✴️ పేతురు౼"అక్రమమైన ధనార్జన కోసం ఆశపడిన బెయోరు కుమారుడైన బిలామును అనుసరించి వారు తప్పిపోయారు. తిన్నని మార్గాన్ని వదిలిపెట్టారు. అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.
ఇలాంటి దుర్భోధకులు నీళ్ళు లేని బావుల్లాంటి వాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొని పోయే మేఘాల్లాంటి వాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు" (2 పేతురు 2:15-17) ✴️
■ దేవుని వాగ్ధాన దేశమైన కనానుకు ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను శపించమని బాలాకు(మోయాబు రాజు), ప్రవక్తయైన బిలామును కోరాడు. బిలాము దేవుని యొద్ద కనిపెట్టగా౼"వీరు ఆశీర్వదించబడిన ప్రజలు, కనుక శపించునట్లుగా నీవు రాజు నొద్దకు వెళ్లకూడదని" స్పష్టంగా చెప్పాడు. కాని రాజు మరి ఎక్కువ బహుమతిని ఆశ చూపాడు. అప్పుడు బిలాము మాటలు గమనిస్తే ఎంతో ఆత్మీయంగా కనిపిస్తాయి (సంఖ్యా 22:8,18,19). 'ఇంటి నిండా వెండి, బంగారాలిచ్చినా దేవుని ఆజ్ఞను మీరలేను. కానీ వేచి ఉండండి..మరోసారి దేవుని వద్ద కనిపెడతానని' చెప్పి, తనలోని ధనాశను దేవుని ఎదుట బహిరంగ పర్చాడు.
పైపై మాటలను బట్టి మోసపోవడానికి దేవుడు నరుడు కాడు. తియ్యటి ఆత్మీయ పలుకుల కంటే హృదయాన్ని,దాని అంతరంగ ఉద్దేశ్యాలను ఆయన గమనిస్తాడు. లోలోపల వదిలివేయడానికి ఇష్టపడక, భద్రపర్చుకున్న దురాశాలను ఆయన స్పష్టంగా చూడగలడు. మునుపు మనం అలాంటి వారమే, కానీ నేడు క్రీస్తులో ఉన్న మనం ఆ దురాశలను విడిచి పెట్టి దైవ స్వభావంలోకి రూపాంతరం చెందాలి (2 పేతు 1:4). ఎందుకంటే నిలబెడతానని ఆయన ఇచ్చిన వాగ్ధానాలు మనకున్నాయి. మన స్వేచ్ఛలో నుండే ఆ దురాశాలను (పాత స్వభావాన్ని) ద్వేషించి, దైవ స్వభావాన్ని హత్తుకోవాలి.
■ బిలాము హృదయంలో దేవుణ్ని కాకుండా మరొకటి ఆశించాడు గనుక రెండవ మారు అడిగినప్పుడు దేవుడు వెళ్ళమని చెప్పాడు. దానార్ధం అది ఆయన చిత్తమని కాదు, అతని స్వేచ్ఛకు అతణ్ణి అప్పజెప్పేశాడు. దేవుడు అతను ప్రయాణం చేసిన గాడిదకు మానవ స్వరాన్ని అనుగ్రహించుట ద్వారా, ఖడ్గం ధరించిన దేవదూతను పంపడం ద్వారా ప్రవక్తను హెచ్చరించాడు. అతని చర్య తీవ్రతను తెలియజేశాడు. బిలాముకున్న వరం -"అతను దీవించిన వారిని దేవుడు దీవిస్తాడు,శపించిన వారిని శపిస్తాడు" (సంఖ్యా 22:6). తన ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించకుండునట్లు దేవుడు అతణ్ని తన అధీనంలోకి తీసుకున్నాడు. ఆ సమయంలో ఎంతో ఆధ్యాత్మికమైన వ్యక్తిగా రాజు ముందు, అందరి ముందు కనిపిస్తాడు(రక్షకుడైన క్రీస్తును గూర్చి ప్రవచించాడు. సంఖ్యా 24:19). రాజుకు బిలాము బలహీనత బాగా తెల్సు గనుక ఆ విధానంలోనే పట్టుకున్నాడు. రాజు ఇవ్వదల్చిన బహుమతిని తిరిగి పొందడానికి, అతనికి కుయుక్తితో ఒక ఉపాయాన్ని చెప్పి ఇశ్రాయేలీయులు వ్యభిచార పాపం చేయడానికి కారకుడయ్యాడు. దేవుడు తిరుగుబాటు చేసిన వారిని విడిచి పెట్టేస్తాడని అతనికి బాగా తెల్సు! కనుక మోయాబు, మిద్యాను స్త్రీలును ఇశ్రాయేలీయులు దగ్గరికి పంపి వారిని వ్యభిచారులయ్యేట్లుగా సలహా ఇచ్చాడు (సంఖ్యా 25:1-3; 31:15). మరి బిలాము తన అవిధేయత గూర్చి ఎందుకు ఆలోచింపలేక పోయాడో?
■ 'నీతిమంతునిగా జీవించాలి' అనే కోరిక, మనలోని అన్ని కోరికల కంటే ప్రధామమైనదిగా, బలమైనదిగా ఉండాలి. బిలాము కూడా దీనిని కోరుకున్నాడు (సంఖ్యా 23:10) కానీ అది ప్రధానమైనది కానప్పుడు అపవాది ఎలా చేజిక్కిచుకోవాలో బాగా తెల్సు. విశ్వాస భ్రష్టుడైన బిలాము తుదకు దేవుని చేత చంపబడ్డాడు(సంఖ్యా 31:8). కనుకనే లేఖనాల్లో నేటికి ఆత్మీయ భ్రష్టుత్వానికి ఉదాహరణగా నిలిచిపోయాడు. పేతురు సంఘాలను హెచ్చరించాడు. ఇలాంటి భ్రష్టస్థితిలో ఉన్న భోధకులు, పడిపోయిన విశ్వాసులు నేడు సంఘాల్లో ఉన్నారు. ఇట్టి వారి కోసం గాఢాంధకారం (పాతాళం) భద్రం చేయబడివుంది.ఒకనికి ఆత్మీయ వరం౼అతనికి దేవునితో ఉన్న సహవాసాన్ని తెలియజేయదు, గాని ఆత్మ ఫలము మాత్రమే దీనికి నిదర్శనంగా ఉంటుంది. వరాలు కలిగిన వ్యక్తుల వెనక పడొద్దు, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులను గుర్తుపట్టండి. వారు క్రీస్తును పోలి నడుస్తారు, విలువైన ఆ మార్గానే ప్రథమంగా బోధిస్తారు.
★ స్నేహితులారా! దేవుడు యదార్థ హృదయం కోరుతున్నాడు. ఏ పాపం దేవుని చిత్త ప్రకారం జీవించడం కంటే ఇష్టంగా ప్రేమిస్తున్నావో, దానిని ప్రభువు సన్నిద్ధిలో యదార్ధంగా పెట్టి విడుదల చెయ్యమని హృదయపూర్వకంగా వేడుకో! ఏ పాపం నిన్ను ఏలనియ్యక, ప్రభువు మాత్రమే నీ జీవితంపై ఏలికగా నిలుపుకో!
ఇలాంటి దుర్భోధకులు నీళ్ళు లేని బావుల్లాంటి వాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొని పోయే మేఘాల్లాంటి వాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు" (2 పేతురు 2:15-17) ✴️
■ దేవుని వాగ్ధాన దేశమైన కనానుకు ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను శపించమని బాలాకు(మోయాబు రాజు), ప్రవక్తయైన బిలామును కోరాడు. బిలాము దేవుని యొద్ద కనిపెట్టగా౼"వీరు ఆశీర్వదించబడిన ప్రజలు, కనుక శపించునట్లుగా నీవు రాజు నొద్దకు వెళ్లకూడదని" స్పష్టంగా చెప్పాడు. కాని రాజు మరి ఎక్కువ బహుమతిని ఆశ చూపాడు. అప్పుడు బిలాము మాటలు గమనిస్తే ఎంతో ఆత్మీయంగా కనిపిస్తాయి (సంఖ్యా 22:8,18,19). 'ఇంటి నిండా వెండి, బంగారాలిచ్చినా దేవుని ఆజ్ఞను మీరలేను. కానీ వేచి ఉండండి..మరోసారి దేవుని వద్ద కనిపెడతానని' చెప్పి, తనలోని ధనాశను దేవుని ఎదుట బహిరంగ పర్చాడు.
పైపై మాటలను బట్టి మోసపోవడానికి దేవుడు నరుడు కాడు. తియ్యటి ఆత్మీయ పలుకుల కంటే హృదయాన్ని,దాని అంతరంగ ఉద్దేశ్యాలను ఆయన గమనిస్తాడు. లోలోపల వదిలివేయడానికి ఇష్టపడక, భద్రపర్చుకున్న దురాశాలను ఆయన స్పష్టంగా చూడగలడు. మునుపు మనం అలాంటి వారమే, కానీ నేడు క్రీస్తులో ఉన్న మనం ఆ దురాశలను విడిచి పెట్టి దైవ స్వభావంలోకి రూపాంతరం చెందాలి (2 పేతు 1:4). ఎందుకంటే నిలబెడతానని ఆయన ఇచ్చిన వాగ్ధానాలు మనకున్నాయి. మన స్వేచ్ఛలో నుండే ఆ దురాశాలను (పాత స్వభావాన్ని) ద్వేషించి, దైవ స్వభావాన్ని హత్తుకోవాలి.
■ బిలాము హృదయంలో దేవుణ్ని కాకుండా మరొకటి ఆశించాడు గనుక రెండవ మారు అడిగినప్పుడు దేవుడు వెళ్ళమని చెప్పాడు. దానార్ధం అది ఆయన చిత్తమని కాదు, అతని స్వేచ్ఛకు అతణ్ణి అప్పజెప్పేశాడు. దేవుడు అతను ప్రయాణం చేసిన గాడిదకు మానవ స్వరాన్ని అనుగ్రహించుట ద్వారా, ఖడ్గం ధరించిన దేవదూతను పంపడం ద్వారా ప్రవక్తను హెచ్చరించాడు. అతని చర్య తీవ్రతను తెలియజేశాడు. బిలాముకున్న వరం -"అతను దీవించిన వారిని దేవుడు దీవిస్తాడు,శపించిన వారిని శపిస్తాడు" (సంఖ్యా 22:6). తన ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించకుండునట్లు దేవుడు అతణ్ని తన అధీనంలోకి తీసుకున్నాడు. ఆ సమయంలో ఎంతో ఆధ్యాత్మికమైన వ్యక్తిగా రాజు ముందు, అందరి ముందు కనిపిస్తాడు(రక్షకుడైన క్రీస్తును గూర్చి ప్రవచించాడు. సంఖ్యా 24:19). రాజుకు బిలాము బలహీనత బాగా తెల్సు గనుక ఆ విధానంలోనే పట్టుకున్నాడు. రాజు ఇవ్వదల్చిన బహుమతిని తిరిగి పొందడానికి, అతనికి కుయుక్తితో ఒక ఉపాయాన్ని చెప్పి ఇశ్రాయేలీయులు వ్యభిచార పాపం చేయడానికి కారకుడయ్యాడు. దేవుడు తిరుగుబాటు చేసిన వారిని విడిచి పెట్టేస్తాడని అతనికి బాగా తెల్సు! కనుక మోయాబు, మిద్యాను స్త్రీలును ఇశ్రాయేలీయులు దగ్గరికి పంపి వారిని వ్యభిచారులయ్యేట్లుగా సలహా ఇచ్చాడు (సంఖ్యా 25:1-3; 31:15). మరి బిలాము తన అవిధేయత గూర్చి ఎందుకు ఆలోచింపలేక పోయాడో?
■ 'నీతిమంతునిగా జీవించాలి' అనే కోరిక, మనలోని అన్ని కోరికల కంటే ప్రధామమైనదిగా, బలమైనదిగా ఉండాలి. బిలాము కూడా దీనిని కోరుకున్నాడు (సంఖ్యా 23:10) కానీ అది ప్రధానమైనది కానప్పుడు అపవాది ఎలా చేజిక్కిచుకోవాలో బాగా తెల్సు. విశ్వాస భ్రష్టుడైన బిలాము తుదకు దేవుని చేత చంపబడ్డాడు(సంఖ్యా 31:8). కనుకనే లేఖనాల్లో నేటికి ఆత్మీయ భ్రష్టుత్వానికి ఉదాహరణగా నిలిచిపోయాడు. పేతురు సంఘాలను హెచ్చరించాడు. ఇలాంటి భ్రష్టస్థితిలో ఉన్న భోధకులు, పడిపోయిన విశ్వాసులు నేడు సంఘాల్లో ఉన్నారు. ఇట్టి వారి కోసం గాఢాంధకారం (పాతాళం) భద్రం చేయబడివుంది.ఒకనికి ఆత్మీయ వరం౼అతనికి దేవునితో ఉన్న సహవాసాన్ని తెలియజేయదు, గాని ఆత్మ ఫలము మాత్రమే దీనికి నిదర్శనంగా ఉంటుంది. వరాలు కలిగిన వ్యక్తుల వెనక పడొద్దు, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులను గుర్తుపట్టండి. వారు క్రీస్తును పోలి నడుస్తారు, విలువైన ఆ మార్గానే ప్రథమంగా బోధిస్తారు.
★ స్నేహితులారా! దేవుడు యదార్థ హృదయం కోరుతున్నాడు. ఏ పాపం దేవుని చిత్త ప్రకారం జీవించడం కంటే ఇష్టంగా ప్రేమిస్తున్నావో, దానిని ప్రభువు సన్నిద్ధిలో యదార్ధంగా పెట్టి విడుదల చెయ్యమని హృదయపూర్వకంగా వేడుకో! ఏ పాపం నిన్ను ఏలనియ్యక, ప్రభువు మాత్రమే నీ జీవితంపై ఏలికగా నిలుపుకో!
Comments
Post a Comment