✴️ యేసు ఆ మాటలు చెప్పి ముగించిన తరువాత ప్రజలు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారి ధర్మశాస్త్ర పండితుల్లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన వారికి ఉపదేశించాడు. (మత్తయి 7:28,29) ✴️
■ క్రీస్తు బోధ ఆ ప్రజలు విన్న మిగితా భోధకుల కంటే చాలా భిన్నమైనది. శాస్త్రులు పరిసయ్యులు బోధ౼వినువారి తలలను మాత్రమే నింపేవి. ఈ లోకంలో ఎలాగైతే లోకజ్ఞానం ఉందో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా జ్ఞానం ఉంది. అది మనల్ని ఆకట్టుకునే (సత్యమైన) జ్ఞానమై, తప్పుడు భోధకు వెళ్ళకుండా నిన్ను అప్రమత్తం చేసేదిగా ఉండొచ్చు కానీ దేవుని జీవపు ఊటల దగ్గరకు నిన్ను నడుప లేనిదిగా ఉండొచ్చు. అంటే ఈ జ్ఞానం బయట నుండి వచ్చే తప్పుడు భోధల నుండి జాగ్రత్త చేస్తూ, అంతరంగం నుండి 'వ్యక్తిగతంగా దేవున్ని తెలుసుకోవడం' అనే విలువైన జీవపు మాటలను (విస్మరించే) నిర్లక్ష్యం చేసేదిగా ఉండొచ్చు. విత్తనం విత్తనంగా ఉన్నట్లైతే జీవం గల మొక్కను పుట్టించలేదు. అనుకూలమైన వాతావరణంలోనే (నేల, నీరు మొ||) అది జీవం పోసుకుంటుంది. సరైన వాక్యము-దాని వివరణ కూడా 'విత్తనమే' గాని జీవం కాదు. సరైన సిద్ధాంత జ్ఞానం కొన్నిసార్లు ఇతరులను తమ కంటే తక్కువైన వారిగా చిన్న చూపుకు నడుపుతుంది. శాస్త్రులు, పరిసయ్యులు ప్రకటించిన వాక్యం ఇటువంటిదే. అది అబద్ద భోధకాదు..సరైనదే (మత్త 23:3). కానీ అందులో ఎటువంటి జీవం లేదు. కనుకనే జీవాధిపతిని తిరస్కరించి చంపివేశారు.
■ ఐతే జీవానికి నడిపించే జ్ఞానం మరొకటి ఉంది. అది దేవుని వెలుగులో మన స్థితిని చూపించి, సత్యానికి విధేయత చూపమని చెప్పే జీవమైన జ్ఞానం. అది మన ఆత్మలను వెలిగింస్తుంది. అటువంటి బోధ విన్న తర్వాత దేవుడు నీతో మాట్లాడ్డాడని గ్రహిస్తావే గాని, భోధకుని మాటలు/జ్ఞానం చేత ఆకర్షించబడి అతణ్ని మహిమపర్చవు. అవి వాక్చాతుర్యంతో ఆకట్టుకునే మాటలుగా ఉండవు లేదా విమర్శనాత్మతో కూడిన నిరీక్షణ రహితమైన మాటలు కూడా కావు గాని మన ఆత్మలను విలిగించి, దేవునికి సమీపస్థులుగా చేస్తూ, చెయ్యి అందించి సహాయపడే మాటలుగా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ పనిని మనలో కొనసాగించగలడు. ఆ పని ఎవరిలో కొనసాగుతుందో అట్టి వారే (దేవుని జీవం తమలో గల వ్యక్తులే) ఆ జీవాన్ని ప్రకటించగలరు. ఇదే జీవమైవున్న క్రీస్తులో నిలిచివుండటం అంటే! 'మానవ చమత్కారమైన తెలివితేటలతో కాక, దేవుని ఆత్మ ద్వారా విరిచి ఇవ్వబడిన వాక్యం' అనే దేవుని జీవం అప్పుడు నీలో ప్రవహిస్తుంది. ఆ వాక్యానికి లోబడటం ద్వారా దేవుని లక్షణాలు ఫలభరితంగా మనలో నుండి బయటకు వస్తాయి. ఐతే దేవుని ఆత్మతో నింపబడిన మాటలు కఠిన పర్చుకున్న వారికి ఆగ్రహాన్ని-తిరస్కారాన్ని కలిగించేవిగా ఉండగా, యాదార్ధవంతులకు సర్వసత్యంలోకి, జీవంలోకి నడిపిస్తాయి. క్రీస్తు తాను ఆచరించిన మాటలనే ప్రకటించాడు కనుకనే వాటిని అధికారంతో భోధించాడు.
■ మనకు వాక్యం ఎంత లోతుల్లో తెలుసో చూడక, తెలిసిన వాక్యానికి ఎంత విధేయత చూపుతున్నామో భేరీజు వేసుకోవాలి. అలా లేనప్పుడు మన కంటే వాక్య పరిజ్ఞానం తక్కువ కలిగి, దానికి సంపూర్ణంగా విధేయత చూపే వారి భక్తి మన కంటే గొప్పదిగా ఉంటుంది. తలలను మాత్రమే తాకుతూ, ఉప్పొంగ చేసే దైవజ్ఞానం విలువ దేవుని యెదుట శూన్యం అని గుర్తించుకోండి. అది దేవుని నుండి కలగలేదనటానికి అదే నిదర్శనం. దేవునిలో నుండి కలిగే జ్ఞానం దీనత్వాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే అది మన నుండి కలిగినది కాదు కాబట్టి. దైవజ్ఞానం దేవునిలో పసిపిల్లలకు(దీనులకు) దొరుకుతుంది. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు మరి ఎక్కువగా తిరస్కారానికి గురి అయినట్లుగా వాక్యం సెలవిస్తుంది.(ప్రముఖులుగా కనిపించే) ప్రతి భోధకుణ్ణి నమ్మొద్దు, వారి మాటలు జీవానికి (ప్రభువుకు దగ్గరగా) నడిపించేవో కావొ వివేచించండి. కొందరు భోధకులు వాక్యపు విలువలతో కాక, తమ పాత స్వభావాలను విడిచిపెట్టక, వాటితోనే ప్రభువు సేవించే వారిగా ఉన్నారు. విమర్శలకు, వాదనలకు, స్వంత జ్ఞానంతో పరిష్కరాలకు, వింత పోకడలకు, ధనార్జనకు, తమ సామ్రాజాలను స్థాపించు కొనుటకు ఆసక్తిపరులగా ఉంటారు. అలాంటి వారి నుండి దూరంగా వెళ్లిపోండి. అలాంటి వారిలో దేవుని జీవం ఎంతమాత్రం నివసించదు.
■ క్రీస్తు బోధ ఆ ప్రజలు విన్న మిగితా భోధకుల కంటే చాలా భిన్నమైనది. శాస్త్రులు పరిసయ్యులు బోధ౼వినువారి తలలను మాత్రమే నింపేవి. ఈ లోకంలో ఎలాగైతే లోకజ్ఞానం ఉందో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా జ్ఞానం ఉంది. అది మనల్ని ఆకట్టుకునే (సత్యమైన) జ్ఞానమై, తప్పుడు భోధకు వెళ్ళకుండా నిన్ను అప్రమత్తం చేసేదిగా ఉండొచ్చు కానీ దేవుని జీవపు ఊటల దగ్గరకు నిన్ను నడుప లేనిదిగా ఉండొచ్చు. అంటే ఈ జ్ఞానం బయట నుండి వచ్చే తప్పుడు భోధల నుండి జాగ్రత్త చేస్తూ, అంతరంగం నుండి 'వ్యక్తిగతంగా దేవున్ని తెలుసుకోవడం' అనే విలువైన జీవపు మాటలను (విస్మరించే) నిర్లక్ష్యం చేసేదిగా ఉండొచ్చు. విత్తనం విత్తనంగా ఉన్నట్లైతే జీవం గల మొక్కను పుట్టించలేదు. అనుకూలమైన వాతావరణంలోనే (నేల, నీరు మొ||) అది జీవం పోసుకుంటుంది. సరైన వాక్యము-దాని వివరణ కూడా 'విత్తనమే' గాని జీవం కాదు. సరైన సిద్ధాంత జ్ఞానం కొన్నిసార్లు ఇతరులను తమ కంటే తక్కువైన వారిగా చిన్న చూపుకు నడుపుతుంది. శాస్త్రులు, పరిసయ్యులు ప్రకటించిన వాక్యం ఇటువంటిదే. అది అబద్ద భోధకాదు..సరైనదే (మత్త 23:3). కానీ అందులో ఎటువంటి జీవం లేదు. కనుకనే జీవాధిపతిని తిరస్కరించి చంపివేశారు.
■ ఐతే జీవానికి నడిపించే జ్ఞానం మరొకటి ఉంది. అది దేవుని వెలుగులో మన స్థితిని చూపించి, సత్యానికి విధేయత చూపమని చెప్పే జీవమైన జ్ఞానం. అది మన ఆత్మలను వెలిగింస్తుంది. అటువంటి బోధ విన్న తర్వాత దేవుడు నీతో మాట్లాడ్డాడని గ్రహిస్తావే గాని, భోధకుని మాటలు/జ్ఞానం చేత ఆకర్షించబడి అతణ్ని మహిమపర్చవు. అవి వాక్చాతుర్యంతో ఆకట్టుకునే మాటలుగా ఉండవు లేదా విమర్శనాత్మతో కూడిన నిరీక్షణ రహితమైన మాటలు కూడా కావు గాని మన ఆత్మలను విలిగించి, దేవునికి సమీపస్థులుగా చేస్తూ, చెయ్యి అందించి సహాయపడే మాటలుగా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ పనిని మనలో కొనసాగించగలడు. ఆ పని ఎవరిలో కొనసాగుతుందో అట్టి వారే (దేవుని జీవం తమలో గల వ్యక్తులే) ఆ జీవాన్ని ప్రకటించగలరు. ఇదే జీవమైవున్న క్రీస్తులో నిలిచివుండటం అంటే! 'మానవ చమత్కారమైన తెలివితేటలతో కాక, దేవుని ఆత్మ ద్వారా విరిచి ఇవ్వబడిన వాక్యం' అనే దేవుని జీవం అప్పుడు నీలో ప్రవహిస్తుంది. ఆ వాక్యానికి లోబడటం ద్వారా దేవుని లక్షణాలు ఫలభరితంగా మనలో నుండి బయటకు వస్తాయి. ఐతే దేవుని ఆత్మతో నింపబడిన మాటలు కఠిన పర్చుకున్న వారికి ఆగ్రహాన్ని-తిరస్కారాన్ని కలిగించేవిగా ఉండగా, యాదార్ధవంతులకు సర్వసత్యంలోకి, జీవంలోకి నడిపిస్తాయి. క్రీస్తు తాను ఆచరించిన మాటలనే ప్రకటించాడు కనుకనే వాటిని అధికారంతో భోధించాడు.
■ మనకు వాక్యం ఎంత లోతుల్లో తెలుసో చూడక, తెలిసిన వాక్యానికి ఎంత విధేయత చూపుతున్నామో భేరీజు వేసుకోవాలి. అలా లేనప్పుడు మన కంటే వాక్య పరిజ్ఞానం తక్కువ కలిగి, దానికి సంపూర్ణంగా విధేయత చూపే వారి భక్తి మన కంటే గొప్పదిగా ఉంటుంది. తలలను మాత్రమే తాకుతూ, ఉప్పొంగ చేసే దైవజ్ఞానం విలువ దేవుని యెదుట శూన్యం అని గుర్తించుకోండి. అది దేవుని నుండి కలగలేదనటానికి అదే నిదర్శనం. దేవునిలో నుండి కలిగే జ్ఞానం దీనత్వాన్ని పుట్టిస్తుంది. ఎందుకంటే అది మన నుండి కలిగినది కాదు కాబట్టి. దైవజ్ఞానం దేవునిలో పసిపిల్లలకు(దీనులకు) దొరుకుతుంది. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు మరి ఎక్కువగా తిరస్కారానికి గురి అయినట్లుగా వాక్యం సెలవిస్తుంది.(ప్రముఖులుగా కనిపించే) ప్రతి భోధకుణ్ణి నమ్మొద్దు, వారి మాటలు జీవానికి (ప్రభువుకు దగ్గరగా) నడిపించేవో కావొ వివేచించండి. కొందరు భోధకులు వాక్యపు విలువలతో కాక, తమ పాత స్వభావాలను విడిచిపెట్టక, వాటితోనే ప్రభువు సేవించే వారిగా ఉన్నారు. విమర్శలకు, వాదనలకు, స్వంత జ్ఞానంతో పరిష్కరాలకు, వింత పోకడలకు, ధనార్జనకు, తమ సామ్రాజాలను స్థాపించు కొనుటకు ఆసక్తిపరులగా ఉంటారు. అలాంటి వారి నుండి దూరంగా వెళ్లిపోండి. అలాంటి వారిలో దేవుని జీవం ఎంతమాత్రం నివసించదు.
Comments
Post a Comment