❇ దేవుడు అబ్రాహామును పరీక్షించాలనుకొన్నాడు.
దేవుడు అబ్రాహాముతో౼"నీకున్న ఒకే కొడుకును, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొని మోరీయా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతణ్ణి దహనబలిగా నాకు అర్పించు!" అన్నాడు....
అబ్రాహాము ఉదయాన్నే లేచి దేవుడు తనకు వెళ్లమని చెప్పిన చోటుకి కుమారునితో వెళ్లాడు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును కట్టివేసాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు. దేవునికి బలిగా అర్పించడానికి తన చెయ్యి చాపి ఖడ్గం పైకెత్తి సిద్ధమయ్యాడు..
అప్పుడు దేవునిదూత ఆకాశం నుండి౼"అతణ్ణేమీ చేయకు. దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలుస్తుంది. నా కోసం నీ కొడుకును బలిగా అర్పించడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకున్న ఏకైక కుమారుడు. అతణ్ణి సైతం నాకివ్వడానికి వెనక్కు తీయలేదు కనుక నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను...."(ఆది 22) ❇
■ అబ్రాహాము అప్పటికే ధనాన్ని తుచ్ఛమైనది ఎంచి, దేవుని మాటను ఘనపర్చాడు. కానీ ఈ సంఘటనతో దేవుణ్ని పరిపూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడని రుజువు చేసుకున్నాడు. తన ముసలితనంలో పుట్టిన, తాను ఎంతో ప్రేమించిన ఏకైక కుమారుడ్ని దేవునికి అర్పించడానికి సిద్ధపడినప్పుడు..ఇక దేవునికి ఇవ్వకుండా తన దగ్గర దాచుకునేది ఏమి లేదని స్పష్టం చేస్తున్నాడు.ఏకైక కుమారుడ్ని సైతం చంపుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే దేవునికి తన హృదయంలో ఎలాంటి స్థానం ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు!
■ ఇంతకీ దేవుడు ఇస్సాకును బలిగా కోరలేదు..మరి ఈ విధంగా ఎందుకు జరిగించునట్లు? దేవుడు తన ప్రేమను మనుష్యులకు చెప్పాలనుకుంటున్నాడు. తన ఏకైక కుమారుడైన యేసును బలిగా సిలువలో వధించడం ద్వారా లోకాన్ని ఎంత పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. అబ్రాహాము లాగా దేవుడు తన ఏకైక కుమారుడ్ని(యేసును సిలువలో) విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడంటే, మన విలువ ఆయన హృదయంలో ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు!మనకు ఆ అర్హత ఉందని కాదు..ఆయన ప్రేమ గొప్పది. అబ్రాహాము దేవుని కోసం ఎందుకు వదులుకున్నాడంటే ఒక కారణం ఉంటుంది..దేవుడు అందుకు అర్హుడు. ఏ అర్హత లేని నన్ను/నిన్ను దేవుడు క్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. (అబ్రాహాము-దేవుని కోసం ఇస్సాకును వదులుకున్నాడు,మరి దేవుడు-మన కోసం క్రీస్తును విడిచిపెట్టాడు గనుక )ఆయన హృదయంలో మొదటి స్థానం మనకివ్వడానికి ఇష్టపడ్తున్నాడని గ్రహించవచ్చు!కొన్ని వేల యుగాలుగా ఆయన్ను ఆరాధించే కోటానుకోట్ల నమ్మకస్తులైన దేవదూతలు, ఆయన చేతి పనియైన విలువైన సృష్టి ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ, ఆయన రూపంలో చేయబడ్డ కుమారులమైన మన సహవాసంలో(స్నేహంలో) దేవుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడని లేఖనాలు చెప్తున్నాయి (లూకా 15:7).ఇది నిత్యుడైన పరమ తండ్రి ప్రేమ! పరిపూర్ణ ప్రేమ!
■ పరిపూర్ణమైన ప్రేమ ఏమి తన కోసం దాచుకోదు. దేవుడు మన కోసం ఏమి దాచుకోక సమస్తం కంటే మనల్ని ముందు పెట్టుకున్నట్లే, మానవుడు కూడా దేవుణ్ని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తేనే అతని జన్మ సార్ధకం అవుతుంది.ఎందుకంటే మానవుడు దేవుని పొలికలో ఉన్నాడు. అలా మనం ప్రేమించనప్పుడు అది శూన్యతకు దారి తీస్తుంది. కనుకనే అన్ని ఉన్నా ఏదో వెలితి మనుష్యులు హృదయాన్ని ఆవరిస్తుంది. దేవుడు అతని జీవితంలోకి వచ్చినప్పుడే పరిపూర్ణమైన, ఆనందమైన, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలడు.అది ఎలాగో యేసయ్య జీవితం మనకు నేర్పిస్తుంది. ఆ జీవితానికి దేవుని ఆత్మ మనకు సహాయకుడు. ఈ జీవిత అనుభవంలోకి నడిపించమని దేవుణ్ని అడుగు!నిన్ను ప్రేమిస్తున్న ఆ దేవుడు, నిజంగా నీ ప్రార్ధన వింటాడు.
దేవుడు అబ్రాహాముతో౼"నీకున్న ఒకే కొడుకును, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొని మోరీయా ప్రదేశానికి వెళ్ళు. అక్కడ నేను నీకు చెప్పబోయే పర్వతం మీద అతణ్ణి దహనబలిగా నాకు అర్పించు!" అన్నాడు....
అబ్రాహాము ఉదయాన్నే లేచి దేవుడు తనకు వెళ్లమని చెప్పిన చోటుకి కుమారునితో వెళ్లాడు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును కట్టివేసాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు. దేవునికి బలిగా అర్పించడానికి తన చెయ్యి చాపి ఖడ్గం పైకెత్తి సిద్ధమయ్యాడు..
అప్పుడు దేవునిదూత ఆకాశం నుండి౼"అతణ్ణేమీ చేయకు. దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయని ఇప్పుడు నాకు తెలుస్తుంది. నా కోసం నీ కొడుకును బలిగా అర్పించడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకున్న ఏకైక కుమారుడు. అతణ్ణి సైతం నాకివ్వడానికి వెనక్కు తీయలేదు కనుక నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను...."(ఆది 22) ❇
■ అబ్రాహాము అప్పటికే ధనాన్ని తుచ్ఛమైనది ఎంచి, దేవుని మాటను ఘనపర్చాడు. కానీ ఈ సంఘటనతో దేవుణ్ని పరిపూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడని రుజువు చేసుకున్నాడు. తన ముసలితనంలో పుట్టిన, తాను ఎంతో ప్రేమించిన ఏకైక కుమారుడ్ని దేవునికి అర్పించడానికి సిద్ధపడినప్పుడు..ఇక దేవునికి ఇవ్వకుండా తన దగ్గర దాచుకునేది ఏమి లేదని స్పష్టం చేస్తున్నాడు.ఏకైక కుమారుడ్ని సైతం చంపుకోవడానికి ఇష్టపడుతున్నాడంటే దేవునికి తన హృదయంలో ఎలాంటి స్థానం ఇచ్చాడో అర్ధం చేసుకోవచ్చు!
■ ఇంతకీ దేవుడు ఇస్సాకును బలిగా కోరలేదు..మరి ఈ విధంగా ఎందుకు జరిగించునట్లు? దేవుడు తన ప్రేమను మనుష్యులకు చెప్పాలనుకుంటున్నాడు. తన ఏకైక కుమారుడైన యేసును బలిగా సిలువలో వధించడం ద్వారా లోకాన్ని ఎంత పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. అబ్రాహాము లాగా దేవుడు తన ఏకైక కుమారుడ్ని(యేసును సిలువలో) విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడంటే, మన విలువ ఆయన హృదయంలో ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు!మనకు ఆ అర్హత ఉందని కాదు..ఆయన ప్రేమ గొప్పది. అబ్రాహాము దేవుని కోసం ఎందుకు వదులుకున్నాడంటే ఒక కారణం ఉంటుంది..దేవుడు అందుకు అర్హుడు. ఏ అర్హత లేని నన్ను/నిన్ను దేవుడు క్రీస్తుతో సమానంగా ప్రేమిస్తున్నాడు. (అబ్రాహాము-దేవుని కోసం ఇస్సాకును వదులుకున్నాడు,మరి దేవుడు-మన కోసం క్రీస్తును విడిచిపెట్టాడు గనుక )ఆయన హృదయంలో మొదటి స్థానం మనకివ్వడానికి ఇష్టపడ్తున్నాడని గ్రహించవచ్చు!కొన్ని వేల యుగాలుగా ఆయన్ను ఆరాధించే కోటానుకోట్ల నమ్మకస్తులైన దేవదూతలు, ఆయన చేతి పనియైన విలువైన సృష్టి ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ, ఆయన రూపంలో చేయబడ్డ కుమారులమైన మన సహవాసంలో(స్నేహంలో) దేవుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడని లేఖనాలు చెప్తున్నాయి (లూకా 15:7).ఇది నిత్యుడైన పరమ తండ్రి ప్రేమ! పరిపూర్ణ ప్రేమ!
■ పరిపూర్ణమైన ప్రేమ ఏమి తన కోసం దాచుకోదు. దేవుడు మన కోసం ఏమి దాచుకోక సమస్తం కంటే మనల్ని ముందు పెట్టుకున్నట్లే, మానవుడు కూడా దేవుణ్ని పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తేనే అతని జన్మ సార్ధకం అవుతుంది.ఎందుకంటే మానవుడు దేవుని పొలికలో ఉన్నాడు. అలా మనం ప్రేమించనప్పుడు అది శూన్యతకు దారి తీస్తుంది. కనుకనే అన్ని ఉన్నా ఏదో వెలితి మనుష్యులు హృదయాన్ని ఆవరిస్తుంది. దేవుడు అతని జీవితంలోకి వచ్చినప్పుడే పరిపూర్ణమైన, ఆనందమైన, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలడు.అది ఎలాగో యేసయ్య జీవితం మనకు నేర్పిస్తుంది. ఆ జీవితానికి దేవుని ఆత్మ మనకు సహాయకుడు. ఈ జీవిత అనుభవంలోకి నడిపించమని దేవుణ్ని అడుగు!నిన్ను ప్రేమిస్తున్న ఆ దేవుడు, నిజంగా నీ ప్రార్ధన వింటాడు.
Comments
Post a Comment