❇ పేతురు పెంతుకోస్తూ దినాన నిలువబడి౼"ఇశ్రాయేలు ప్రజలారా! ఈ మాటలు వినండి..దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకూ తెలుసు!..ఈయన్ని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు. మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనల నుంచి ఆయన్ను విడిపించి సజీవంగా లేపాడు"
ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయి ౼"సోదరులారా, మేమేం చేయ్యాలి?"అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు.
దానికి పేతురు౼"మీరు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం ప్రతివాడూ యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం పొందండి".
ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో వారికి సాక్ష్యమిచ్చి"మీరు యీ దుష్టతరం నుండి వేరుపడి రక్షణ పొందండి" అని వారిని హెచ్చరించాడు. ❇
✔ ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే వారు యేసును సిలువకు అప్పగించి మహా పాపానికి ఒడిగట్టారు. నిజానికి యేసును ప్రధాన యాజకులు, మత పెద్దలే కుట్రపన్ని చంపినా..పరోక్షంగా ప్రజలు దానికి సమ్మతి పలికారు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైన సమ్మతించిన పాపం పాపమేనని ఈ మాటల ద్వారా గ్రహించవచ్చు. ఐతే దేవుడు ఆ ప్రజలను ప్రేమించి,వారిని వెలిగించి, వారున్న అపాయకరమైన స్థితి నుండి బయటికి తీసుకొని రావాలనే దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుని మనస్సు! ప్రసంగికుని సంపూర్ణ మనస్సు ఇదే అయ్యివుండాలి.(to HELP the people to get rid from sins&prejudices)
క్రీస్తు యొక్క సిలువ బలియాగానికి అర్ధం అదే కదా!
✔ పాపం గూర్చి మాట్లాడకుండా రక్షకుని యొక్క అవసరాన్ని భోధించలేవు. కనుక పాపం దాని యొక్క తీవ్రతను గూర్చి మాట్లాడవల్సిందే! పాపం, నరకం గూర్చి యేసుక్రీస్తు మాట్లాడినంత తీవ్రంగా మరెవ్వరూ మాట్లాడలేదు. ఆయన కంటే ప్రేమామయులుగా నటించొద్దు. ఐతే అది అక్కడే ఆగి పోనివ్వవొద్దు! రోగం ఏంటో చెప్పి, మందు ఇవ్వని(చికిత్స చేయని) డాక్టర్ వలె ఉంటుంది. ఐతే వారు ఏవిధంగా క్షమించబడగలరో, విడుదల పొందగలరో చెప్పి వారిని అమితంగా ప్రేమించి, వారి కోసం ప్రాణం పెట్టిన వారి దేవునికి అనుసంధానం చెయ్యాల్సివుంది(వ్యక్తిగతంగా వారు దేవుణ్ని సొంతం చేసుకొననివ్వండి). నీవు ప్రసంగిస్తున్న ప్రజలను దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడని మొదట గుర్తించు. అప్పుడు దేవుని మనస్సుతో భోధిస్తావు. మొదట వ్యర్ధ అతిశయాల నుండి నిన్ను నీవు శూన్యం చేసుకో! ఆయన ఆత్మ చేత నింపమని ప్రార్ధించు. అప్పుడు ఆయన నిన్ను తన ఆధీనంలోకి తీసుకుంటాడు.నీ ప్రమేయం లేకుండానే మాటల సరళి, క్రమం, ఆలోచనలు నీలో నుండి రావడం గమనిస్తావు. ఆ (దేవుని) మాటలు ఎదుటి వారిని తాకుతాయి. జీవితాలను మార్చుతాయి. ఎందుకంటే అవి దేవుని ఆత్మ చేత పలుకబడిన మాటలు. ప్రసంగం తర్వాత ఎవ్వరైనా నిన్ను పొగిడినా నీకు అతిశయం కలుగదు..ఎందుకంటే నీకు బాగా తెల్సు! అవి నీ మాటలు కావని. ఇలా దేవునికి మహిమ వెళ్తుంది.
✔ మనుషులు వారి ఎదుటి వారిలో తప్పులను ఎరడం పుట్టుకతోనే వచ్చిన విద్య. క్రైస్తవుల్లో కూడా లోతైన విశ్లేషణ చేసే విశ్లేషకులూ ఉన్నారు. ఐతే ఆ వారు విమర్శించిన/విశ్లేషించిన ఆ సమస్యకు వాక్యానుసారమైన సమాధానం ఇవ్వకపోతే అది సద్విమర్శ(మంచి బోధ) కాదు. అంతే కాదు అంతరంగంలో ప్రేమ లేకుండా(వారు ఆ తప్పు నుండి బయటకు తీసుకురావాలనే మనస్సు లేనితనంతో) ఎదుటి వారిని సరిదిద్దే ప్రయత్నం కూడా సద్విమర్శ కాదు! అంతకంటే నీవు మౌనంగా ఉండటం నీకు మేలు. కనుక మొదట మనల్ని మనం పరిశీలించుకోవాలి. నీ మనస్సాక్షిని దేవుని యెదుట శుభ్రంగా ఉంచుకున్నప్పుడు దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడటం చూస్తావు. నీవు వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే నీ ఆత్మలో నీకు తెలిసిపోతుంది. (నేను చెప్తున్న ఈ మాటలు దేవునితో నడుస్తున్న వారికి అర్ధమౌతాయి. ఒకవేళ నీకు అనుభవం లేనట్లేతే ఆసక్తితో దేవుణ్ని అడుగు! ఆయన నేర్పుతాడు)
కొన్నిసార్లు కఠినమైన మాటలో ప్రేమ ఉండొచ్చు, మెత్తటి మాటలో నీ ఆత్మకు కీడూ జరగొచ్చు. కాబట్టి మనస్సును చూడాలి. ఆత్మను వివేచించాలి. క్రీస్తు మాటలను/ప్రవర్తనను నిశితంగా పరిశీలన చేస్తే ఈ విషయాలు గమనించగలము.
ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయి ౼"సోదరులారా, మేమేం చేయ్యాలి?"అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు.
దానికి పేతురు౼"మీరు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం ప్రతివాడూ యేసుక్రీస్తు పేరున బాప్తిస్మం పొందండి".
ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో వారికి సాక్ష్యమిచ్చి"మీరు యీ దుష్టతరం నుండి వేరుపడి రక్షణ పొందండి" అని వారిని హెచ్చరించాడు. ❇
✔ ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే వారు యేసును సిలువకు అప్పగించి మహా పాపానికి ఒడిగట్టారు. నిజానికి యేసును ప్రధాన యాజకులు, మత పెద్దలే కుట్రపన్ని చంపినా..పరోక్షంగా ప్రజలు దానికి సమ్మతి పలికారు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైన సమ్మతించిన పాపం పాపమేనని ఈ మాటల ద్వారా గ్రహించవచ్చు. ఐతే దేవుడు ఆ ప్రజలను ప్రేమించి,వారిని వెలిగించి, వారున్న అపాయకరమైన స్థితి నుండి బయటికి తీసుకొని రావాలనే దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుని మనస్సు! ప్రసంగికుని సంపూర్ణ మనస్సు ఇదే అయ్యివుండాలి.(to HELP the people to get rid from sins&prejudices)
క్రీస్తు యొక్క సిలువ బలియాగానికి అర్ధం అదే కదా!
✔ పాపం గూర్చి మాట్లాడకుండా రక్షకుని యొక్క అవసరాన్ని భోధించలేవు. కనుక పాపం దాని యొక్క తీవ్రతను గూర్చి మాట్లాడవల్సిందే! పాపం, నరకం గూర్చి యేసుక్రీస్తు మాట్లాడినంత తీవ్రంగా మరెవ్వరూ మాట్లాడలేదు. ఆయన కంటే ప్రేమామయులుగా నటించొద్దు. ఐతే అది అక్కడే ఆగి పోనివ్వవొద్దు! రోగం ఏంటో చెప్పి, మందు ఇవ్వని(చికిత్స చేయని) డాక్టర్ వలె ఉంటుంది. ఐతే వారు ఏవిధంగా క్షమించబడగలరో, విడుదల పొందగలరో చెప్పి వారిని అమితంగా ప్రేమించి, వారి కోసం ప్రాణం పెట్టిన వారి దేవునికి అనుసంధానం చెయ్యాల్సివుంది(వ్యక్తిగతంగా వారు దేవుణ్ని సొంతం చేసుకొననివ్వండి). నీవు ప్రసంగిస్తున్న ప్రజలను దేవుడు అమితంగా ప్రేమిస్తున్నాడని మొదట గుర్తించు. అప్పుడు దేవుని మనస్సుతో భోధిస్తావు. మొదట వ్యర్ధ అతిశయాల నుండి నిన్ను నీవు శూన్యం చేసుకో! ఆయన ఆత్మ చేత నింపమని ప్రార్ధించు. అప్పుడు ఆయన నిన్ను తన ఆధీనంలోకి తీసుకుంటాడు.నీ ప్రమేయం లేకుండానే మాటల సరళి, క్రమం, ఆలోచనలు నీలో నుండి రావడం గమనిస్తావు. ఆ (దేవుని) మాటలు ఎదుటి వారిని తాకుతాయి. జీవితాలను మార్చుతాయి. ఎందుకంటే అవి దేవుని ఆత్మ చేత పలుకబడిన మాటలు. ప్రసంగం తర్వాత ఎవ్వరైనా నిన్ను పొగిడినా నీకు అతిశయం కలుగదు..ఎందుకంటే నీకు బాగా తెల్సు! అవి నీ మాటలు కావని. ఇలా దేవునికి మహిమ వెళ్తుంది.
✔ మనుషులు వారి ఎదుటి వారిలో తప్పులను ఎరడం పుట్టుకతోనే వచ్చిన విద్య. క్రైస్తవుల్లో కూడా లోతైన విశ్లేషణ చేసే విశ్లేషకులూ ఉన్నారు. ఐతే ఆ వారు విమర్శించిన/విశ్లేషించిన ఆ సమస్యకు వాక్యానుసారమైన సమాధానం ఇవ్వకపోతే అది సద్విమర్శ(మంచి బోధ) కాదు. అంతే కాదు అంతరంగంలో ప్రేమ లేకుండా(వారు ఆ తప్పు నుండి బయటకు తీసుకురావాలనే మనస్సు లేనితనంతో) ఎదుటి వారిని సరిదిద్దే ప్రయత్నం కూడా సద్విమర్శ కాదు! అంతకంటే నీవు మౌనంగా ఉండటం నీకు మేలు. కనుక మొదట మనల్ని మనం పరిశీలించుకోవాలి. నీ మనస్సాక్షిని దేవుని యెదుట శుభ్రంగా ఉంచుకున్నప్పుడు దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడటం చూస్తావు. నీవు వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే నీ ఆత్మలో నీకు తెలిసిపోతుంది. (నేను చెప్తున్న ఈ మాటలు దేవునితో నడుస్తున్న వారికి అర్ధమౌతాయి. ఒకవేళ నీకు అనుభవం లేనట్లేతే ఆసక్తితో దేవుణ్ని అడుగు! ఆయన నేర్పుతాడు)
కొన్నిసార్లు కఠినమైన మాటలో ప్రేమ ఉండొచ్చు, మెత్తటి మాటలో నీ ఆత్మకు కీడూ జరగొచ్చు. కాబట్టి మనస్సును చూడాలి. ఆత్మను వివేచించాలి. క్రీస్తు మాటలను/ప్రవర్తనను నిశితంగా పరిశీలన చేస్తే ఈ విషయాలు గమనించగలము.
Comments
Post a Comment