Skip to main content

11Oct2017

❇ "దేవుని మీద విశ్వాసం వల్లే మోషే, పెద్దవాడయిన తరువాత ఐగుప్తు చక్రవర్తి కూతురి కుమారుడని అనిపించుకోవడానికి నిరాకరించాడు. అల్పకాలం పాపంలోని సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికే అతడు కోరుకొన్నాడు"
"తన ద్వారానే ఇశ్రాయేలీయులను దేవుడు విడిపిస్తాడనే విషయం తన బానిస సోదరులు గ్రహిస్తారని, మోషే అనుకొన్నాడు. కానీ వారు గ్రహించలేదు. వారి నిమిత్తమే మోషే ఒక ఐగుప్తుయుని హత్య చేశాడు. ఆ విషయం బయటపడినందుకు మోషే మిద్యానుకు పారిపోయాడు" ❇
■ ఐగుప్తు రాజకుమారుడుగా పెరిగిన మోషే, దేవుని మీద విశ్వాసంతో ఎవ్వరూ చేయ్యలేని త్యాగాన్ని చేశాడు. అంతఃపురాన్ని, విలాసవంతమైన సుఖసౌఖ్యాలు వదిలి, బానిసల్లో ఒకనిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. కానీ బానిసలైన అతని స్వంత ప్రజలే అతన్ని తిరస్కరించారు. అతని విశ్వాసం, త్యాగపూరితమైన నిర్ణయం.. అతణ్ణి దేవుని పనికి సమర్థునిగా చెయ్యలేకపోయింది. అవమాన భారంతో,చివరికి చేదైన అనుభవాలతో కృంగిపోయి, అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు.
■ ఒకవేళ ఆ సమయంలో ఎన్నో ప్రశ్నలు మోషేలో మదిలో మెదిలి ఉండొచ్చు.
"వీరి కోసం ఎంత చేసినా గుర్తించని కఠినమైన ప్రజలు వీళ్ళు! వీరికి దేవుడు విధించిన శిక్ష సరైనదే! ఐనా దేవుడు నన్నెందుకు అంతఃపురంలో పెంచాడు? నా ద్వారా దేవుడు విడిపిస్తాడని ఇన్ని రోజులు వ్యర్ధంగానే నమ్మానా! నా తొందరపాటు వల్లే ఇదంతా జరిగింది. నా గురించి నేను అతిగా ఉహించుకొన్నానేమో!"
అతని విఫలయత్నం అతన్ని తీవ్రంగా కలచివేసింది.ఇక ఎన్నడూ తిరిగి ఇలాంటి సహసాన్ని చేయకూడదని తీర్మానించు కొన్నాడు.
■ విశ్వాసం, త్యాగపూరితమైన జీవితంతో దేవుని నిమిత్తం ముందుకు వెళ్లిన మెషేను, మరి దేవుడేందుకు వాడుకోలేదు? ఇవి మాత్రమే సరిపోవు గానీ మోషే నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా ఉన్నాయి. మోషే ఆ ప్రజలకు నాయకుడిగా ఉండడం దేవుని అనాధికాల ప్రణాళికే ఐనా, అతను దేవుని విధానంలోనే ఆ పని కొనసాగించాలి.కనుకనే అతని సొంత సామర్ధ్యాలను ఖాళీ చేయడానికి, విరగొట్టబడే అనుభవం అవసరమయ్యింది. ఒక మనిషి జీవితంలో దేవుని ప్రణాళికల నెరవేర్పుకు, అతను సంపూర్ణంగా దేవునిపై ఆధారపడే మనస్సును కలిగి ఉండాలి. అప్పుడు ఏ పరిస్థితికైనా కృంగిపోడు. మోషే జీవితంలో ఆ 40సం|| మౌన సమయంగా ఉండిపోయింది. దానార్ధం దేవుడు వదిలేశాడా?లేదు..ఆయన,అతని జీవితంపై పని చేస్తున్నాడు!మిద్యానులో ఉన్న మోషేను దేవుడు మళ్ళీ దర్శించాడు.దేవుడు తన శక్తితో నింపి, గొప్ప నాయకునిగా చేశాడు.
■ స్నేహితుడా! దేవుని కోసం ఎంతో నిలబడి, కృంగిపోయిన మోషే లాంటి అనుభవాల్లో నీవు ఉన్నావా?ఐతే నీతో మాట్లాడనివ్వు! అందరి కంటే ఉన్నతంగా ఆలోచించిన నీ హృదయాన్ని దేవుడు చూశాడు. నీ విశ్వాసం, త్యాగపూరిత నిర్ణయాలను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు.ఆయన నీపై ఆలోచన నిలిపాడు.ఈ మౌన సమయంలో కూడా నీపై ఆయన పని జరుగుతూనే ఉంది.ప్రస్తుతం ఎండిన ఎముకలావున్న నీ జీవితంపై జీవాత్మ (పరిశుద్ధాత్ముడు) తిరిగి జీవాన్ని కుమ్మరించగలడు. తిరిగి నీ పాదాలు మోపి నిలవబడు! చిన్న బిడ్డ వలె సంపూర్ణంగా దేవునిపై ఆనుకో!ప్రతి చిన్న విషయం దేవునితో చర్చించు! దైవశక్తిని నీ శక్తిగా చేసుకో! నీవేమి నేర్చుకోవాలో అడుగు! ఆలోచించు! కృంగిపోవాల్సిన అవసరం లేదు.మనుషుల వైపు చూడొద్దు!దేవుని ఆత్మ కలిగిన అతి కొద్దిమందే నిన్ను అర్ధం చేసుకుని, ప్రోత్సహించగలరు. దేవుని సంభంధులు ఇలాంటి అనుభవాల గుండా వెళ్లడం కొత్త ఏమీ కాదు! గొప్ప పరిచర్యను దేవుడు అప్పగించడానికి/నమ్మకత్వానికి ముందు ఇలాంటి అనుభవాలను దేవుడు వాడుకుంటాడు. నిన్ను గురించి ఆయనకున్న ఆలోచనలు ఏ ఒక్కటీ తప్పిపోలేదు. నేను సత్యమే చెప్తున్నాను!
★ ఇది నీవేలా చెప్పగలవని నీవు నన్నడుగుతావా?నీ తోటి సహాఅనుభవం గల, నీ సహోదరుణ్ణి. అనేకసార్లు విరగొట్టబడ్డాను. ఇంకా ఆ పని నాలో జరుగుతూనేవుంది. జరిగిన ప్రతిసారి దేవునిపై ఆధారపడే బలమైన కోటగా దేవుడు తయారు చేస్తున్నాడు. కాబట్టే నిన్ను అర్ధం చేసుకోగలను!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...