Skip to main content

01Oct2018



✴️ ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.

యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు-"చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు. నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు"

(న్యాయ 13:1-5) ✴️

■ మనోహ దంపతులు భక్తిపరులు. దేవుడు తన ప్రణాళికల నెరవేర్పును ఈ కుటుంబం నిలబెట్టుతుందని, తాను పంపబోయే రక్షకుణ్ణి ఈ దంపతులు చక్కగా పెంచగలుగుతారని నమ్మాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడిపించే రక్షకుడు, న్యాయధిపతికి వారు తల్లిదండ్రులగా ఉండబోతారని ఉహించి కూడా ఉండరు. దైవ ప్రణాళికల్లో భాగంగానే వారు కొంతకాలంగా పిల్లలు లేని దంపతులుగా ఉన్నారు. సహజంగానే దుఃఖం, ఆవేదన, అవమానాల గుండా వెళ్ళి వారు ఉంటారు. ఎందుకంటే గొడ్రాలితనం దేవుని శాపంగా భావించే రోజుల్లో వారు ఉన్నారు. వారు సంతానం కోసం దేవునికి అనేక మార్లు మొఱ్ఱపెట్టి ఉంటారు. కానీ వారి ప్రార్ధనలకు వారు ఎదురుచూసిన జవాబు వారికి రాలేదు.



■ పైన చెప్పబడిన వాక్య సందర్భం తర్వాత,(v13:8) మనోహ మరోమారు దైవజనుడ్ని (దూతను) పంపమని దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు మనోహ ప్రార్ధన విని మరళా దూతను మనోహ దంపతుల దగ్గరకు పంపాడు. దేవుని ఆలోచనల్లో ఈ కుటుంబం ఉన్నప్పటికీనీ, వీరి ప్రార్ధనలను దేవుడు ఆలకిస్తున్నప్పటికినీ.. వారు ఎదురుచూసిన జవాబు వారికి రాలేదు. వారి గమనానికి లేకపోవచ్చు గాని, వారి ప్రార్ధనల జవాబు దేవుని నెరవేర్పు కాలం కోసం వేగిరపడుతూ అత్యంత శ్రేష్ఠమైనదిగా ఉండబోతుంది. మనోహ దంపతులు సంతానం కోసం దేవుని దగ్గర ప్రార్ధించి ఉండొచ్చు కానీ దేవుడు ఇశ్రాయేలీయుల రక్షకుణ్ణి వారి గర్భావాసాన ఇవ్వడానికి ప్రణాళికలను సిద్ధపరచాడు. మన దేవుడు..మనం అడిగిన దానికంటే, ఊహించిన దాని కంటే శ్రేష్ఠమైన ఆలోచనలను మన పట్ల కలిగి ఉన్నాడు. ఇది మనం నమ్మాలి.



★ కొన్నిసార్లు విశ్వాసి మొరపెట్టినప్పటికినీ దేవుని నుండి జవాబు ఆలస్యమౌతుంటే, అది ఒకవేళ దేవుని సమయం కాదని గుర్తించాలి. (లేదా దేవుడు వద్ద నుండి "కాదు" అనే స్పష్టమైన జవాబు ఉంటే, అదే కొదువలో నుండే ఆయన తన ప్రణాళికలను నెరవేర్పును కోరతున్నాడని అర్ధం చేసుకోవాలి). ఒకని కొదువ/సమృద్ధి అది వారి భక్తిని కానీ, వారికి దేవునితో ఉన్న సంబంధాన్ని కానీ సూచించదు. ఆయన సమయం కోసం ఎదురుచూస్తూ, దేవుని మదిలోని చిత్తాన్ని గౌరవిస్తూ దైవ ప్రణాళికల్లో ఒకడు నిలిచి ఉండటమే నిజమైన భక్తి.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...