Skip to main content

03Nov2017



"ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు,
పరలోకం నుండి పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, పరిశుద్దాత్మలో భాగం పంచుకున్న వాళ్ళు,
దేవుని శుభవాక్కునూ౼దైవ సందేశం యొక్క మంచితన్నాన్ని రుచి చూసిన వాళ్ళు,
రానున్న కాలం యొక్క శక్తిని రుచి చూచిన వాళ్ళు",

ఒకవేళ మార్గం విడిచి (పడిపోతే)తప్పిపోతే౼'వారిని తిరిగి మారుమనస్సు పొందేటట్లు(పశ్చాత్తాప పడేలా) చేయటం అసంభవం. ఎందుకంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయనను బహిరంగంగా అవమానపరుస్తున్నారు' (హెబ్రీ 6:4౼6).

"ఒకప్పుడు క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను, గనుక నేను శాశ్వితంగా రక్షణ పొందాను.." అనేది మనకు తెల్సిన,అనేక సార్లు మనం వింటున్న మాటలు. ఐతే సత్యనికి సరైన ప్రామాణికం౼ భక్తిపరుడైన భోధకుని మాటలో, ఇప్పటివరకు మనం నమ్మిన సిద్దాంతపు భోధో కాకూడదు కానీ దేవుని వాక్యము మాత్రమే ప్రామాణికం అవ్వాలి.

రక్షణ౼ మన క్రియలను బట్టి కాకుండా క్రీస్తు యేసుపై ఉంచిన విశ్వాసం మూలంగా, మారుమనస్సు ఫలితంగా దేవుడు అనుగ్రహించిన ఒక బహుమనం(కృప). ఇది అందరి రక్షణ నిమిత్తం దేవుడు బాహాటంగా ఉంచిన ఒక పిలుపు(మత్త 11:28). విశ్వసించిన వారు కేవలం ఆయన ఉచితమైన కృప చొప్పునే పొందుతారు. రక్షణకు మూలం "విశ్వాసం౼దేవుని కృప" (ఎఫెస్సి 2:8). ఒకణ్ని దేవుడు(ఆయన ఆత్మ ద్వారా) ఒప్పిస్తే తప్ప, 'యేసు వాని రక్షకుడు' అనే సత్యాన్ని ఒప్పుకోవడం అసాధ్యం (మత్త 16:17).

మరి దేవుడు పక్షపాతా?! కొందరు మాత్రమే ఆయన్ను అంగీకరిస్తున్నారు. అనేకులు తిరస్కరించి నశించిపోతున్నారు! వీరిని దేవుడు ఒప్పించట్లేదా!? దేవుడు పక్షపాతి కాదు. అందరూ, అంతటా మారుమనస్సు పొందాలని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు(2పేతు 3:9,1తిమో 2:4). సర్వలోకానికి సువార్తను పంపుతున్నాడు. దేవుని ఆత్మ ఒప్పించడంతో పాటు మానవుని స్వేచ్ఛ పూర్వకమైన నిర్ణయంతోనే విశ్వాసం కార్యరూపం దాల్చుతుంది. గుర్తుంచుకోండి! పక్షపాతం లేకుండా దేవుని కృప సిద్ధంగానే ఉంది, మానవుని తీర్మానమే వారి నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది.
౼అంటే 'దేవుని(క్రీస్తుని) గూర్చిన ప్రత్యక్షతకు "అవును" అని మనుష్యుని స్వేచ్చా నిర్ణయంతో ఏకీభవించడం',దేవుని రక్షణకు పాత్రులముగా చేస్తుంది.!

రక్షణ పొందిన తర్వాత, ఆ స్వేచ్ఛను ఇక దేవుడు ఆయన ఆధీనంలోకి తీసుకుంటాడా!లేదు..!ఆ స్వేచ్ఛలో నుండే ఆయన్ను వెంబడించడానికి తీర్మానం చేసుకోవాలి. కనుకనే ఒకరి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మరొకరి ఎదుగుదలకు తేడా ఉంటుంది. ఒకడు అనేక సం|| దేవునితో ఉండి క్రీస్తును పోలి నడవకపోవచ్చును,మరొకడు అతి కొద్ది దినాల్లో ఎంతో ఆధ్యాతిక పరిణతిలోకి, క్రీస్తు స్వరూప్యంలోకి మార్చపడ వచ్చును. దేవుణ్ని అనుభవ పూర్వకంగా తెల్సుకోవడానికి, ఆయనలో ఆనందించడానికి కావాల్సిన కృపను దేవుడు ఎల్లప్పుడూ వారికి చేరువలోనే ఉంచుతాడు(2కోరింధి 6:1, 1కోరింధి 15:10).

క్రైస్తవ లోకంలో నేను విన్న ఒక సిద్ధాంతం౼"రక్షణలో నీ క్రియలు లేనట్టే, రక్షించబడిన తర్వాత నీ క్రియలు అవసరం లేదు.దేవుడే నిలువబెట్టుకుంటాడు." అని చెప్పే వ్యర్ధ వాదన! ఈ క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మ నియమం క్రింద విశ్వాసి నడవాల్సిన హెచ్చరికలతో పౌలు/అపొస్తలుల పత్రికలు నిండివున్నాయి. విశ్వాసి ఇక (ఆధ్యాత్మిక)క్రీస్తు యోధుని వలె సిద్ధపడి ఉండాలని, కృపలో నిలిచి ఉండాలని బోధించారు (ఎఫెస్సి 6:13, హెబ్రీ 12:4, అకా 13:43). రక్షించబడిన విశ్వాసి, క్రీస్తులో నిలిచి ఉండాలని దేవుని వాక్యము బోధిస్తుంది. ఆ తీర్మానం మొదట విశ్వాసిదే అని గమనించండి(యోహా 15:4).ఇప్పటికీ విశ్వాసి తాను కోరుకున్నదే చేయగలిగిన స్వచ్ఛ కలిగి ఉన్నాడని మనకు తెల్సు కదా!నీవు కోరుకుంటేనే దేవునితో సమయం గడుపుతావు.నీవు తీసుకున్న నిర్ణయాలు నిరాటంకంగా చేసుకునే స్వేచ్ఛ నీకు ఉంది. దేవుడు దాన్ని తీసియేయ్యలేదు. ఐతే దేవుడు రక్షణ విషయంలో ఒక అవిశ్వాసి ఆయన్ను కలుసుకోవడానికి ఎంత కృపను అనుగ్రహిస్తాడో, విశ్వాసి ఎదుగుదలకు కూడా అవసరమైన కృపను/అవకాశాలను అనుగ్రహిస్తాడు.మానవుని దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన దేవుని లక్షణం "స్వేచ్ఛ". దానిని ఆయన ఎన్నడూ హరించడు.

మిగితా విషయాలు రేపటి ధ్యానంలో ఇంకా వివరంగా వ్రాస్తాను. వీటిని జ్ఞానం కోసం వ్రాయటం లేదు. దేవుని వాక్య వెలిగింపు నిమిత్తం మాత్రమే నా స్వహస్తాలతో వ్రాస్తున్నాను. దయచేసి రెఫర్స్ చదవండి. ౼Bro.Christopher

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...