Skip to main content

10Oct2017

❇  "మీరు పాపం విషయంలో చనిపోయారనీ, దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తు యేసులో సజీవులనీ మిమ్ములను మీరే ఎంచుకోండి" (రోమా 6:11)

"మరణించిన యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ (పరిశుద్ధాత్ముడు) మీలో నివసిస్తున్నట్లైతే, చనిపోయిన వారిలో నుంచి క్రీస్తును లేపిన దేవుడే, చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా, మీలో నివాసముంటున్న ఆయన ఆత్మ ద్వారానే బ్రతికిస్తాడు" (రోమా 8:11) ❇


✔ మన పాపం వల్ల దేవునితో ఎడబాటు(ఆత్మలో చచ్చిన స్థితి)౼ రక్షకుడైన యేసులో విశ్వాసం వల్ల దేవుని ఉగ్రత నుండి రక్షణ గూర్చి నిన్నటి ధ్యానంలో తెల్సుకున్నాము.
"ఒకప్పుడు పాపంలో స్వేచ్ఛగా జీవించి, దేవునితో సంభంధం విషయంలో చచ్చిన మనం, నేడు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో జీవం గలిగిన వారిగా ఎంచుకోమని" బైబిల్ బోధిస్తుంది.

✔ అంటే "యేసు సిలువలో నా పాపం నిమిత్తం చనిపోయాడు, నా పాపంపై సంపూర్ణ విజయంతో తిరిగి లేచాడు" అని నమ్మిన మనం,అదే విశ్వాసాన్ని మన జీవితంలో కూడా రుజువు చెయ్యాల్సివుంది. క్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు నీ పాపాన్ని తనపై వేసుకొని, నీ స్థానంలో చనిపోయ్యాడు అని నమ్ముతున్నావు కదా! ఇప్పుడు రక్షణ పొందిన నిన్ను నీ పాపాల విషయంలో చనిపోయిన వాడిగా ఎంచుకోమని దేవుడు ఆదేశిస్తున్నాడు. ఇకపై నీకు నీ పాత స్వభావంలో జరిగించిన (నిన్ను ఏలిన) పాపాలకు ఎలాంటి సంబంధం లేదు, కనుక ఇకను నువ్వు పాపానికి దాసుడవు కావు గానీ, క్రీస్తు యేసుకే దాసుడవు. నిన్ను నీవు పాపం విషయంలో చనిపోయిన వాడిగా ఎంచుకునట్లైతే, మరణించిన వాడు లోకం నుండి వేరు పడిన వాడు గనుక ఇకను లోక సంభంధిలా బ్రతకకూడదు.శరీర దురాశల కోర్కెల విషయంలో చనిపోవాలి. సాతాను ఇదివరకు మనం ప్రేమించిన పాపాలతో ప్రేరేపిస్తాడు.కానీ చనిపోయిన వాడిలో ఏ దురాశ కోరిక ఉండదని మనకు తెల్సు. ఇంకా మనలో బ్రతికి ఉన్న పాపాల విషయమై క్రీస్తు కృపా సింహాసనాన్ని సమీపిస్తూ ఉండాలి. ఇది క్రీస్తుతో పాటు సిలువ వేయబడటం.క్రీస్తును వెంబడించడం. అనుదినం మన సిలువను మోస్తూ, లోకానికి వేరుగా, కల్వరి దారిలో ప్రయాణం చెయ్యడం. ఈ మార్గంలో అందరికంటే ఉన్నతంగా దేవుని మాటకే ప్రధమ స్థానం ఉంటుంది. "నేను" అనే వాడు సిలువ వేయబడుతూ, క్రీస్తే మనలో పరిపాలన చేయడం

✔ ఐతే ఇది నీకు నువ్వు స్వతహాగా జీవించడం అసాధ్యం. మానవుడు కాలినడకన చేరుకోలేని దూరాన్ని ప్రయాణ సాధనాల ద్వారా వేగంగా చేరుకోగలడు. అతని శక్తికి, సాధ్యం కానిది జరిగించడానికి బయటి నుండి కొంత శక్తి అవసరమౌతుంది. అలాగే స్వంత శక్తితో సాధ్య పడని ఈ భూమిపై పరలోక జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది.చనిపోయిన యేసును, దేవుని మహిమ ద్వారా, పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా లేపబడ్డాడని లేఖనం చెప్తుంది.క్రీస్తు మరణంలో ఐక్యత కలిగిన మనం, ఆయన పునరుద్ధణంలో ఐక్యతనూ పొందాలి. అంటే దేవుని(ఆత్మ) శక్తి ద్వారానే ఈ క్రొత్త జీవితం సాధ్యం. మనం చనిపోయిన వారిగా ఎంచుకోవడం ఎంత అవసరమో, అనుదినం దేవుని శక్తితో నింపబడటం కూడా అంతే అవసరం.దేవుని శక్తి లేకుండా దేవుని పని మనపై జరగటం అసాద్యం.(ఈ అనుభవంను నిర్లక్ష్యం చేసి చాలా మంది క్రైస్తవులు చల్లారిపోయ్యారు.మన సొంత శక్తితో ప్రయత్నిస్తే మహా ఐతే జీవం లేని(జీవితంగా మారని) వాక్య జ్ఞానాన్ని మాత్రమే సాధిస్తాము. వాక్యన్ని వివరించ వచ్చు గాని ఆత్మీయ జీవితాలకు సహాయకులగా ఉండలేము).
✔ ఒకప్పుడు పాపానికి బానిసలుగా ఉన్న మనం, నేడు నీతికి దాసులుగా మనల్ని మనం అప్పగించుకోవాలి. వాక్యనికి లోబడటం ధ్యానించడం, ఆత్మ ద్వారా దేవునితో సహవాసం చెయ్యడం ద్వారా, క్రీస్తులో అనుదినం ఆసక్తితో నిలిచివుండాలి. ఫలితంగా దేవుని లక్షణాలు మనలో పెంపారతాయి. పాత స్వభావం మనలో పోయి, దేవుని సంబంధియైన క్రొత్త స్వభావం కనబడుతుంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...