Skip to main content

27Oct2017


❇ పౌలు౼"నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడ్డాను. కాబట్టి ఇక మీదట నేను జీవించటం లేదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న ఈ జీవితం..'నన్ను ప్రేమించి, నా కోసం తన్నుతాను అప్పగించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను'" ❇

1.జ్ఞానం(intellectual) 2.భావోద్వేగాలు (emotions), 3.స్వచిత్తం(self will)తో కలబోసిన దేవుని స్వభావంలో మానవుడు ప్రత్యేకంగా దేవునిచేత నిర్మించబడ్డాడు. ఏదెను తోటలో మొదటి మానవులు బుద్ధిపూర్వకంగా దేవుడ్ని తిరస్కరించినప్పుడు, చెడిపోయిన స్వభావాన్ని ఫలితంగా పొందారు. తద్వారా దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. మానవుడు తిరిగి ఆయనతో సంభంధంలోకి రావడానికి ఈ మూడింటిని ఆయన తిరిగి వాడుకుంటాడు. మనలో ఆయన్ను గూర్చిన జ్ఞానంతో వెలిగిస్తాడు. మన చెడిపోయిన స్థితిని బట్టి, పశ్చాత్తాపంతో మారుమనస్సు సంబంధమైన దుఃఖాన్ని కలిగిస్తాడు. మన స్వేచ్ఛపూర్వకమైన నిర్ణయంతో మన హృదయాల్లో నివసిస్తాడు. జ్ఞానం, భావోద్రేకాలు మనల్ని చివరికి దేవుని చెంతకు మరలే తీర్మానాలకు నడిపించాలి. అలా జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి.

1) (వాక్య)జ్ఞానం: దేవుణ్ని గూర్చిన జ్ఞానం మన తలల్లోకి హెచ్చుగా ఆపేక్షిస్తూ..దేవుణ్ని అనుభవపూర్వకంగా తెలియని వారంగా కూడా ఉండొచ్చు. అంటే బైబిల్లోని వాక్యాలు, భక్తుల జీవిత చరిత్రలు, లేఖనాల గూర్చిన లోతైన భావాలు తెల్సుకొని కూడా..దేవునితో అట్టి అనుభవాలను ఆపేక్షించక, అవి కేవలం తలకే పరిమితమౌతాయి. అలాంటి వ్యక్తులు వ్యక్తిగతంగా రహస్య జీవితంలో ఓడిపోయే వారుగా ఉంటారు.తమకే వ్యక్తిగతంగా అనుభవాలు ఉండవు గనుక నూతనంగా దేవునిలో పుట్టిన వారికి సహాయకులు ఎన్నడూ కాలేరు.మహా ఐతే పండిన వారి తలల్లో నుండి కొంత జ్ఞానం తీసి ఇస్తారు. వారిని వెంబడించే వారు కూడా వారిలానే తయారౌతారు. దేవునితో సహవాసం అంటే పుస్తక ధ్యానంగా భావిస్తారు తప్ప, ఆయనతో వ్యక్తిగత సహవాసాన్ని,సన్నిహిత్యాన్ని వారు యెరుగలేరు. ఒకప్పుడు అట్టి అనుభవాలు ఉండి నేడు చల్లారిపోయి, లోకసంబంధుల వంటి జీవనంలో మునిగిపోయి వుండవచ్చు.

2) భావోద్రేకాలు: ఈ చివరి దినాల్లో అనేకమంది ప్రజలు కేవలం ఉద్రేకంతో కూడిన ప్రసంగాలకు, మనస్సుకు ఉల్లాసపర్చే సంగీతాలకు, కార్యక్రమాలకు, మత్తెకించే కొత్త సిద్దాంతాలకు, హెల్త్-వెల్త్ గాస్పెల్కు, మనుష్యుల కేంద్రీకృత శుభవార్తలకు చెవి ఇచ్చి అపవాది వెంట వెళ్తున్నారు. దేవుని పేరుతోనే ఇవ్వన్నీ జరుగుతాయి. కానీ వాక్యానుసారమైన ఆధారాలతో వారికి పని ఉండదు. ఇలాంటి భావోద్రేకాల వల్ల జీవితాలను ఇంచుకంతైనా మారవు. చర్చ్/మీటింగ్ నుండి బయటికి రాగానే ఉద్రేకాలు చల్లారిపోతాయి. మళ్ళీ పాత బ్రతుకులే! ఆ భోధకులు, వారిని అనుసరించువారు అలాంటి వారిగానే ఉంటారు. దేవునితో వీరికి బంధం ఉండదు.

3) స్వచిత్తం: పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని వాక్యము మనల్ని తాకితే, మన ఆత్మలో ఉన్న స్వచిత్తం (own Will) చనిపోవడం మొదలౌతుంది. అంటే "నేను,నా౼ఏలుబడి" నుండి, దేవుని ఏలుబడికి మనల్ని మనం అప్పగించుకునేట్లు సిద్ధం చేస్తుంది. వాక్యంలోని దేవునితో వ్యక్తిగత సహవాసం చేస్తాము. ప్రతి పరిస్థితిలో క్రీస్తు మాదిరినే చూపడానికి ఇష్టపడ్తాము. దేవునికి, మనకు మధ్య ఉన్న (స్వచిత్తం అనే)తెర చినిగి, అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధిని దగ్గర నుండి అనుభవిస్తాము.దేవుని వాక్యంలో ఆయన స్వరాన్ని, పరిశుద్దాత్ముని నడిపింపుని గుర్తిస్తాము. వాక్యము జ్ఞానం కోసం కాక, అనుదినం క్రీస్తు స్వరూపాన్ని చూసి మనల్ని మనం సరిదిద్దుకొనే అద్దం వలె చూస్తాము. మనుష్యులను, మనకెదురయ్యె పరిస్థితులను దైవకోణంలో చూడటం మొదలౌతుంది. ప్రతి అనుభవంలో దేవుడు దాచివుంచిన పాఠాలను శ్రద్ధగా నేర్చుకొంటాము. పరిస్థితులన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయని గుర్తెరిగి ఆయనలో ఆనందించడం నేర్చుకొంటాము. అనుదినం "నేను" అనే స్వభావాన్ని క్రీస్తు-సిలువ కొయ్యకు కొట్టి, స్వచిత్తం విషయంలో చనిపోయిన వారిగా ఎంచుకొని, "ఇక నేను కాదు క్రీస్తే!" అని క్రీస్తులో సజీవులుగా ఎంచుకున్నప్పుడు జరిగే అనుభవాలు ఇవి.

౼కేవలం జ్ఞానమా! భావోద్రేకాల భక్తా!లేక క్రీస్తుతో పాటు మరణమా! దేన్ని ఇష్టపడున్నావు?ఎలాంటి భోధకు చెవి ఇస్తున్నావు?

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...