Skip to main content

Posts

Showing posts from 2018

01Oct2018

✴️ ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు. యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు-"చూడు, నువ్వు గొడ్రాలివి. బిడ్డను కనలేకపోయావు. అయితే నువ్వు గర్భం ధరిస్తావు. నీకు కొడుకు పుడతాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షా రసాన్ని గానీ మద్యాన్ని గానీ తాగకు. అపవిత్రమైనదేదీ తినకు. నువ్వు గర్భవతివి అవుతావు. ఒక కొడుకుని కంటావు. ఆ పిల్లవాడు పుట్టినప్పట్నించి నాజీర్ గా ఉంటాడు. అతని తలపై జుట్టును క్షౌరం చేయడానికై మంగలి కత్తి అతని తలను తాక కూడదు. అతడు ఇశ్రాయేలీ ప్రజలను ఫిలిష్తీయుల చేతి నుండి రక్షిస్తాడు" (న్యాయ 13:1-5) ✴️ ■ మనోహ దంపతులు భక్తిపరులు. దేవుడు తన ప్రణాళికల నెరవేర్పును ఈ కుటుంబం నిలబెట్టుతుందని, తాను పంపబోయే రక్షకుణ్ణి ఈ దంపతులు చక్కగా పెంచగలుగుతారని నమ్మాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వం నుండి విడిపించే రక్షకుడు, న్యాయధిపతికి వారు తల్లిదండ్రులగా ఉండబోతారని ఉహించి కూడా ఉండరు. దైవ ప్రణాళికల్లో భాగంగానే వారు కొంతకాలంగా పిల్లలు లేని దంపతులుగా ఉన్నారు. సహజంగానే దుఃఖం, ఆవేదన, అవమానాల గ...

13Jun2018

✴️ రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. వెంటనే యేసు-“ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు. పేతురు-“ప్రభూ! నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. యేసు-“రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని, గాలిని చూసి భయపడి మునిగిపోతూ-“ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు.వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని-“అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు. యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది...✴️ ■ ఇక్కడ 'నీళ్ళ మీద నడవడం' అనే సంగతి కంటే లోతైన ఆత్మీయ పాఠాన్ని దేవుడు తన శిష్యులకు నేర్పిస్తున్నాడని మనకు అర్ధమౌతుంది (తర్వాత రోజుల్లో ఎవరూ నీటి మీద నడిచినట్లుగాని, దాని గూర్చి మాట్లాడినట్లు గాని మనం చూడము). పేతురు కూడా మన వంటి పాపపు స్వభావం కలిగిన వ్యక్తిగా ఉండినప్పటికీ(లుకా 5:8), యేసు వలె నీటిపై నడవడం నిజంగా మనకు మరింత గొప్ప ప్రోత్సాహన్ని కలిగిస్తుంది. మన జీవితంలో దేవుడు పంప...

25Apr2018

✴️ అబ్రాముకు అతని భార్యయైన శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఐగుప్తు దేశానికి చెందిన హాగరు అను ఒక దాసి ఉంది. శారయి అబ్రాముతో౼ "ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో" అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.(ఆది 16:1,2) ✴️ ■ రాహేలు, లేయాలు కూడా సరిగ్గా ఇలాగే యకోబుకు సలహా ఇచ్చారు(ఆది 30:3,9). కానీ దేవుడు వారిని తప్పు పట్టినట్లుగా చూడము. వారి దాసీలకు పుట్టిన పిల్లలను కూడా తక్కిన వారితో సమాన గోత్రాలుగా దేవుడు చేశాడు. ఎందుకంటే అబ్రాము విషయంలో పుట్టబోవు సంతానం గూర్చి స్పష్టమైన దేవుడు వాగ్ధానం ఉంది. అబ్రాము విశ్వాసంతో కనిపెట్టి ఆ వాగ్ధానం పొందుకోవాలి. దేవుని వాక్కు ఎవరికి స్పష్టంగా తెలియజేయబడుతుందో (ప్రత్యక్షత) వారి నుండి దేవుడు ఎక్కువ విధేయతను ఎదురుచూస్తాడు. దేవుడు అబ్రాముతో సంతానం గూర్చి వాగ్దానం(నిబంధన) చేశాడు. సుమారు 10 సం|| ల తర్వాత కూడా పిల్లలు కలుగనందుకు అబ్రాము, అతని భార్యయైన శారయిల విశ్వాసం సన్నగిల్లి పోయింది(ఆది 15:2,16,2). శారయి తనకు ఇక పిల్లలు పుట్టరని దృఢ నిర్ణయానికి వచ్చినదై, అబ్రాముకు పై...

17Apr2018

✴️ యేసు ఆ మాటలు చెప్పి ముగించిన తరువాత ప్రజలు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే వారి ధర్మశాస్త్ర పండితుల్లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన వారికి ఉపదేశించాడు. (మత్తయి 7:28,29) ✴️ ■ క్రీస్తు బోధ ఆ ప్రజలు విన్న మిగితా భోధకుల కంటే చాలా భిన్నమైనది. శాస్త్రులు పరిసయ్యులు బోధ౼వినువారి తలలను మాత్రమే నింపేవి. ఈ లోకంలో ఎలాగైతే లోకజ్ఞానం ఉందో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా జ్ఞానం ఉంది. అది మనల్ని ఆకట్టుకునే (సత్యమైన) జ్ఞానమై, తప్పుడు భోధకు వెళ్ళకుండా నిన్ను అప్రమత్తం చేసేదిగా ఉండొచ్చు కానీ దేవుని జీవపు ఊటల దగ్గరకు నిన్ను నడుప లేనిదిగా ఉండొచ్చు. అంటే ఈ జ్ఞానం బయట నుండి వచ్చే తప్పుడు భోధల నుండి జాగ్రత్త చేస్తూ, అంతరంగం నుండి 'వ్యక్తిగతంగా దేవున్ని తెలుసుకోవడం' అనే విలువైన జీవపు మాటలను (విస్మరించే) నిర్లక్ష్యం చేసేదిగా ఉండొచ్చు. విత్తనం విత్తనంగా ఉన్నట్లైతే జీవం గల మొక్కను పుట్టించలేదు. అనుకూలమైన వాతావరణంలోనే (నేల, నీరు మొ||) అది జీవం పోసుకుంటుంది. సరైన వాక్యము-దాని వివరణ కూడా 'విత్తనమే' గాని జీవం కాదు. సరైన సిద్ధాంత జ్ఞానం కొన్నిసార్లు ఇతరులను తమ కంటే తక్కువైన వారిగా చిన్న...

12Apr2018

✴️ ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషాను చూచి ఇలా మొర పెట్టింది. ౼“మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. ఆయనకు యెహోవా అంటే భయభక్తులని  మీకు తెలుసు గదా. మాకు అప్పిచ్చిన వాడు వచ్చి నా ఇద్దరు కొడుకులను బానిసలుగా తీసుకుపోవాలని ఉన్నాడు.”  ఎలీషా౼“నేను నీకు ఎలా సహాయం చేయాలి? నీ ఇంట్లో ఏం ఉన్నదో నాకు చెప్పు” అన్నాడు. అందుకామె౼“మీ దాసురాలైన నా ఇంట్లో ఒక కుండ నిండా నూనె తప్ప ఇంకేమీ లేదు” అంది. ఎలీషా ౼“నీవు బయటికి వెళ్ళి నీ పొరుగువాళ్ళందరి దగ్గర దొరకగలగినన్ని ఖాళీ పాత్రలు ఎరవుగా తెచ్చుకో. అప్పుడు నీవు నీ కొడుకులను ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసివేసి, ఆ పాత్రలన్నిట్లో నూనె పోయండి. నిండిన వాటిని ప్రక్కన పెట్టు”.... ఆమె ఆ విధంగా చేసి, ఆ పాత్రలు నిండిపోయినప్పుడు ఆమె “ఇంకో పాత్ర తీసుకురా” అని కొడుకుతో చెప్తే అతడు “ఇంకొకటి లేదు” అన్నాడు. వెంటనే కుండలో నుండి నూనె సరఫరా నిలిచింది. ఆమె వచ్చి ఎలీషాకు ఆ విషయం తెలియజేసింది. ఎలీషా౼“నీవు వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పు తీర్చు. మిగిలిన దానితో నీవూ, నీ కొడుకులూ బ్రతకండి” అన్నాడు. ✴️ ■ ఒకని జీవితం ఎంత చెడిపోయి, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నపాటున దేవుని దగ్...

11Apr2018

✴️ దేవుడు౼"నాకు విరోధంగా మీరు చాలా గర్వంగా మాట్లాడారు" "నిన్ను గూర్చి ఏమని మాట్లాడాం?"అని మీరు అడుగుతారు. "'దేవుణ్ని సేవించడం (సేవ చేయడం) వ్యర్ధం. ఆయన ఆజ్ఞలు పాటించి దేవుని సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉండడంవల్ల ఏమి ఉపయోగం? గర్విష్ఠులే దీవెనలు పొందుతున్నారు, దేవుణ్ణి పరీక్షించే దుర్మార్గులు భద్రంగా ఉంటూ వర్ధిల్లుతున్నారు" అని మీరు చెప్పుకుంటున్నారు. అప్పుడు యెహోవా పట్ల భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా ఆ మాటలు విన్నాడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గౌరవించే వారి గురించి జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధానంలో ఒక పుస్తకం రాశారు. "నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను" అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. (మలాకి 3:13-17) ✴️ ■ దేవుడు సర్వజ్ఞాని. ఆయన ప్రతి పని వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యం ఉంటుంది. దేవుడు ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని పరిక్షిస్తాడు. (దీవెన/మేలుకు ముందు కాని లేదా...

06Apr2018

✴️ అప్పుడు ఆ ధనవంతుడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ, అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి౼"తండ్రీ అబ్రాహామూ! నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు" అని కేకలు పెట్టాడు అబ్రాహాము-"నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు.." అప్పుడతడు౼‘అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును వారి దగ్గరకు పంపించమని నిన్ను వేడుకుంటున్నాను’ అన్నాడు. అబ్రాహాము౼‘వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు. అతడు౼‘తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు’ అన్నాడు. అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’ అన్నాడు ✴️...

04Apr2018

✴️సొలొమోను ముసలివాడయిన తరువాత అతడి భార్యలు అతడి హృదయాన్ని ఇతర దేవుళ్ళవైపు మళ్ళించారు. అతడి తండ్రియైన దావీదు వలె తన దేవుడైన యెహోవాను మనస్పూర్తిగా అనుసరించలేదు... సొలొమోను మోయాబీయుల ఘోరమైన కెమోషు ‌దేవుడికీ, అమ్మోనువాళ్ళ భయానక విగ్రహమైన మొలెకు దేవునికీ యెరూషలేముకు ఎదురుగా ఉన్న కొండమీద ఎత్తయిన పూజాస్థలాలను కట్టించాడు. ఇతర దేశాలకు చెందిన తన భార్యల కోసం సొలొమోను ఎత్తయిన ఆ పూజా స్థలాలను కట్టించాడు. సొలొమోనుకు దేవుడు రెండు సార్లు ప్రత్యక్షమై హెచ్చరించాడు. అయినా ఆయన ఆజ్ఞాపించినట్టు సొలొమోను ప్రవర్తించలేదు, దేవున్నుండి దూరమయ్యాడు. కాబట్టి దేవుడు సొలొమోను మీద కోపగించి౼"నీవు నా నిబంధనను నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడాలను అనుసరించుటకు ఇష్టపడలేదు గనుక నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెప్తున్నాను.దానిని నీ సేవకునికి ఇస్తాను.." అన్నాడు (1రాజు 11:4-11) ✴️ ■ సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు. అతని జ్ఞానం చొప్పున సమస్త వైభవాన్ని, విలాసవంతమైన జీవితం కోసం కావాల్సిన ప్రతి ఏర్పాటును సిద్ధపర్చుకున్నాడు. ఇతర రాజులు సైతం ఆశ్చర్యపోయే విధంగా రాజ్యాన్ని, ఆలయాన్ని కట్టించాడు. చివరికి డాలులు, క...

03Apr2018

✴️ఆయన(యేసు) తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది, కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు. (మత్తయి 1:18,19) ✴️ ■ దేవుని గొప్ప రక్షణ ప్రణాళిక నెరవేరాలంటే ఒక స్త్రీ ఖచ్చితంగా అవమానం పొందావల్సిందే! ఎందుకంటే రక్షకుడు కన్యక గర్భాన పుడతాడని లేఖనం చెప్తుంది. కన్యకయైన ఒక స్త్రీ నేను గర్భవతినై రక్షకుణ్ణి మోస్తున్నానంటే ఎవరు నమ్ముతారు? సహజంగా జరత్వం వల్ల గర్భం ధరించిన స్త్రీల జాబితాలోనే వారిని చూస్తారు, అవమానిస్తారు.లేఖనాలు చదవొచ్చు గాని ఆ లేఖనాల్లో వ్రాయబడినది తన గూర్చే అంటే ఎవరు నమ్మగలరు? యెషయా౼"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?" (యెషయా 53:1) ■ దేవుడు తనకు ఇచ్చిన స్థానాన్ని 'మరియ' తీసుకోవాలంటే కేవలం దేవుని పైనే దృష్టి నిలిపి, ఆయన ఆలోచనలనే ఘనంగా ఎంచాలి. అంతేకాదు మనుష్యుల అభిప్రాయాలను, మాటలను భరించడానికి సంపూర్తిగా ఇష్టపడాలి. దేవుని ఆలోచనల్లో నిలవాలంటే, లోక ఆలోచనల్లో నుండి సంపూర్ణంగా వేరవ్వాలి. యోసేపుకు ప్రధాన...

01Apr2018

✴️యేసు పేతురుతో౼"తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా" అనెను (యోహాను 18: 11) యేసు పిలాతుతో౼"పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు" (యోహాను 19:11) ✴️ ■ యేసు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయనకు తెల్సు. ఆదిలో తండ్రియైన దేవుని రక్షణ ప్రణాళికల ఏర్పాటును, లేఖనాల్లో వ్రాయబడిన క్రీస్తు మరణంను, అందులో నెరవేరబోతున్న దేవుని ఉద్దేశ్యాలను ఆయన సంపూర్ణంగా యెరిగివున్నాడు. నమ్మక ద్రోహం చేసిన యూదాపై ఆయన కోప్పడలేదు, మత పెద్దలతో వాదనకు దిగలేదు, ఇది అన్యాయపు తీర్పు అని పిలాతు ముందు గొంతెత్తి చెప్పలేదు. ఎందుకంటే సిలువ దేవుని ప్రణాళిక! దేవునిచే అనుగ్రహింప బడిన పాత్ర!  కనుకనే ఆయన దృష్టి మొత్తం సిలువలో దేవుని ప్రణాళికలపైనే (లేఖనాల నెరవేర్పు పైనే) ఉన్నది, కాని యూదా ద్రోహంపై గాని, భ్రష్ట హృదయాలతో మతనాయకులు చేస్తున్న పనులపై గాని లేదు. అలాగని మనుష్యులు నిర్దోషులని కాదు గాని, అటువంటి వారి విడుదల కోసమే రక్షకునిగా వచ్చాడని ఆయనకు తెలుసు. ఒకవేళ మనుష్యులు ఏమైనా హాని తలపెట్టాలని చూసినా, అది తండ్రి సమయం కాకపోతే ఆయనను వారేమి చేయ లేకపోయారు. దేవుడు అనుమత...

26Mar2018

✴️ఓలివ కొండ నుండి దిగే చోటికి ఆయన గాడిదపై వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు. ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు౼“బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. ఆయన౼“వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. (లూకా 19:37-40) యేసు దేవాలయానికి వచ్చినప్పుడు గుడ్డివారు, కుంటివారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారందరినీ బాగుచేశాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.౼“వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని చెప్పాడు (మత్తయి 21:14-16) ✴️ ■ వారు చూసిన దేవుని అద్బుతకార్యాలు కొందరి నోట స్తుతిని ఉంచగా, మరికొందరికి అసూయను, ద్వేషాన్ని ...

23Mar2018

✴️ పేతురు౼"అక్రమమైన ధనార్జన కోసం ఆశపడిన బెయోరు కుమారుడైన బిలామును అనుసరించి వారు తప్పిపోయారు. తిన్నని మార్గాన్ని వదిలిపెట్టారు. అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.  ఇలాంటి దుర్భోధకులు నీళ్ళు లేని బావుల్లాంటి వాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొని పోయే మేఘాల్లాంటి వాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు" (2 పేతురు 2:15-17) ✴️ ■ దేవుని వాగ్ధాన దేశమైన కనానుకు ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను శపించమని బాలాకు(మోయాబు రాజు), ప్రవక్తయైన బిలామును కోరాడు. బిలాము దేవుని యొద్ద కనిపెట్టగా౼"వీరు ఆశీర్వదించబడిన ప్రజలు, కనుక శపించునట్లుగా నీవు రాజు నొద్దకు వెళ్లకూడదని" స్పష్టంగా చెప్పాడు. కాని రాజు మరి ఎక్కువ బహుమతిని ఆశ చూపాడు. అప్పుడు బిలాము మాటలు గమనిస్తే ఎంతో ఆత్మీయంగా కనిపిస్తాయి (సంఖ్యా 22:8,18,19). 'ఇంటి నిండా వెండి, బంగారాలిచ్చినా దేవుని ఆజ్ఞను మీరలేను. కానీ వేచి ఉండండి..మరోసారి దేవుని వద్ద కనిపెడతానని' చెప్పి, తనలోని ధనాశను దేవుని ఎదుట బహిరంగ పర్చాడు. పైపై మాటలను బట్టి మోసపోవడానికి దేవు...

14Mar2018

✴️ చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి బాప్తిస్మమిచ్చు యోహాను౼“సర్పసంతానమా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు..‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెబుతున్నాను"(మత్తయి 3:7,9) అందుకు యేసు జక్కయ్యతో౼“ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే" (లూకా 19:9) ఆ నిరుపేదైన లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు (లూకా 16:22) ✴️ ■ అబ్రాహాము విశ్వాసంతో దేవునితో కూడా నడచినవాడు. దేవునికి స్నేహితుడిని లేఖనాల్లో అతనికి పేరు ఉంది. ఆయన వద్దకు దిగి వచ్చిన దేవదూతలను (దేవుణ్ని), దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. తన బలహీనతల నుండి బలమైన విశ్వాసిగా మార్పు చెందిన విశ్వాస వీరుడు. శాస్త్రులు, పరిసయ్యులు, మతనాయకులు తాము 'అబ్రాహాము సంతాన'మని, ఏర్పరచబడిన జనాంగమని ఉప్పొంగుతూ ఉన్నారు. ఐతే బాప్తిస్మమిచ్చు యోహాను వారిని సర్పసంతానమా అని పిలిచాడు (దేవుని అభిప్రాయం కూడా అదే). బహుశా! అంతకు ముందు ఎవ్వరూ ...

13March2018

❇ దేవుడు పౌలు చేత అసాధారణమైన అద్భుతాలు చేయించాడు. అతని శరీరానికి తాకిన చేతి గుడ్డలైనా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దయ్యాలు కూడా వదలిపోయాయి. అప్పుడు, దేశసంచారం చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టే యూదులు కొందరు, దయ్యాలు పట్టిన వారిపై౼“పౌలు ప్రకటించే యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాం” అని యేసుప్రభువు పేరు చెప్పడానికి పూనుకొన్నారు. స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు అలా చేశారు. ఆ దయ్యం వారితో౼“నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అంది. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారిమీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత వారు గాయాలతో బట్టల్లేకుండా ఆ ఇంటి నుండి పారిపోయారు ❇ ■ యూదా మతస్తుడైన పౌలు ప్రభువును తెలుసుకోక ముందు ఎంతో భక్తిపరునిగా, మతాసక్తి గల వానిగా ఉన్నాడు(ఫిలిప్పీ 3:6). ఆ సమయంలో అతని జీవితంలో ఎలాంటి ప్రభావం లేదు. ప్రభువును తెల్సుకున్న తర్వాతే అతని ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించాడు. దెయ్యాలు సైతం పౌలును గుర్తుపట్టాయి. ఒకడే వ్యక్తి..! కానీ అతని జీవితంలో ఎంతో తేడా కనిపిస్తుంది. కారణం..పౌలు దేవుణ్ని తెల్సుకున్నాడు-దేవుని చేత త...

12Mar2018

శోధన: ■ 'శోధన'౼ అనగా ఒక విశ్వాసి పాపం చెయ్యడానికి ప్రేరేపించబడటం. విశ్వాసిని దేవుని నుండి(ఆయన వాక్యంలో నిలువకుండా) వైదొలిగించడానికి సాతాను పన్నే వల. సహజంగా మనం దేవుణ్ని తెలిసికొనక మునుపు ఏ పాపాలను ఇష్టంగా చేస్తామో..ఆ విషయాలనే శోధనకు సాధనాలుగా సాతాను వాడుకుంటాడు. పూర్వం మనకు ఉన్న దురాశలను అనుసరించి నడుచుకొనునట్లుగా ప్రేరేపిస్తాడు (ఎఫె 4:22, తీతు 3:3). 'శోధన' అనేది ప్రతి విశ్వాసికీ సహజంగా కలిగే అనుభవమే! ఇది దేవుని అనుమతితోనే మనకు వస్తాయి. మనం భరింపదగిన దాని కంటే-అనగా మన శక్తికి మించిన శోధనా బలాన్ని మన జీవితంలో ఆయన అనుమతించడు(1కోరింథి 10:13). ఇందులో దేవుని ఉద్దేశ్యం మనల్ని మరింత బలవంతులుగా చెయ్యాలనే కానీ పాపంలో పడటం ఆయన చిత్తం కాదు! 'శోధించబడటం'(పాపపు ప్రేరణ రావటం) తప్పు కాదు, కాని ఆ ప్రేరణకు లొంగి ఆ పాపంలో పడి అపవాదితో ఏకీభవించడం 'పాపం'. శోధన జయించిన ప్రతిసారి మనకు మరికొంత ఆధ్యాత్మిక బలం తోడౌతుంది. ■ ఒకవేళ మనం శోధనలో పడినప్పుడు, వెంటనే దేవుని కృపా సింహాసనాన్ని ఆశ్రయించి ఆ పాపాన్ని వెంటనే కడిగివేసుకోవాలి(1యోహా 2:1). బలహీనతలను (పుర్వపు పాపాలను) చులకనగా తీ...

08Mar2018

❇ వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి౼“యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు౼“అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు౼“నా గొర్రెల్ని మేపు” అని అతనితో చెప్పాడు..... ఆయన మూడోసారి౼“యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి౼“ ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు(యోహాను 21:15-17) ❇ ■ ఓడిపోయి, నిరాశ-నిస్పృహలో కృంగివున్న ప్రతి విశ్వాసికి ఓదార్పు..పై వాక్యభాగం. పేతురు-'ఒకప్పుడు నేను ప్రభువు కోసం సమస్తం వదులుకొని వచ్చాను, నమ్మకంగా సేవిస్తున్నాను గనుక దేవుని కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నాకు ఉన్నదనుకున్నాడు'. తన భక్తికి ఉన్న బలం, తన స్వంత శక్తి మీదే ఆధారపడివుందన్న విషయం గ్రహించలేకపోయ్యాడు. ఆ స్థితి మనల్ని గురించి మనం అతిగా ఉహించుకునేందుకు ప్రేరేపించి మనల్ని మోసపుచ్చుతుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆ అబద్ధం మనల్ని విడిపించాలని...

05Mar2018

❇ యేసు నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు. ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి౼“ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. యేసు౼“చిన్నవాడా, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు. అందరూ భయంతో నిండిపోయి౼”మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. ❇ ■ విధవరాలి కుమారునికి ఆ మరణాన్ని అనుగ్రహించినది ఏవరు? దేవుడే కదా! మరి ఆయనే ఆమె దగ్గరకు వచ్చి 'ఏడవవద్దు' అని పలకడం నాటకీయంగా లేదా!మానవ జ్ఞానంతో దేవుని మనస్సును ఎన్నడూ అర్ధం చేసుకోలేము. క్రీస్తు ఆ చిన్నవాడ్ని చావు నుండి లేపాడు. కాని కొన్ని సంవత్సరాలుకు అతను మళ్ళీ చనిపోయాడు. అంటే ఇక్కడ చావునుండి లేపటం కంటే విలువైనది ఎదో ఉందని గ్...

03Mar2018

❇ యెహోషువ యెరికో దగ్గర ఉన్నప్పుడు అతడు తలెత్తి చూశాడు. అతనికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ మనుషుడు కత్తి దూసి చేతపట్టుకొని ఉన్నాడు. యెహోషువ ఆయన దగ్గరికి వచ్చి-“నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు. “కాదు! యెహోవా సైన్యానికి అధిపతిగా నేనిప్పుడు వచ్చాను” అని ఆయన జవాబిచ్చాడు. యెహోషువ ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి౼“ప్రభూ! తమ దాసుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగాడు. యెహోవా సైన్యాధిపతి యెహోషువతో౼“నీవు నిలబడ్డ ఈ స్థలం పవిత్రం గనుక నీ కాళ్ళనుంచి చెప్పులు తీసివెయ్యి” అన్నాడు. యెహోషువ అలా చేశాడు ❇ దేవుడు ఎవరి పక్షాన నిలుస్తాడు? ■ దేవుని సర్వ సైన్యాలు(దేవదూతలు) తమకు నచ్చిన పని తాము చేసుకుపోరు గాని దేవుని ఆదేశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన ఏం చెప్తే అదే చేశారు. కొద్దివారికేమి, గొప్పవారికేమి దేవుడు చెప్పమన్న వార్తను మోసుకుపోయ్యారు, దేవుని ప్రజలకు సహాయకులుగా నిలిచారు. యుద్దాలు చేశారు, రక్షకులుగా నిలిచారు, ఓదార్చారు-బలపర్చారు, పరిశుద్ధులకు పరిచర్య చేశారు. ఐతే వారు దేవుడు సెలవివ్వకుండా ఏ ఒక్క పని చెయ్యరు. ఆ విధంగా వారు దేవుని పక్షం ఉన్నారు కనుకనే దేవుడు వారి...