Skip to main content

30May2020



★ యేసు సుంకరియైన మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలా మంది అన్యాయస్థులైన పన్నులు వసూలు చేసే వారూ, పాపులూ వచ్చి ఆయనతోనూ, ఆయన శిష్యులతో పాటు కూర్చున్నారు.
మతనిష్ఠ గల పరిసయ్యులు అది గమనించి౼“మీ బోధకుడు పన్ను వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తింటున్నాడేంటి?” అని ఆయన శిష్యుల్ని అడిగారు.
యేసు అది విని౼“ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకే అవసరం. నేను పాపులను పశ్చాత్తాపానికి పిలవడానికే వచ్చాను, నీతిపరులను కాదు.” అని చెప్పాడు. (మత్తయి 9:10-13) ★

■ పరిసయ్యులు దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో, విశ్రాంతి దినం-పవిత్ర పండుగలను ఆచరించడంలోనూ ఎంతో మతనిష్ఠను పాటిస్తారు మరియు నిత్యం ఉపవాసాలతో, ప్రార్ధనల్లో తాము ఉంటారు గనుక తామే పవిత్రలమని అనుకుంటారు. మత నిష్ఠలేని, తప్పుడు పనులు చేసే వారంతా పాపాత్ములనేది వారి భావన. కనుక వారితో కలిసి భోజనం (సహవాసం) చెయ్యడానికి కూడా ఇష్టపడరు. అలా చేయడం ద్వారా దేవుడు తమ పట్ల ఎంతో సంతోషిస్తాడని భావిస్తారు.

■ కానీ దేవుని స్వభావం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. యేసు పాపుల స్నేహితునిగా పిలవబడ్డాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ వారి మధ్యలో జీవించాడు. భూమిపై నివసించిన అత్యంత పరిశుద్ధుడైన యేసు ఎన్నడూ వారిని చిన్న చూపు చూడలేదు. వారిని ప్రేమించాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు (లూకా 19:20). శాస్త్రులు పరిసయ్యుల ప్రవర్తనకు యేసుకు ఎంతో వ్యత్యాసం ఉండేది. కనుకనే పాపం చేసిన అనేకమంది యేసు దగ్గరకు రావడానికి ఇష్టపడ్డారు. ఆయన సహవాసంలో వారు మారుమనస్సు పొంది, క్రొత్త జీవితాన్ని ఆరంభించారు.
దేవుని వల్ల కలిగిన పవిత్రత వెలుగు వంటిది, చీకటిలో ఉన్న వారికి వాని స్థితిని గుర్తించి వెలుగులోకి వచ్చేట్లు ప్రేమిస్తుంది.

■ దేవుని పని ఒకనిలో ఆరంభం కావాలంటే ఖచ్చితంగా తన స్థితిని తాను యదార్ధంగా ఒప్పుకునేవానిగా ఉండాలి. బాహ్యంగా కనిపించే మత భక్తి ఎవ్వరిని పవిత్రునిగా చేయలేదు. మానవునికి అంతరంగ శుద్ధి అవసరం. అది దేవుని మూలంగానే జరగాల్సి ఉంటుంది. కొన్ని ఇతరులు చేస్తున్న పాపాలు మనం చేయట్లేదు కాబట్టి మనం నీతిపరులం అని అనుకోకూడదు. అది ఎలాంటి పాపమైనా దేవుని దృష్టిలో పాపమే. మనమంతా దేవుని పరిశుద్ధ మహిమను కోల్పోయిన వారముగా ఉన్నాము! కనుక ఎవ్వరూ ఎవర్ని చూసి అతిశయింప తగదు. మనం అతిశయిస్తున్నట్లైతే అది దేవుని ద్వారా కలిగిన పవిత్రత కాదు. అది మన స్వనీతి! దేవుని నుండి కలిగిన పవిత్రత ఆయన పాపులతో ప్రవర్తించిన విధంగానే ప్రవర్తింపజేస్తుంది (ఎందుకంటే ఒకప్పుడు మన అసహ్య జీవితాలను చూసి దేవుడు త్రోసివేయక ప్రేమించాడు, ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నవారిని పట్ల కూడా కనికరాన్నే చూపుతుంది).

౼ కాబట్టి ఎవరు తమను తాము రోగి(పాపి) గా గుర్తిస్తారో పరమ వైద్యుడైన క్రీస్తు కృపను, క్షమాపణను పొందుతారు. దేవుని స్నేహం అట్టి వారితో ఉంటుంది.
ఎవరైతే తాము చేస్తున్న మంచి పనులను బట్టి, మత నిష్ఠ కలిగిన కార్యాలను బట్టి తాము 'నీతిమంతులం' ఉప్పొంగుతారో వారు దేవుని మహిమలోకి ఎన్నడూ ప్రవేశించలేరు. పరలోకంలో (స్వ)నీతిమంతులు ఉండరు గాని..యదార్థవంతులైన క్షమించబడిన పాపులే అక్కడ ఉంటారు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...