Skip to main content

01Apr2018

✴️యేసు పేతురుతో౼"తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా" అనెను (యోహాను 18: 11)
యేసు పిలాతుతో౼"పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు" (యోహాను 19:11) ✴️

■ యేసు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయనకు తెల్సు. ఆదిలో తండ్రియైన దేవుని రక్షణ ప్రణాళికల ఏర్పాటును, లేఖనాల్లో వ్రాయబడిన క్రీస్తు మరణంను, అందులో నెరవేరబోతున్న దేవుని ఉద్దేశ్యాలను ఆయన సంపూర్ణంగా యెరిగివున్నాడు. నమ్మక ద్రోహం చేసిన యూదాపై ఆయన కోప్పడలేదు, మత పెద్దలతో వాదనకు దిగలేదు, ఇది అన్యాయపు తీర్పు అని పిలాతు ముందు గొంతెత్తి చెప్పలేదు. ఎందుకంటే సిలువ దేవుని ప్రణాళిక! దేవునిచే అనుగ్రహింప బడిన పాత్ర!  కనుకనే ఆయన దృష్టి మొత్తం సిలువలో దేవుని ప్రణాళికలపైనే (లేఖనాల నెరవేర్పు పైనే) ఉన్నది, కాని యూదా ద్రోహంపై గాని, భ్రష్ట హృదయాలతో మతనాయకులు చేస్తున్న పనులపై గాని లేదు. అలాగని మనుష్యులు నిర్దోషులని కాదు గాని, అటువంటి వారి విడుదల కోసమే రక్షకునిగా వచ్చాడని ఆయనకు తెలుసు. ఒకవేళ మనుష్యులు ఏమైనా హాని తలపెట్టాలని చూసినా, అది తండ్రి సమయం కాకపోతే ఆయనను వారేమి చేయ లేకపోయారు. దేవుడు అనుమతించకుండా ఆయన జీవితంలో ఏమి జరగవని క్రీస్తుకు తెలుసు. పేతురు మానవుని ఆలోచనతో జరుగుతున్న సంగతులను చూశాడు గాని పరలోక దృష్టితో చూడలేకపోయ్యాడు. కనుకనే స్వంత శక్తితో శత్రువులకు సమాధానం ఇవ్వాలని తొందరపడ్డాడు.

■ లోకానుసారుడైన పిలాతు, దేవుణ్ని కానీ, అదృశ్యమైనది-శాశ్వితమైనదియైన దేవుని అధికారాన్ని చూడలేకపోయ్యాడు. క్రీస్తు ఈ లోకంపై తండ్రియైన దేవుని బలమైన అధికారాన్ని స్పష్టంగా చూస్తూ, ఆ అధికారానికి లోబడి ఉన్నాడు. పిలాతు తన అధికారంతో క్రీస్తును విడిపించాలని చూసినప్పటికిని, అది అసాధ్యమని ప్రభువుకు స్పష్టంగా తెలుసు. లోకసంబంధులు దేవుని ఆలోచనలను గ్రహింపలేరు. ప్రతి సమస్యకు లోకపరంగా ఉన్న పరిష్కారాలను, మానవ బల-శక్తియుక్తులు ఆశ్రయించువారై ఉంటారు, గాని ఆత్మ సంబంధమైన సంగతులు చూచునట్లు వారి మనోనేత్రాలు తెరవబడి ఉండవు. ఎందుకంటే ఆత్మ సంభంధమైన సంగతులు దేవుని యందలి విశ్వాసంతో ముడి పడివుంటాయి.

★ ఒకడు ఈ సంగతులు స్పష్టంగా గ్రహించినప్పటికి, తనను తాను దేవుని అధికారానికి లోబర్చుకోకుండా తిరగవచ్చును. దీనికి అల్పవిశ్వాసం, తిరుగుబాటు ధోరణి కారణాలుగా ఉండవచ్చును. దేవుడు తన పిల్లల జీవితంలో ఏమి అనుమతించినప్పటికిని (ఇబ్బందులు, నిందలు, శ్రమలు, మరణము) అందులో మేలు దాచబడివుంటుంది. ఈ లోకం దృష్టిలో 'ఇక ముగిసిపోయింది' అనుకున్న జీవితాన్ని సైతం మహిమా యుక్తంగా దేవుడు మార్చగలడు. క్రీస్తులో, భక్తుల జీవితంలో అదే జరిగింది. ఆత్మీయ నేత్రాలతో దేవుని సంగతులను చూడాలన్నా దేవుడే మన కన్నులు తెరవవాలి! దేవుని అధికారం క్రింద జీవించాలంటే పరిశుద్ధాత్ముని నింపుదల ఖశ్చితంగా అవసరం.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...