Skip to main content

26May2020



💠 ఆయన (యేసు) ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి-"ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు" అనెను.
అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి-"నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని" చెప్పగా తక్షణమే వాని కుష్టరోగము శుద్ధియాయెను.
(మత్తయి 8:1-3)💠

 ఆ రోజుల్లో కుష్టరోగము వైద్యం లేని భయంకరమైన వ్యాధి. గొప్ప పాపాత్ములకు దేవుడు విధించే శిక్షగా ప్రజలు భావించేవారు. సొంత కుటుంబీకులకు, సమాజానికి దూరంగా వెలివేయబడి, శారీరక-మానసిక క్షోభకులోనవుతూ బ్రతికే దుర్భరమైన జీవితం. ఈ కుష్ఠు రోగి కూడా అటువంటి పరిస్థితిల్లో యేసుని గూర్చి విని, ఆయన తనను బాగుచేయగలడని నమ్మి, ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో జనసమూహంలోకి కుష్ఠు రోగులకు ప్రవేశం లేదు కానీ, ఆ కుష్ఠు రోగి ఏదో ఒక విధంగా ఆయన్ను సమీపించాడు.

 విశ్వాసం- అననుకూల పరిస్థితులను అధిగమిస్తుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో దేవుని దృష్టి అటుగా మరలుతుంది. అతను యేసు దగ్గరకు రాకముందే, అతనిలో విశ్వాసం క్రియను ఆరంభించిన దేవుడు, ముందుగానే అతణ్ణి యెరిగి ఉన్నాడు. అతనితో పాటు ఇంకొంత మంది కూడా యేసుని గూర్చి వినివుండొచ్చు(లేదా ఇతనే తన తోడి కుష్ఠురోగులను తనతో కూడా పిలిచి ఉండొచ్చును). కాని యేసు తమను తమ వ్యాధి నుండి విడిపిస్తాడన్న విశ్వాసం వారు కలిగి లేకుండా ఉండొచ్చును. విశ్వాసం లేకుండా దేవుని కొరకు ప్రతికూల పరిస్థితులను అధిగమించి దేవుని వైపు తిరుగలేరు. దేవుడు మనుష్యులను, వారి అంతరంగాన్ని పరీక్షించే వానిగా ఉన్నాడు.
ఆ కుష్ఠు రోగి విశ్వాసాన్ని దేవుడు చూచాడు. క్రీస్తుకు ఇష్టమైతే స్వస్థపరచవల్సిందిగా కోరగా ఆయన చెప్పాడు-తనకు ఇష్టమేనని.

 క్రీస్తు- అదృశ్య దేవుని సంపూర్ణ రూపంగా మన మధ్యలో సశరీరునిగా జీవించాడు. విశ్వాసంతో దేవుణ్ణి సమీపించే ప్రతి వారిని దేవుడు ఇష్టపడతాడు(హెబ్రీ 11:6). దేవుడే మన ప్రతి ప్రశ్నకు సమాధానమై ఉన్నాడు. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన నిజంగా ఉన్నాడని, ఆయన్ను సమీపించే వారిని ఆయన తప్పకుండా ఆదరిస్తాడని నమ్మాలి. ఆయన ప్రియ కుమారుడైన యేసును శిలువలో మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించడం ద్వారా ఆయన తన ప్రేమను మన పట్ల రుజువు చేశాడు. కుష్ఠురోగం జీవితాంతం శరీరాన్ని వేధిస్తే..'పాపం'-మానవుని ఆత్మను నిత్యత్వంలో సర్వకాలం దేవుని ఉగ్రత క్రింద (నరకంలో) ఉంచుతుంది.

🔹 ప్రియమైన చదువరి.. క్రీస్తు నీ పాపపు శిక్షను ఆయన తన శరీరంలో, ఆత్మలో భరించాడు. నీ పూర్తి క్షమాపణ క్రీస్తు వద్ద, క్రీస్తులో ఉంది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, విశ్వాసంతో దేవుణ్ణి క్షమించమని కోరు. ఆయన తన రక్తంలో నీ ప్రతి పాపాన్ని కడిగి, ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. అలా జరగనట్లైతే మన దోషాలకు మనమే జవాబుదారులంగా ఉంటాము. దాని అంతం దేవుని ఉగ్రత. ఒకసారి మానవుడు చనిపోయినట్లైతే తర్వాత ఈ అవకాశం ఇకను ఉండదు. నీకు ఇంకను దేవుని కృప అనుగ్రహించబడి ఉన్నది. ఆ కుష్ఠు రోగి క్రీస్తును సమీపించి శుద్ధుడైనట్లుగా, నీ పాపపు జీవితం నుండి విడుదల పొంది, పరలోక దేవుని కుమారుడిగా క్రొత్త జీవితం పొందు..పాపం నుండి దేవుని వైపు తిరుగు ప్రతి ఒక్కరి నిమిత్తం దేవుడు ఎదురుచూస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...