Skip to main content

Posts

Showing posts from March, 2018

26Mar2018

✴️ఓలివ కొండ నుండి దిగే చోటికి ఆయన గాడిదపై వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు. ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు౼“బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. ఆయన౼“వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. (లూకా 19:37-40) యేసు దేవాలయానికి వచ్చినప్పుడు గుడ్డివారు, కుంటివారు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారందరినీ బాగుచేశాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.౼“వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని చెప్పాడు (మత్తయి 21:14-16) ✴️ ■ వారు చూసిన దేవుని అద్బుతకార్యాలు కొందరి నోట స్తుతిని ఉంచగా, మరికొందరికి అసూయను, ద్వేషాన్ని ...

23Mar2018

✴️ పేతురు౼"అక్రమమైన ధనార్జన కోసం ఆశపడిన బెయోరు కుమారుడైన బిలామును అనుసరించి వారు తప్పిపోయారు. తిన్నని మార్గాన్ని వదిలిపెట్టారు. అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త వెర్రితనాన్ని అడ్డగించింది.  ఇలాంటి దుర్భోధకులు నీళ్ళు లేని బావుల్లాంటి వాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొని పోయే మేఘాల్లాంటి వాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం దాచి ఉంచాడు" (2 పేతురు 2:15-17) ✴️ ■ దేవుని వాగ్ధాన దేశమైన కనానుకు ప్రయాణమై వెళ్తున్న ఇశ్రాయేలీయులను శపించమని బాలాకు(మోయాబు రాజు), ప్రవక్తయైన బిలామును కోరాడు. బిలాము దేవుని యొద్ద కనిపెట్టగా౼"వీరు ఆశీర్వదించబడిన ప్రజలు, కనుక శపించునట్లుగా నీవు రాజు నొద్దకు వెళ్లకూడదని" స్పష్టంగా చెప్పాడు. కాని రాజు మరి ఎక్కువ బహుమతిని ఆశ చూపాడు. అప్పుడు బిలాము మాటలు గమనిస్తే ఎంతో ఆత్మీయంగా కనిపిస్తాయి (సంఖ్యా 22:8,18,19). 'ఇంటి నిండా వెండి, బంగారాలిచ్చినా దేవుని ఆజ్ఞను మీరలేను. కానీ వేచి ఉండండి..మరోసారి దేవుని వద్ద కనిపెడతానని' చెప్పి, తనలోని ధనాశను దేవుని ఎదుట బహిరంగ పర్చాడు. పైపై మాటలను బట్టి మోసపోవడానికి దేవు...

14Mar2018

✴️ చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి బాప్తిస్మమిచ్చు యోహాను౼“సర్పసంతానమా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు..‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెబుతున్నాను"(మత్తయి 3:7,9) అందుకు యేసు జక్కయ్యతో౼“ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే" (లూకా 19:9) ఆ నిరుపేదైన లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు (లూకా 16:22) ✴️ ■ అబ్రాహాము విశ్వాసంతో దేవునితో కూడా నడచినవాడు. దేవునికి స్నేహితుడిని లేఖనాల్లో అతనికి పేరు ఉంది. ఆయన వద్దకు దిగి వచ్చిన దేవదూతలను (దేవుణ్ని), దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. తన బలహీనతల నుండి బలమైన విశ్వాసిగా మార్పు చెందిన విశ్వాస వీరుడు. శాస్త్రులు, పరిసయ్యులు, మతనాయకులు తాము 'అబ్రాహాము సంతాన'మని, ఏర్పరచబడిన జనాంగమని ఉప్పొంగుతూ ఉన్నారు. ఐతే బాప్తిస్మమిచ్చు యోహాను వారిని సర్పసంతానమా అని పిలిచాడు (దేవుని అభిప్రాయం కూడా అదే). బహుశా! అంతకు ముందు ఎవ్వరూ ...

13March2018

❇ దేవుడు పౌలు చేత అసాధారణమైన అద్భుతాలు చేయించాడు. అతని శరీరానికి తాకిన చేతి గుడ్డలైనా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దయ్యాలు కూడా వదలిపోయాయి. అప్పుడు, దేశసంచారం చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టే యూదులు కొందరు, దయ్యాలు పట్టిన వారిపై౼“పౌలు ప్రకటించే యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాం” అని యేసుప్రభువు పేరు చెప్పడానికి పూనుకొన్నారు. స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు అలా చేశారు. ఆ దయ్యం వారితో౼“నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అంది. ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారిమీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత వారు గాయాలతో బట్టల్లేకుండా ఆ ఇంటి నుండి పారిపోయారు ❇ ■ యూదా మతస్తుడైన పౌలు ప్రభువును తెలుసుకోక ముందు ఎంతో భక్తిపరునిగా, మతాసక్తి గల వానిగా ఉన్నాడు(ఫిలిప్పీ 3:6). ఆ సమయంలో అతని జీవితంలో ఎలాంటి ప్రభావం లేదు. ప్రభువును తెల్సుకున్న తర్వాతే అతని ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయించాడు. దెయ్యాలు సైతం పౌలును గుర్తుపట్టాయి. ఒకడే వ్యక్తి..! కానీ అతని జీవితంలో ఎంతో తేడా కనిపిస్తుంది. కారణం..పౌలు దేవుణ్ని తెల్సుకున్నాడు-దేవుని చేత త...

12Mar2018

శోధన: ■ 'శోధన'౼ అనగా ఒక విశ్వాసి పాపం చెయ్యడానికి ప్రేరేపించబడటం. విశ్వాసిని దేవుని నుండి(ఆయన వాక్యంలో నిలువకుండా) వైదొలిగించడానికి సాతాను పన్నే వల. సహజంగా మనం దేవుణ్ని తెలిసికొనక మునుపు ఏ పాపాలను ఇష్టంగా చేస్తామో..ఆ విషయాలనే శోధనకు సాధనాలుగా సాతాను వాడుకుంటాడు. పూర్వం మనకు ఉన్న దురాశలను అనుసరించి నడుచుకొనునట్లుగా ప్రేరేపిస్తాడు (ఎఫె 4:22, తీతు 3:3). 'శోధన' అనేది ప్రతి విశ్వాసికీ సహజంగా కలిగే అనుభవమే! ఇది దేవుని అనుమతితోనే మనకు వస్తాయి. మనం భరింపదగిన దాని కంటే-అనగా మన శక్తికి మించిన శోధనా బలాన్ని మన జీవితంలో ఆయన అనుమతించడు(1కోరింథి 10:13). ఇందులో దేవుని ఉద్దేశ్యం మనల్ని మరింత బలవంతులుగా చెయ్యాలనే కానీ పాపంలో పడటం ఆయన చిత్తం కాదు! 'శోధించబడటం'(పాపపు ప్రేరణ రావటం) తప్పు కాదు, కాని ఆ ప్రేరణకు లొంగి ఆ పాపంలో పడి అపవాదితో ఏకీభవించడం 'పాపం'. శోధన జయించిన ప్రతిసారి మనకు మరికొంత ఆధ్యాత్మిక బలం తోడౌతుంది. ■ ఒకవేళ మనం శోధనలో పడినప్పుడు, వెంటనే దేవుని కృపా సింహాసనాన్ని ఆశ్రయించి ఆ పాపాన్ని వెంటనే కడిగివేసుకోవాలి(1యోహా 2:1). బలహీనతలను (పుర్వపు పాపాలను) చులకనగా తీ...

08Mar2018

❇ వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి౼“యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు౼“అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు౼“నా గొర్రెల్ని మేపు” అని అతనితో చెప్పాడు..... ఆయన మూడోసారి౼“యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి౼“ ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు(యోహాను 21:15-17) ❇ ■ ఓడిపోయి, నిరాశ-నిస్పృహలో కృంగివున్న ప్రతి విశ్వాసికి ఓదార్పు..పై వాక్యభాగం. పేతురు-'ఒకప్పుడు నేను ప్రభువు కోసం సమస్తం వదులుకొని వచ్చాను, నమ్మకంగా సేవిస్తున్నాను గనుక దేవుని కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నాకు ఉన్నదనుకున్నాడు'. తన భక్తికి ఉన్న బలం, తన స్వంత శక్తి మీదే ఆధారపడివుందన్న విషయం గ్రహించలేకపోయ్యాడు. ఆ స్థితి మనల్ని గురించి మనం అతిగా ఉహించుకునేందుకు ప్రేరేపించి మనల్ని మోసపుచ్చుతుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆ అబద్ధం మనల్ని విడిపించాలని...

05Mar2018

❇ యేసు నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు. ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి౼“ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. యేసు౼“చిన్నవాడా, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు. అందరూ భయంతో నిండిపోయి౼”మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. ❇ ■ విధవరాలి కుమారునికి ఆ మరణాన్ని అనుగ్రహించినది ఏవరు? దేవుడే కదా! మరి ఆయనే ఆమె దగ్గరకు వచ్చి 'ఏడవవద్దు' అని పలకడం నాటకీయంగా లేదా!మానవ జ్ఞానంతో దేవుని మనస్సును ఎన్నడూ అర్ధం చేసుకోలేము. క్రీస్తు ఆ చిన్నవాడ్ని చావు నుండి లేపాడు. కాని కొన్ని సంవత్సరాలుకు అతను మళ్ళీ చనిపోయాడు. అంటే ఇక్కడ చావునుండి లేపటం కంటే విలువైనది ఎదో ఉందని గ్...

03Mar2018

❇ యెహోషువ యెరికో దగ్గర ఉన్నప్పుడు అతడు తలెత్తి చూశాడు. అతనికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ మనుషుడు కత్తి దూసి చేతపట్టుకొని ఉన్నాడు. యెహోషువ ఆయన దగ్గరికి వచ్చి-“నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు. “కాదు! యెహోవా సైన్యానికి అధిపతిగా నేనిప్పుడు వచ్చాను” అని ఆయన జవాబిచ్చాడు. యెహోషువ ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి౼“ప్రభూ! తమ దాసుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగాడు. యెహోవా సైన్యాధిపతి యెహోషువతో౼“నీవు నిలబడ్డ ఈ స్థలం పవిత్రం గనుక నీ కాళ్ళనుంచి చెప్పులు తీసివెయ్యి” అన్నాడు. యెహోషువ అలా చేశాడు ❇ దేవుడు ఎవరి పక్షాన నిలుస్తాడు? ■ దేవుని సర్వ సైన్యాలు(దేవదూతలు) తమకు నచ్చిన పని తాము చేసుకుపోరు గాని దేవుని ఆదేశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన ఏం చెప్తే అదే చేశారు. కొద్దివారికేమి, గొప్పవారికేమి దేవుడు చెప్పమన్న వార్తను మోసుకుపోయ్యారు, దేవుని ప్రజలకు సహాయకులుగా నిలిచారు. యుద్దాలు చేశారు, రక్షకులుగా నిలిచారు, ఓదార్చారు-బలపర్చారు, పరిశుద్ధులకు పరిచర్య చేశారు. ఐతే వారు దేవుడు సెలవివ్వకుండా ఏ ఒక్క పని చెయ్యరు. ఆ విధంగా వారు దేవుని పక్షం ఉన్నారు కనుకనే దేవుడు వారి...

28Feb2018

❇ తెరహు(అబ్రాము తండ్రి) తన కుటుంబముతోబాటు కల్దీయుల 'ఊరు' అను పట్టణమును పెట్టి, 'కనాను'కు ప్రయాణం చేయాలని అనుకున్నారు. తన కుమారుడు అబ్రామును, మనమడు లోతును, కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. ఐతే వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి,అక్కడ ఉండిపోవాలని నిర్ణయించు కొన్నారు. తెరహు 205 సంవత్సరాలు జీవించి హారానులో మరణించాడు. అప్పుడు యెహోవా అబ్రాముతో౼“నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించు దేశానికి వెళ్లు..." అబ్రాము తన భార్య శారయిని, లోతుని, హారానులో వారు గడించిన సంపదనూ, సంపాదించుకొన్న వ్యక్తులనూ తీసుకొని 'కనాను' దేశానికి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు (ఆది 11:31,32; 12:1-5)❇ ■ దేవుడు అబ్రామును 'హారాను' పట్టణంకు రాక ముందే అనగా కల్దీయుల దేశంలోని 'ఊరు' అను పట్టణములో ఉండగానే పిలిచాడు(అపో 7:2). తన తండ్రియైన తెరహు ఇంటి పెద్దగా ఉండగా అబ్రాము, అతనితో పాటు కానానుకు ప్రయాణం అయ్యాడు (హెబ్రీ 11:8). 'కానాను' అనే పేరు గల ప్రదేశానికి వెళ్ళమని కూడా దేవుడు చెప్పలేదు. ఎప్పుడైనా దేవుడు పూర్తి వ...

26Feb2018

❇ పౌలు బర్నబాతో౼“ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అన్నాడు. అప్పుడు 'మార్కు' అనే పేరున్న యోహానును వెంటబెట్టుకొని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు. అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకొని పోవడం భావ్యం కాదని తలంచాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. (అపో 15:36-41)❇ ■ "బర్నబా" భక్తిపరుడునూ,ఆదరణ చూపటంలో ఆసక్తిపరుడుగా కనిపిస్తాడు (అపో 4:36,37). ఒకప్పుడు క్రూరుడైన సౌలు(పౌలుగా) మారాక ప్రతి ఒక్కరూ అతన్ని నమ్మక, భయపడి దూరంగా ఉన్నప్పుడు,బర్నబానే అతణ్ణి ఆదరించి అపొస్తలులకు పరిచయం చేశాడు(అపో 9:27). ఆదరించే అతని స్వభావాన్ని బట్టి "బర్నబా" అని అపొస్తలులే అతనికి పేరు పెట్టారు.పౌలు దేవుణ్ని ఎంతో శ్రద్ధగా వెంబడించే వానిగా ఉన్నాడు(zealous for GOD) . క్రీస్తును ఎంత బలంగా ద్వేషించాడో, దేవుడు అతనికి కనపర్చుకొన్న తర్వాత అంతే ప్రేమతో, భయభక్తులతో క్రీస్తును సేవించాడు. క్రీస్తును ధరించుకోవడం కొరకు, తన పట్ల దే...