Skip to main content

25Oct2017


❇ ఆ రాత్రిలోనే దేవుడు గిద్యోనుతో౼"మీ తండ్రికున్న ఎద్దులల్లో ఏడేళ్ళ వయస్సున్న ఎద్దును తీసుకో! మీ తండ్రి బయలు దేవుడికి కట్టిన బలిపీఠాన్ని పడగొట్టు! దాని ప్రక్కన ఉన్న అషేరాదేవి స్తంభాన్ని నరికివెయ్యి! అప్పుడు ఈ బండమీద చక్కగా పేర్చి నీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టు. ఆ ఎద్దును తీసుకువచ్చి, హోమబలిగా అర్పించు! నీవు నరికివేసిన అషేరాదేవి స్తంభం చెక్కను కట్టెలుగా వాడుకో!"

గిద్యోను తన పనివాళ్ళలో పదిమందిని తీసుకువెళ్ళి, యెహోవా తనకు చెప్పినట్టే చేశాడు. ఐతే అతడు తన కుటుంబం వారికీ, ఆ ఊరివాళ్ళకూ భయపడి పగలు చెయ్యకలేక రాత్రి వేళ అలా చేశాడు.
ప్రొద్దున ఊరివాళ్ళు లేచేసరికి బయలు దేవుడి బలిపీఠం ముక్కలైవుంది! దాని ప్రక్కగా ఉన్న అషేరాదేవి స్తంభం నరికివేసివుంది! క్రొత్తగా కట్టిన బలిపీఠం ఒకటి ఉంది! దానిమీద ఎద్దు బలిగా అర్పించబడివుంది! ఆ ఊరి వారు గిద్యోను చేశాడని తెల్సుకొని, అతణ్ణి చంపాలనుకున్నారు. ❇


■ ఇశ్రాయేలీయులు సజీవుడైన దేవుణ్ణి విడిచి, విగ్రహారాధన వైపు తిరిగి, దేవునికి బహు దుఃఖాన్ని కలుగజేశారు. కనుక ఆయన వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. వారు ఇశ్రాయేలీయుల్ని దోచుకొని, విపరీతంగా వారిని భాధిస్తున్న రోజులవి. గిద్యోను యదార్ధవంతుడు.గిద్యోను స్వతహాగా భయస్తుడు.కానీ అతని తండ్రి చేస్తున్న విగ్రహారాధన అంగీకరించక, ఇలాంటి పరిస్థితులను దేవుడు ఎందుకు పంపాడో అర్ధంకాక సతమతమౌతున్న ఒక సామాన్యుడు. అతని మదిలో సమాధానంలేని ఎన్నో ప్రశ్నలు.అలా ఉన్నప్పుడు ఒక రోజు..

■ దేవుడు అతణ్ణి పిలిచి, ఆ ప్రజలను విడిపించే రక్షకుడిగా నియమించాడు. వెంటనే ఆయన చేయమన్న పని ఏంటో తెలుసా? తన తండ్రి ఇంటికీ, ఆ ఊరి వారికి విరోధంగా పైన చెప్పినట్లు చేయమని చెప్పాడు.అప్పటి వరకు అతను ఇలాంటి పనులేన్నడూ చెయ్యలేదు. దేవుడు మొదట ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ఈ లోకం నుండి,లోక సంభంధుల(విధానాల) నుండి ప్రత్యేకపరుస్తాడు. ఇది ఆదిలో నుండి ఆయన విధానం.
"అబ్రాహామును తన తండ్రి ఇంటి నుండి, యోసేపును అన్నల నుండి, మోషే ఫరో కోటనుండి..యాకోబు, యోహానులు తమ తండ్రియైన జెబదేయ నుండి.." etc. వెలుగు నుండి చీకటిని వేరు చెయ్యటం సృష్టారాభం నుండే దేవుడు తలపెట్టిన కార్యం.

■ యేసు"౼నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను. భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చానని అనుకొంటున్నారా? శాంతి కాదు! దానికి బదులుగా చీలిక కలిగించడానికి వచ్చానని మీతో చెపుతున్నాను. ఇప్పట్నుంచి ఒకే ఇంట్లో అయిదుగురు ఉంటే, విభేదం కలిగి ముగ్గురు ఇద్దరికి ప్రతికూలంగా, ఇద్దరు ముగ్గురికి ప్రతికూలంగా ఉంటారు"(లూకా 12:49-53).

దేవుడు సమాధానానికే కాదు, అగ్ని కూడా కారకుడని వాక్యం సెలవిస్తుంది.అంటే అందరూ ఒకరి నుండి ఒకరు వేరై విరోధుల్లా ఉండాలనా? కాదు! సత్యం విషయంలో బంధుత్వాలను సైతం లెక్కచేయకుండా దేవుణ్ణి హత్తుకోవాలని దానార్ధం! 'మొదటి స్థానం దేవునిదే' అని దేవుని పక్షాన నిలవటం.అలా నిలిచిన వారే దేవుని వారౌతారు. అలాంటి వారిని గూర్చి క్రీస్తు ఒకరోజు తన తండ్రి ముందు,దేవదూతలు ముందు సాక్ష్యంపలుకుతాడు.

(దేవునిలో మనకు నచ్చిన కొన్ని లక్షణాలను తీసుకుని, మిగితా వాటిని నిర్లక్యం చేస్తే,ఆయన వాక్యంలో క్రీస్తు అవ్వడు, గానీ మన స్వంత ఆలోచనల్లో క్రీస్తు అవుతాడు. దేవుడు ఎల్లప్పుడూ క్షమాపనే కాదు శిక్షించే తండ్రి కూడా! ప్రేమ మాత్రమే కాడు, న్యాయాధిపతి కూడా!దీర్ఘశాంతమే కాదు ఆయనలో ఉగ్రత కూడా ఉంది)

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...