క్రీస్తే మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడ్డాడు. ఆయన వద్ద క్షమించబడిన ప్రతి పాపానికి ఇకను శిక్ష ఉండదు.
క్రీస్తులో(దాగి) ఉన్న వారికి ఏ శిక్ష ఉండదు. ఆయనే రక్షకునిగా వారిని కాపాడుకుంటాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...