✴️ఆయన(యేసు) తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది, కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు. (మత్తయి 1:18,19) ✴️
■ దేవుని గొప్ప రక్షణ ప్రణాళిక నెరవేరాలంటే ఒక స్త్రీ ఖచ్చితంగా అవమానం పొందావల్సిందే! ఎందుకంటే రక్షకుడు కన్యక గర్భాన పుడతాడని లేఖనం చెప్తుంది. కన్యకయైన ఒక స్త్రీ నేను గర్భవతినై రక్షకుణ్ణి మోస్తున్నానంటే ఎవరు నమ్ముతారు? సహజంగా జరత్వం వల్ల గర్భం ధరించిన స్త్రీల జాబితాలోనే వారిని చూస్తారు, అవమానిస్తారు.లేఖనాలు చదవొచ్చు గాని ఆ లేఖనాల్లో వ్రాయబడినది తన గూర్చే అంటే ఎవరు నమ్మగలరు?
యెషయా౼"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?" (యెషయా 53:1)
■ దేవుడు తనకు ఇచ్చిన స్థానాన్ని 'మరియ' తీసుకోవాలంటే కేవలం దేవుని పైనే దృష్టి నిలిపి, ఆయన ఆలోచనలనే ఘనంగా ఎంచాలి. అంతేకాదు మనుష్యుల అభిప్రాయాలను, మాటలను భరించడానికి సంపూర్తిగా ఇష్టపడాలి. దేవుని ఆలోచనల్లో నిలవాలంటే, లోక ఆలోచనల్లో నుండి సంపూర్ణంగా వేరవ్వాలి. యోసేపుకు ప్రధానం చేయబడిన మరియకు ఇది అతి పెద్ద సవాలు. ఆమె తన జీవిత భాగస్వామిని కూడా కోల్పోవల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సమాజం నుండి వచ్చే అవమానాలు ఎలా ఉంటాయో మనం ఉహించగలం. జరత్వం చేసిన స్త్రీని చంపివేసే ధర్మశాస్త్రం ఏలుతున్న రోజులవి. ఇప్పుడు మరియ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి తన స్వంత మార్గం, అనగా యేసేపును వివాహం చేసుకొని అందరి స్త్రీల వలె భర్తతో సంతోషంగా ఉండటం. రెండు దేవుని మాటకు దాసురాలై, ఆమె జీవితంలో సమస్తాన్ని కోల్పోవటానికి తీర్మానం చేసుకోవటం.
■ శ్రమ, నిందలు, అవమానం లేకుండా క్రీస్తు రూపం ఏర్పడదు. సద్భక్తిలో ఇవన్నీ మిళితమై ఉంటాయి. వీటిని తీసుకోవడానికి ఇష్టపడని వారు, లోక మన్ననలో ఆశక్తిపరులు తమ పట్ల ఉన్న దేవుని ఏర్పాటును కోల్పోతారు. 'మరియ' మొదటి మార్గాన్ని ఎంచుకున్నట్లైతే దేవుని గొప్ప ప్రణాళికలను తన జీవితంలో కోల్పోయి ఉండేది. కానీ ఆమె రెండవ మార్గాన్నే ఎంచుకుంది. ఆమె గర్భం లోపట లోక రక్షణను మోస్తున్నప్పటికి, బయట అవమానాలను ఎదురయ్యాయి. నేడు క్రీస్తును ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాగే ఉంటాడు. వారిని శ్రమ పెట్టడానికి లోకానికి ఒక కారణం దొరుకుతుంది, అది అందరి మీద మోపే నేరము వంటిదిగా ఉంటుంది, కానీ వారు మహిమా యుక్తమైన క్రీస్తును తీసుకెళ్ళే వారిగా ఉంటారు.
విశ్వాసి విలువ భూమిపై కాదు పరలోకంలో దేవుని ముందు లెక్కించబడుతుంది. ఆత్మీయులకు ఆత్మసంబంధమైన విషయాలే ఘనంగా ఉంటాయి. వారు వాటిని విశ్వాసం ద్వారా ఆత్మీయ నేత్రాలతో స్పష్టంగా నుండి చూస్తూ, ఈ లోకంను-దాని ఘనతను ఎన్నిక చేయరు. ఒకటి మార్గం కంటితో చూసేది, సులువైనది, మన్నన పొందేది, శరీరం కోరుకునే తమకు నచ్చిన మార్గం. రెండవది మార్గం ఆత్మలో చూసి, విశ్వాసంతో అడుగులేసేది, దేవునిపై దృష్టి నిలిపి శ్రమలను లెక్కచేయనిది. ఇది మనకు ముందున్న విశ్వాస వీరులు నడచిన మార్గం. నేడు వారి ఫలం దేవుని దగ్గర గొప్పది.
★ ఈ మార్గంలో నడవడానికి ఇష్టం పడని విశ్వాసులు సహజంగా కారణాలు వెత్తుకుంటారు. కానీ అవేమి దేవుని ముందు పనిచెయ్యవు. శక్తి చాలకపోతే యదార్ధంగా దేవుని కృప కోసం వేడుకోవాలే కానీ సమర్ధించుకోకూడదు. నీవే మార్గాన్ని కోరుకుంటావు?
■ దేవుని గొప్ప రక్షణ ప్రణాళిక నెరవేరాలంటే ఒక స్త్రీ ఖచ్చితంగా అవమానం పొందావల్సిందే! ఎందుకంటే రక్షకుడు కన్యక గర్భాన పుడతాడని లేఖనం చెప్తుంది. కన్యకయైన ఒక స్త్రీ నేను గర్భవతినై రక్షకుణ్ణి మోస్తున్నానంటే ఎవరు నమ్ముతారు? సహజంగా జరత్వం వల్ల గర్భం ధరించిన స్త్రీల జాబితాలోనే వారిని చూస్తారు, అవమానిస్తారు.లేఖనాలు చదవొచ్చు గాని ఆ లేఖనాల్లో వ్రాయబడినది తన గూర్చే అంటే ఎవరు నమ్మగలరు?
యెషయా౼"మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?" (యెషయా 53:1)
■ దేవుడు తనకు ఇచ్చిన స్థానాన్ని 'మరియ' తీసుకోవాలంటే కేవలం దేవుని పైనే దృష్టి నిలిపి, ఆయన ఆలోచనలనే ఘనంగా ఎంచాలి. అంతేకాదు మనుష్యుల అభిప్రాయాలను, మాటలను భరించడానికి సంపూర్తిగా ఇష్టపడాలి. దేవుని ఆలోచనల్లో నిలవాలంటే, లోక ఆలోచనల్లో నుండి సంపూర్ణంగా వేరవ్వాలి. యోసేపుకు ప్రధానం చేయబడిన మరియకు ఇది అతి పెద్ద సవాలు. ఆమె తన జీవిత భాగస్వామిని కూడా కోల్పోవల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సమాజం నుండి వచ్చే అవమానాలు ఎలా ఉంటాయో మనం ఉహించగలం. జరత్వం చేసిన స్త్రీని చంపివేసే ధర్మశాస్త్రం ఏలుతున్న రోజులవి. ఇప్పుడు మరియ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి తన స్వంత మార్గం, అనగా యేసేపును వివాహం చేసుకొని అందరి స్త్రీల వలె భర్తతో సంతోషంగా ఉండటం. రెండు దేవుని మాటకు దాసురాలై, ఆమె జీవితంలో సమస్తాన్ని కోల్పోవటానికి తీర్మానం చేసుకోవటం.
■ శ్రమ, నిందలు, అవమానం లేకుండా క్రీస్తు రూపం ఏర్పడదు. సద్భక్తిలో ఇవన్నీ మిళితమై ఉంటాయి. వీటిని తీసుకోవడానికి ఇష్టపడని వారు, లోక మన్ననలో ఆశక్తిపరులు తమ పట్ల ఉన్న దేవుని ఏర్పాటును కోల్పోతారు. 'మరియ' మొదటి మార్గాన్ని ఎంచుకున్నట్లైతే దేవుని గొప్ప ప్రణాళికలను తన జీవితంలో కోల్పోయి ఉండేది. కానీ ఆమె రెండవ మార్గాన్నే ఎంచుకుంది. ఆమె గర్భం లోపట లోక రక్షణను మోస్తున్నప్పటికి, బయట అవమానాలను ఎదురయ్యాయి. నేడు క్రీస్తును ధరించుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాగే ఉంటాడు. వారిని శ్రమ పెట్టడానికి లోకానికి ఒక కారణం దొరుకుతుంది, అది అందరి మీద మోపే నేరము వంటిదిగా ఉంటుంది, కానీ వారు మహిమా యుక్తమైన క్రీస్తును తీసుకెళ్ళే వారిగా ఉంటారు.
విశ్వాసి విలువ భూమిపై కాదు పరలోకంలో దేవుని ముందు లెక్కించబడుతుంది. ఆత్మీయులకు ఆత్మసంబంధమైన విషయాలే ఘనంగా ఉంటాయి. వారు వాటిని విశ్వాసం ద్వారా ఆత్మీయ నేత్రాలతో స్పష్టంగా నుండి చూస్తూ, ఈ లోకంను-దాని ఘనతను ఎన్నిక చేయరు. ఒకటి మార్గం కంటితో చూసేది, సులువైనది, మన్నన పొందేది, శరీరం కోరుకునే తమకు నచ్చిన మార్గం. రెండవది మార్గం ఆత్మలో చూసి, విశ్వాసంతో అడుగులేసేది, దేవునిపై దృష్టి నిలిపి శ్రమలను లెక్కచేయనిది. ఇది మనకు ముందున్న విశ్వాస వీరులు నడచిన మార్గం. నేడు వారి ఫలం దేవుని దగ్గర గొప్పది.
★ ఈ మార్గంలో నడవడానికి ఇష్టం పడని విశ్వాసులు సహజంగా కారణాలు వెత్తుకుంటారు. కానీ అవేమి దేవుని ముందు పనిచెయ్యవు. శక్తి చాలకపోతే యదార్ధంగా దేవుని కృప కోసం వేడుకోవాలే కానీ సమర్ధించుకోకూడదు. నీవే మార్గాన్ని కోరుకుంటావు?
Comments
Post a Comment