❇ఒకసారి యేసు వెళ్తుంటే క్రిక్కిరిసిన జనసమూహం ఆయన మీద పడుతున్నారు. అప్పుడు 12 సం|| నుండి రక్తస్రావంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్న డబ్బంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె విశ్వాసంతో యేసు వెనగ్గా వచ్చి ఆయన పైబట్ట అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
వెంటనే యేసు౼"నన్ను తాకిందెవరు?" అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు "మాకు తెలియదే" అన్నారు.
అప్పుడు పేతురు౼"ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ మీద పడుతున్నారు" అన్నాడు.
యేసు౼"ఎవరో నన్ను తాకారు. నాలోనుండి ప్రభావం బయటకు వెళ్లిందని నాకు తెలిసింది" అన్నాడు.
ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్ధమైంది.ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలకి వివరించి చెప్పింది. అందుకు ఆయన౼"కుమారీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు" అన్నాడు. ❇
■ బహిరంగంగా చెప్పుకోలేని రోగంతో౼శారీరకంగా, ఆర్ధికంగా మానసికంగా ఆ స్త్రీ కృంగిపోయివుంది. ఇక బాగవుతానన్న నిరీక్షణ లేనప్పుడు, యేసు గూర్చి విని విశ్వాసంతో ఆయనను దగ్గరకు వచ్చింది(దేవుని గూర్చి వినడం ద్వారా దేవునిపై విశ్వాసం పుడుతుంది). బలహీనమైన ఆ స్త్రీ క్రిక్కిరిసిన జనసమూహం మధ్యలోకి వెళ్లి ఆయన్ను తాకటాన్ని బట్టి౼ యేసుపై ఆమెకు గల దృఢమైన విశ్వాసాన్ని, బాగవ్వడం కోసం ఆమె పడిన తాపత్రయాన్ని తెలియజేస్తుంది. గొప్ప జనసమూహం ఆయనపై పడుతూ ఉన్నప్పటికీ విశ్వాసంతో తాకిన ఆమెను మాత్రమే దేవుని శక్తి తాకింది. దేవుడు ఎన్నటెన్నటికీ శక్తిమంతుడే! కానీ విశ్వాసం అనే plug ను అనుసంధానం చేసినప్పుడే ఆ ప్రభావం flow అవుతుంది. నిజమైన విశ్వాసం-"దానికి తగిన పనులు చేయడం ద్వారానే రుజువు చేయ బడుతుంది". అలా నిజమైన విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చే వారే(విశ్వాసులే), దేవుని శక్తిని-ప్రభావాన్ని వారి జీవితంలో తెల్సుకోగలరు.ఆయన ఎలాంటి వాడో అనుభవాల ద్వారా తెల్సుకున్న ప్రజలు ధన్య జీవులు!
■ ఆ స్త్రీ గురించి క్రీస్తుకు ముందే తెలుసా?అవును.. ముందుగానే తెలుసు! తల్లిదండ్రులకు, భార్యకు, స్నేహితులకు, ఇలా ఎవరికీ పంచుకోలేని విషయాలు దేవునితో పంచుకోవచ్చని నీకు తెలుసా? దేవుడు కూడా అలాంటి స్నేహాన్ని మనుష్యులతో చేయడానికి ఇష్టపడతాడు. నిజానికి ఆయన మనుష్యులను సృష్టించిన ఉద్దేశ్యం అదే! ఎవ్వరికి చెప్పుకోలేని పాపంతో, బలహీనతలతో, సమస్యలతో దిగులుపడుతున్నావా?'ఇలాంటివి దేవునితో చెప్పొచ్చా?'అని సందేహం పెట్టుకోకుండా ప్రతి విషయం ఆయనతో చెప్పొచ్చు!
నిన్ను అర్ధం చేసుకోవడమే కాదు, దాన్నుండి విడిపించ గల సమర్థుడు!..దేవుడు! ఐతే నువ్వు ఆయన మాటను వినటానికి తీర్మానం చేసుకోవాలి.అప్పుడు మాత్రమే ఆయన నీ జీవితంలో కలుగుజేసుకోగలడు.
౼ఆమె silent గా వచ్చి silent గా వెళ్లాలనుకుంది.కానీ దేవుడు ఆ గొప్ప విశ్వాసాన్ని అందరి ముందు కనబరచాలని ఆశిస్తాడు.
చీకట్లో క్రొవొత్తిని వెలిగించిన తర్వాత, దాన్ని cupboardలో పెట్టి ఎవ్వరూ తాళం వేయ్యారు కదా!అంతటికీ వెలిగివ్వడానికి ఎత్తైన place లో ఉంచినట్లే, విశ్వాసం కూడా బహిరంగంగా కనబరచాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది...
వెంటనే యేసు౼"నన్ను తాకిందెవరు?" అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు "మాకు తెలియదే" అన్నారు.
అప్పుడు పేతురు౼"ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ మీద పడుతున్నారు" అన్నాడు.
యేసు౼"ఎవరో నన్ను తాకారు. నాలోనుండి ప్రభావం బయటకు వెళ్లిందని నాకు తెలిసింది" అన్నాడు.
ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్ధమైంది.ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలకి వివరించి చెప్పింది. అందుకు ఆయన౼"కుమారీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు" అన్నాడు. ❇
■ బహిరంగంగా చెప్పుకోలేని రోగంతో౼శారీరకంగా, ఆర్ధికంగా మానసికంగా ఆ స్త్రీ కృంగిపోయివుంది. ఇక బాగవుతానన్న నిరీక్షణ లేనప్పుడు, యేసు గూర్చి విని విశ్వాసంతో ఆయనను దగ్గరకు వచ్చింది(దేవుని గూర్చి వినడం ద్వారా దేవునిపై విశ్వాసం పుడుతుంది). బలహీనమైన ఆ స్త్రీ క్రిక్కిరిసిన జనసమూహం మధ్యలోకి వెళ్లి ఆయన్ను తాకటాన్ని బట్టి౼ యేసుపై ఆమెకు గల దృఢమైన విశ్వాసాన్ని, బాగవ్వడం కోసం ఆమె పడిన తాపత్రయాన్ని తెలియజేస్తుంది. గొప్ప జనసమూహం ఆయనపై పడుతూ ఉన్నప్పటికీ విశ్వాసంతో తాకిన ఆమెను మాత్రమే దేవుని శక్తి తాకింది. దేవుడు ఎన్నటెన్నటికీ శక్తిమంతుడే! కానీ విశ్వాసం అనే plug ను అనుసంధానం చేసినప్పుడే ఆ ప్రభావం flow అవుతుంది. నిజమైన విశ్వాసం-"దానికి తగిన పనులు చేయడం ద్వారానే రుజువు చేయ బడుతుంది". అలా నిజమైన విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చే వారే(విశ్వాసులే), దేవుని శక్తిని-ప్రభావాన్ని వారి జీవితంలో తెల్సుకోగలరు.ఆయన ఎలాంటి వాడో అనుభవాల ద్వారా తెల్సుకున్న ప్రజలు ధన్య జీవులు!
■ ఆ స్త్రీ గురించి క్రీస్తుకు ముందే తెలుసా?అవును.. ముందుగానే తెలుసు! తల్లిదండ్రులకు, భార్యకు, స్నేహితులకు, ఇలా ఎవరికీ పంచుకోలేని విషయాలు దేవునితో పంచుకోవచ్చని నీకు తెలుసా? దేవుడు కూడా అలాంటి స్నేహాన్ని మనుష్యులతో చేయడానికి ఇష్టపడతాడు. నిజానికి ఆయన మనుష్యులను సృష్టించిన ఉద్దేశ్యం అదే! ఎవ్వరికి చెప్పుకోలేని పాపంతో, బలహీనతలతో, సమస్యలతో దిగులుపడుతున్నావా?'ఇలాంటివి దేవునితో చెప్పొచ్చా?'అని సందేహం పెట్టుకోకుండా ప్రతి విషయం ఆయనతో చెప్పొచ్చు!
నిన్ను అర్ధం చేసుకోవడమే కాదు, దాన్నుండి విడిపించ గల సమర్థుడు!..దేవుడు! ఐతే నువ్వు ఆయన మాటను వినటానికి తీర్మానం చేసుకోవాలి.అప్పుడు మాత్రమే ఆయన నీ జీవితంలో కలుగుజేసుకోగలడు.
౼ఆమె silent గా వచ్చి silent గా వెళ్లాలనుకుంది.కానీ దేవుడు ఆ గొప్ప విశ్వాసాన్ని అందరి ముందు కనబరచాలని ఆశిస్తాడు.
చీకట్లో క్రొవొత్తిని వెలిగించిన తర్వాత, దాన్ని cupboardలో పెట్టి ఎవ్వరూ తాళం వేయ్యారు కదా!అంతటికీ వెలిగివ్వడానికి ఎత్తైన place లో ఉంచినట్లే, విశ్వాసం కూడా బహిరంగంగా కనబరచాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది...
Comments
Post a Comment