Skip to main content

23May2020



 యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు. కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించలేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు.
యెహోవా కయీనుతో౼"ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు నీ మొఖం చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుని ఉండేవాడివి కదా!" (ఆది 4:4-7) 

■ దేవుడు ఆ అన్నదమ్ములిద్దరూ అర్పించిన అర్పణల కంటే వారి జీవితాలను, వారి ఉద్దేశ్యాలను పరిగణనలోకి తీసుకుంటున్నాడు. దేవుడు హేబెలును అంగీకరించాడు కానీ కయూను అంగీకరించలేదు. ఐతే కయూను దీనిని బట్టి కోపం తెచ్చుకున్నాడు... కానీ నిజానికి అది అతను చూపించాల్సిన సరైన చర్య కాదు (It's a wrong reaction). దీనిని బట్టే అతని హృదయం చెడిపోయినదని స్పష్టంగా తెలుస్తుంది. తనను తాను పరీక్షించుకొని, తన క్రియలను బట్టి పశ్చాత్తాపడాల్సిన దానికి బదులుగా అసూయ, క్రోధాలతో హృదయం అతని నిండిపోయింది.

■ ప్రతి మనిషిలో తన స్వంత స్వభావం మరియు మనస్సాక్షిలు పని చేస్తాయి. ఈ మనస్సాక్షిలో దేవుడు ఆయన నియమావళిని వ్రాశాడు. కనుకనే మన ప్రవర్తనతో సంభంధం లేకుండానే మనస్సాక్షి మంచిని గూర్చిన హెచ్చరికలు చేస్తూ ఉంటుంది(మన జీవితాల్లో చాలా సార్లు తొందర పడి ప్రవర్తించిన తర్వాత, మనస్సాక్షి చేత గద్దించబడి దుఃఖపడతాము, సరిచేసుకుంటాము). ఐతే మన స్వంత స్వభావం ఆ గద్దింపుకు లోబడవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఎప్పుడైతే మనస్సాక్షికి (అనగా దేవునికి) వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ,మన పనుల్ని మనం సమర్ధించుకుంటూ వెళ్తామో మనస్సాక్షి స్వరం ఆ విషయంలో మెల్లిగా వినపడకుండా పోతుంది. తద్వారా హృదయం కఠినమై ఆ పాపం మనల్ని బానిసలుగా చేసుకుంటుంది. మనస్సాక్షి స్వరం ముగబోతుంది. కనుకనే కొందరికి అసహ్యంగా, బాధగా అనిపించే పనులు, కొందరికి చీమ కుటినట్లుగా అనిపించదు.

■ కయీను తన మనస్సాక్షిని కఠినం చేసుకుంటూ, దేవుని మాటను లెక్కచేయకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తునే భక్తి జీవితంలో ఉన్నానని భ్రమపడ్డాడు. భక్తి అంటే అర్పణ తీసుకురావటం కాదు గాని దేవుని మాటకు లోబడి..మనస్సును కల్మషం లేకుండా శుభ్రపరుచుకోవడం. మెత్తటి మనస్సును కలిగి, మన చర్యలను మనం సమర్ధించుకోకుండా, దేవుని ముందు పరిశీలన చేసుకుంటూ, తప్పును యదార్ధంగా ఒప్పుకుంటూ సరిదిద్దబడటం. ఇటువంటి విధేయతే దేవుడు ప్రతి మనిషి నుండి కోరుతున్నాడు. అలాంటి వారు సత్యమై ఉన్న దేవుణ్ణి తప్పక కలుసుకుంటారు.
(విశ్వాసి జీవితంలో దీనితో పాటు దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు.. క్రీస్తు సారూప్యంలో మారడానికి మరియెక్కువగా సహాయకారులుగా ఉంటారు)

■ ప్రతి మనిషిలో తన స్వంత స్వభావం మరియు మనస్సాక్షిలు పని చేస్తాయి. ఈ మనస్సాక్షిలో దేవుడు ఆయన నియమావళిని వ్రాశాడు. కనుకనే మన ప్రవర్తనతో సంభంధం లేకుండానే మనస్సాక్షి మంచిని గూర్చిన హెచ్చరికలు చేస్తూ ఉంటుంది(మన జీవితాల్లో చాలా సార్లు తొందర పడి ప్రవర్తించిన తర్వాత, మనస్సాక్షి చేత గద్దించబడి దుఃఖపడతాము, సరిచేసుకుంటాము). ఐతే మన స్వంత స్వభావం ఆ గద్దింపుకు లోబడవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఎప్పుడైతే మనస్సాక్షికి (అనగా దేవునికి) వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ,మన పనుల్ని మనం సమర్ధించుకుంటూ వెళ్తామో మనస్సాక్షి స్వరం ఆ విషయంలో మెల్లిగా వినపడకుండా పోతుంది. తద్వారా హృదయం కఠినమై ఆ పాపం మనల్ని బానిసలుగా చేసుకుంటుంది. మనస్సాక్షి స్వరం ముగబోతుంది. కనుకనే కొందరికి అసహ్యంగా, బాధగా అనిపించే పనులు, కొందరికి చీమ కుటినట్లుగా అనిపించదు.

■ కయీను తన మనస్సాక్షిని కఠినం చేసుకుంటూ, దేవుని మాటను లెక్కచేయకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తునే భక్తి జీవితంలో ఉన్నానని భ్రమపడ్డాడు. భక్తి అంటే అర్పణ తీసుకురావటం కాదు గాని దేవుని మాటకు లోబడి..మనస్సును కల్మషం లేకుండా శుభ్రపరుచుకోవడం. మెత్తటి మనస్సును కలిగి, మన చర్యలను మనం సమర్ధించుకోకుండా, దేవుని ముందు పరిశీలన చేసుకుంటూ, తప్పును యదార్ధంగా ఒప్పుకుంటూ సరిదిద్దబడటం. ఇటువంటి విధేయతే దేవుడు ప్రతి మనిషి నుండి కోరుతున్నాడు. అలాంటి వారు సత్యమై ఉన్న దేవుణ్ణి తప్పక కలుసుకుంటారు.
(విశ్వాసి జీవితంలో దీనితో పాటు దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్ముడు.. క్రీస్తు సారూప్యంలో మారడానికి మరియెక్కువగా సహాయకారులుగా ఉంటారు)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...