✴️యేసు పేతురుతో౼"తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా" అనెను (యోహాను 18: 11)
యేసు పిలాతుతో౼"పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు" (యోహాను 19:11) ✴️
■ యేసు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయనకు తెల్సు. ఆదిలో తండ్రియైన దేవుని రక్షణ ప్రణాళికల ఏర్పాటును, లేఖనాల్లో వ్రాయబడిన క్రీస్తు మరణంను, అందులో నెరవేరబోతున్న దేవుని ఉద్దేశ్యాలను ఆయన సంపూర్ణంగా యెరిగివున్నాడు. నమ్మక ద్రోహం చేసిన యూదాపై ఆయన కోప్పడలేదు, మత పెద్దలతో వాదనకు దిగలేదు, ఇది అన్యాయపు తీర్పు అని పిలాతు ముందు గొంతెత్తి చెప్పలేదు. ఎందుకంటే సిలువ దేవుని ప్రణాళిక! దేవునిచే అనుగ్రహింప బడిన పాత్ర! కనుకనే ఆయన దృష్టి మొత్తం సిలువలో దేవుని ప్రణాళికలపైనే (లేఖనాల నెరవేర్పు పైనే) ఉన్నది, కాని యూదా ద్రోహంపై గాని, భ్రష్ట హృదయాలతో మతనాయకులు చేస్తున్న పనులపై గాని లేదు. అలాగని మనుష్యులు నిర్దోషులని కాదు గాని, అటువంటి వారి విడుదల కోసమే రక్షకునిగా వచ్చాడని ఆయనకు తెలుసు. ఒకవేళ మనుష్యులు ఏమైనా హాని తలపెట్టాలని చూసినా, అది తండ్రి సమయం కాకపోతే ఆయనను వారేమి చేయ లేకపోయారు. దేవుడు అనుమతించకుండా ఆయన జీవితంలో ఏమి జరగవని క్రీస్తుకు తెలుసు. పేతురు మానవుని ఆలోచనతో జరుగుతున్న సంగతులను చూశాడు గాని పరలోక దృష్టితో చూడలేకపోయ్యాడు. కనుకనే స్వంత శక్తితో శత్రువులకు సమాధానం ఇవ్వాలని తొందరపడ్డాడు.
■ లోకానుసారుడైన పిలాతు, దేవుణ్ని కానీ, అదృశ్యమైనది-శాశ్వితమైనదియైన దేవుని అధికారాన్ని చూడలేకపోయ్యాడు. క్రీస్తు ఈ లోకంపై తండ్రియైన దేవుని బలమైన అధికారాన్ని స్పష్టంగా చూస్తూ, ఆ అధికారానికి లోబడి ఉన్నాడు. పిలాతు తన అధికారంతో క్రీస్తును విడిపించాలని చూసినప్పటికిని, అది అసాధ్యమని ప్రభువుకు స్పష్టంగా తెలుసు. లోకసంబంధులు దేవుని ఆలోచనలను గ్రహింపలేరు. ప్రతి సమస్యకు లోకపరంగా ఉన్న పరిష్కారాలను, మానవ బల-శక్తియుక్తులు ఆశ్రయించువారై ఉంటారు, గాని ఆత్మ సంబంధమైన సంగతులు చూచునట్లు వారి మనోనేత్రాలు తెరవబడి ఉండవు. ఎందుకంటే ఆత్మ సంభంధమైన సంగతులు దేవుని యందలి విశ్వాసంతో ముడి పడివుంటాయి.
★ ఒకడు ఈ సంగతులు స్పష్టంగా గ్రహించినప్పటికి, తనను తాను దేవుని అధికారానికి లోబర్చుకోకుండా తిరగవచ్చును. దీనికి అల్పవిశ్వాసం, తిరుగుబాటు ధోరణి కారణాలుగా ఉండవచ్చును. దేవుడు తన పిల్లల జీవితంలో ఏమి అనుమతించినప్పటికిని (ఇబ్బందులు, నిందలు, శ్రమలు, మరణము) అందులో మేలు దాచబడివుంటుంది. ఈ లోకం దృష్టిలో 'ఇక ముగిసిపోయింది' అనుకున్న జీవితాన్ని సైతం మహిమా యుక్తంగా దేవుడు మార్చగలడు. క్రీస్తులో, భక్తుల జీవితంలో అదే జరిగింది. ఆత్మీయ నేత్రాలతో దేవుని సంగతులను చూడాలన్నా దేవుడే మన కన్నులు తెరవవాలి! దేవుని అధికారం క్రింద జీవించాలంటే పరిశుద్ధాత్ముని నింపుదల ఖశ్చితంగా అవసరం.
యేసు పిలాతుతో౼"పైనుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు" (యోహాను 19:11) ✴️
■ యేసు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆయనకు తెల్సు. ఆదిలో తండ్రియైన దేవుని రక్షణ ప్రణాళికల ఏర్పాటును, లేఖనాల్లో వ్రాయబడిన క్రీస్తు మరణంను, అందులో నెరవేరబోతున్న దేవుని ఉద్దేశ్యాలను ఆయన సంపూర్ణంగా యెరిగివున్నాడు. నమ్మక ద్రోహం చేసిన యూదాపై ఆయన కోప్పడలేదు, మత పెద్దలతో వాదనకు దిగలేదు, ఇది అన్యాయపు తీర్పు అని పిలాతు ముందు గొంతెత్తి చెప్పలేదు. ఎందుకంటే సిలువ దేవుని ప్రణాళిక! దేవునిచే అనుగ్రహింప బడిన పాత్ర! కనుకనే ఆయన దృష్టి మొత్తం సిలువలో దేవుని ప్రణాళికలపైనే (లేఖనాల నెరవేర్పు పైనే) ఉన్నది, కాని యూదా ద్రోహంపై గాని, భ్రష్ట హృదయాలతో మతనాయకులు చేస్తున్న పనులపై గాని లేదు. అలాగని మనుష్యులు నిర్దోషులని కాదు గాని, అటువంటి వారి విడుదల కోసమే రక్షకునిగా వచ్చాడని ఆయనకు తెలుసు. ఒకవేళ మనుష్యులు ఏమైనా హాని తలపెట్టాలని చూసినా, అది తండ్రి సమయం కాకపోతే ఆయనను వారేమి చేయ లేకపోయారు. దేవుడు అనుమతించకుండా ఆయన జీవితంలో ఏమి జరగవని క్రీస్తుకు తెలుసు. పేతురు మానవుని ఆలోచనతో జరుగుతున్న సంగతులను చూశాడు గాని పరలోక దృష్టితో చూడలేకపోయ్యాడు. కనుకనే స్వంత శక్తితో శత్రువులకు సమాధానం ఇవ్వాలని తొందరపడ్డాడు.
■ లోకానుసారుడైన పిలాతు, దేవుణ్ని కానీ, అదృశ్యమైనది-శాశ్వితమైనదియైన దేవుని అధికారాన్ని చూడలేకపోయ్యాడు. క్రీస్తు ఈ లోకంపై తండ్రియైన దేవుని బలమైన అధికారాన్ని స్పష్టంగా చూస్తూ, ఆ అధికారానికి లోబడి ఉన్నాడు. పిలాతు తన అధికారంతో క్రీస్తును విడిపించాలని చూసినప్పటికిని, అది అసాధ్యమని ప్రభువుకు స్పష్టంగా తెలుసు. లోకసంబంధులు దేవుని ఆలోచనలను గ్రహింపలేరు. ప్రతి సమస్యకు లోకపరంగా ఉన్న పరిష్కారాలను, మానవ బల-శక్తియుక్తులు ఆశ్రయించువారై ఉంటారు, గాని ఆత్మ సంబంధమైన సంగతులు చూచునట్లు వారి మనోనేత్రాలు తెరవబడి ఉండవు. ఎందుకంటే ఆత్మ సంభంధమైన సంగతులు దేవుని యందలి విశ్వాసంతో ముడి పడివుంటాయి.
★ ఒకడు ఈ సంగతులు స్పష్టంగా గ్రహించినప్పటికి, తనను తాను దేవుని అధికారానికి లోబర్చుకోకుండా తిరగవచ్చును. దీనికి అల్పవిశ్వాసం, తిరుగుబాటు ధోరణి కారణాలుగా ఉండవచ్చును. దేవుడు తన పిల్లల జీవితంలో ఏమి అనుమతించినప్పటికిని (ఇబ్బందులు, నిందలు, శ్రమలు, మరణము) అందులో మేలు దాచబడివుంటుంది. ఈ లోకం దృష్టిలో 'ఇక ముగిసిపోయింది' అనుకున్న జీవితాన్ని సైతం మహిమా యుక్తంగా దేవుడు మార్చగలడు. క్రీస్తులో, భక్తుల జీవితంలో అదే జరిగింది. ఆత్మీయ నేత్రాలతో దేవుని సంగతులను చూడాలన్నా దేవుడే మన కన్నులు తెరవవాలి! దేవుని అధికారం క్రింద జీవించాలంటే పరిశుద్ధాత్ముని నింపుదల ఖశ్చితంగా అవసరం.
Comments
Post a Comment