Skip to main content

26Mar2018


✴️ఓలివ కొండ నుండి దిగే చోటికి ఆయన గాడిదపై వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు.
ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు౼“బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. ఆయన౼“వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. (లూకా 19:37-40)

యేసు దేవాలయానికి వచ్చినప్పుడు గుడ్డివారు, కుంటివారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారందరినీ బాగుచేశాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.౼“వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని చెప్పాడు (మత్తయి 21:14-16) ✴️

■ వారు చూసిన దేవుని అద్బుతకార్యాలు కొందరి నోట స్తుతిని ఉంచగా, మరికొందరికి అసూయను, ద్వేషాన్ని రగిలించాయి. ఇది చెడిపోయిన మనసాక్షికి ఉదాహరణ. ఒకరి మేలు/ఘనత మరొకనికి అసూయను కలుగజేస్తుంటే, అది వారి చెడిపోయిన మనస్సును తెలియజేస్తుంది. మనం దానిని గుర్తించి దేవుని యెదుటకు ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవెళ్లాలి. "ఇది ఒకప్పుడు నాలో ఉన్న చెడిపోయిన లక్షణం..ప్రభూ! ఈ మనస్సుతో నేను ఏకీభవించట్లేదు. క్రీస్తు వలె ఎదుటివారి(శత్రువుల సైతం) మంచిని కోరే మంచి మనస్సు నాకు దయచేయి (లూకా 23:34)", ఎప్పుడు అటువంటి శోధన కలిగినా, వెనువెంటనే ఆ స్వభావాన్ని దేవుని సన్నిధిలో పెట్టాలి. ఇది నువ్వు నీ పాత స్వభావంతో నీవు పోరాడుతున్నావని దేవుని ముందర తెలియజేస్తుంది. లేదంటే ఆ అసూయ స్వభావం అగ్ని వలె దహించి మన నాశనానికి దారితీస్తుంది. పరిసయ్యులు, మతపెద్దలు లేఖనాల్లో ఉన్న ఏ క్రీస్తు కోసం ఎదురుచూశారో, అదే క్రీస్తును కుట్ర చేసి చంపారు.

■ ప్రభువు చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి శిష్యులు, చిన్నపిల్లలు స్తుతిస్తూ ఉంటే, అదే గుంపులో ఉన్న వీళ్ళు వాటిని విని తట్టుకోలేకపోయారు. వారు ప్రభువు వెంబడే తిరుగుతూ, దేవాలయంలో దేవుని వాక్యాలను భోదిస్తూ ఉంటున్నారు కానీ దేవుని మనస్సును కలిగిన వారు కారు(దైవ మనస్సుతో ఏకీభవించ లేకపోయారు). ఆశ్చర్యమేమిటంటే చిన్నబిడ్డలు, ఏ మాత్రం లేఖన జ్ఞానం లేని సామాన్యులు స్వేచ్ఛగా ప్రభువు వద్దకు వచ్చి, ఆయన్ను కొనియాడారు. దేవుడు కూడా వారి కల్మషం లేని స్తుతులను అంగీకరించాడు. క్రీస్తును సంతోష పెట్టే సంగతులు మనకు కష్టంగా ఉన్నప్పుడు, ఆయన్ను దుఃఖపెట్టే విషయాలు (మత్తయి 21:12,13) మనకు ఏ మాత్రం నొప్పిని కలిగించనప్పుడు, మనం ఆయనతో ఉన్నామని చెప్పుకున్నా మనం ఆయన వారము కాము. క్రీస్తుతో ఉంటున్నప్పుడు ఆయన ఎలా ప్రవర్తిస్తాడో, మనం అలాగే ప్రవర్తిస్తాము.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...