Skip to main content

26Oct2017

❇ యోసేపు మరణశయ్యపై ఉన్నప్పుడు తన సహోదరులతో ౼"నేను చనిపోబోతున్నాను, అయితే దేవుడు మిమ్ములను తప్పక దర్శించి, ఈ దేశం(ఐగుప్తు)నుంచి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన వాగ్ధాన దేశానికి తప్పక తీసుకువెళ్తాడు.
సహోదరులారా! నాకు ఒక ప్రమాణం చెయ్యండి. దేవుడు మిమ్మల్ని ఆ వాగ్ధాన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్లండి" అని అడిగాడు.

యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఐగుప్తులో మరణించాడు. వారు సుగంధ ద్రవ్యాలతో అతని మృతదేహాన్ని సిద్ధపరచి, ఐగుప్తులో ఒక శవపేటికలో ఉంచారు ❇


■ (ఇశ్రాయేలు జాతికి మూలపురుషుడైన) అబ్రాహాముతో దేవుడు ప్రమాణం చేసినట్లుగా, తప్పకుండా ఐగుప్తు దేశం నుండి దేవుడు తీసుకుని వెళ్తాడని యోసేపు దృఢంగా నమ్మాడు(ఆది 15:13,14). అతని విశ్వాసానికి గుర్తుగా తన ఎముకలను వాగ్దాన దేశంలో పూడ్చిపెట్టమని కోరాడు. జ్ఞానవంతుడైన యోసేపు ఒకప్పుడు భయంకరమైన కరువు నుండి ఐగుప్తు సామ్రాజ్యాన్ని రక్షించాడు.తర్వాత ఎన్నో తరాలు గడిచిపోయాయి.ఆ తర్వాత రోజుల్లో యోసేపు ఎవరో కూడా గుర్తుపట్టలేని రాజులు పరిపాలన చేశారు.యోసేపు విశ్వాసాన్ని దేవుడు తరాల వెంబడి తరాలకు చేరవేస్తూ, అతని ఎముకలను వాగ్దాన దేశం కోసం భద్రం చేశాడు. అతని విశ్వాసాన్ని సజీవమైనదిగా ఉంచాడు. అతని శవపేటికను చూసిన ప్రతి ఇశ్రాయేలు తరం విశ్వాసంతో, తమ దేవుని వాగ్దానాల నెరవేర్పును గూర్చిన ఎదురుచూపుతో ప్రోత్సహించబడ్డారు. యోసేపు చనిపోయినా అతని విశ్వాసం సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది.

■ మరి నేడు మన విశ్వాసం ఏమిటి?
పౌలు౼"సోదరులారా! ఆర్భాటముతోనూ, ప్రధానదూత చేసే గొప్ప శబ్దంతో, దేవుని బాకా ధ్వనితో ప్రభువు పరలోకం నుండి దిగి వస్తాడు. క్రీస్తులో విశ్వాసముంచి చనిపోయిన వారు మొదటగా లేస్తారు.
ఆ తర్వాత బ్రతికి ఉండే మనల్ని వారితో కూడా ఆకాశమండలం లో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపైన తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మనం నిత్యం ప్రభువుతో కూడా ఉంటాము" (1థెస్స 4:16,17).

■ చనిపోయిన తర్వాత మన శరీరాలు మట్టిలో కలిసిపోవచ్చు!కానీ లేఖనాలు చెప్తున్న గొప్ప నిరీక్షణ౼"క్రీస్తు రెండవ సారి ఈ లోకానికి వస్తాడు. అప్పుడు మనం తిరిగి మహిమా శరీరాలతో లేపబడతాము. దేవునితో నిత్య సహవాసానికి సిద్ధపడే (పాపం ఏలుబడిలేని) శరీరాలను పొందుతాము" అని దేవుని వాగ్ధానం! క్రీస్తు మొట్టమొదటగా, మనకు ముందుగా ఈ విధంగానే దేవునిచేత లేపబడ్డాడు. గనుక 'క్రీస్తులో విశ్వసించిన వారందరిని క్రీస్తు వంటి శరీరాలతో, పవిత్రమైన ఆత్మలతో మనం తిరిగి లేపబడతాము' అనే మాటకు ఆధారాన్ని దేవుడు ఇచ్చాడు!ఈ గొప్ప నిరీక్షణతో యోసేపు వంటి సజీవమైన విశ్వాసంతో నేడు మనం జీవించాలి. అలాంటి విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తాడు. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనివ్వదు. ఖచ్చితంగా దేవుడు తిరిగి లేపుతాడు.
◆ యోసేపు వలె నీ మరణ పడక మీద విశ్వాసంతో ఈ నిరీక్షణ గూర్చి నిలిచి ఉన్న వారితో దైర్యంగా చెప్పగలవా?యోసేపు ఆ గొప్ప విశ్వాసానికి తగినట్లుగా భూమిపై జీవించాడు. కనుకనే అలా చెప్పగలిగాడు. భూసంబంధివి కాక, నీ విశ్వాసం సజీవమైనదిగా, నీ తర్వాత తరాలకు మాదిరిగా ఉండనివ్వు!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...