Skip to main content

03Oct2017

❇ నయోమి బెత్లెహేము ప్రజలతో౼“నన్ను నయోమి అనకండి. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలిగించాడు..నేను మోయాబు వెళ్ళిపోయినప్పుడు నాకు సమృద్ధి ఉంది. ఇప్పుడు ఏమీ లేకుండా నన్ను తిరిగి వచ్చేలా యెహోవా చేశాడు.. యెహోవా నాకు విరుద్ధ సాక్షిగా నిలబడ్డాడు. సర్వశక్తిమంతుడు నామీదికి ఆపద రప్పించాడు.”
బోయజు రూతుతో౼“నీ భర్త చనిపోయిన తరువాత...నీవు నీ తల్లిదండ్రులనూ నీ జన్మభూమినీ విడిచి, ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజలమధ్యకు వచ్చావు. నీవు చేసినదానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఇస్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద శరణు కోరి నీవు వచ్చావు. ఆయన నీకు పరిపూర్ణ బహుమతి ఇస్తాడు" ❇
✔ బెత్లెహేములో కరువు వచ్చినందుకు నయోమీ, ఆమె భర్త-ఇద్దరు పిల్లలతో బ్రతుకు తెరువు కోసం మోయాబు దేశానికి వలస వెళ్లారు. వారు భూసంభందమైన విషయాలకు మాత్రమే విలువనిచ్చారు. దేవుని వాక్యాన్ని-విశ్వాసుల సహవాసాన్ని, దేవుని వాగ్ధాన దేశాన్ని వదలిపెట్టి, విశ్వాసరహిత ప్రయాణం చేశారు. కొన్నిరోజుల తర్వాత ధర్మశాస్త్రనికి విరుద్ధంగా అవిశ్వాసులతో వియ్యమొందారు. ఐతే నయోమీ ఊహించిన జీవితానికి విరుద్ధంగా వాస్తవ జీవితంలో దుఃఖమే మిగిలింది. ఆమె తన భర్తను, ఇద్దరు పిల్లలను కోల్పోయింది. కానీ నయోమీ కోడలైన(మోయాబు స్త్రీ) రూతు తన అత్త ద్వారా దేవుని గూర్చి విని, దేవునిలో విశ్వాసముంచింది. దేవున్ని-ఆయన ప్రజల స్నేహాన్ని కోరుకుంది. నయోమీ ఒకత్తె తిరిగి బెత్లెహేము వెళ్తుంటే, రూతు తన స్వంత ప్రజలను విడిచిపెట్టి, ఆమెతో పాటు బెత్లెహేము రావడానికి విశ్వాసంతో బయలుదేరింది.
● ఒక అవిశ్వాస ప్రయాణం౼దేవుని విడిచి, లోక సుఖాలను హత్తుకుని పరుగులెత్తిన వారు వట్టి చేతులతో మిగిలి పోయ్యారు.
● ఒక విశ్వాస ప్రయాణం౼విశ్వాసంతో దేవుణ్ని హుత్తుకొని, అత్తను శ్రమలో ఒంటరిగా వదిలి వేయక, భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియకపోయినా, దేవుణ్ని ఆధారం చేసుకుని ప్రయాణించింది.
✔ కాబట్టే మోడులా మారిన రూతు జీవితానికి కొత్త చిగురును అనుగ్రహించాడు. భక్తిగల విశ్వాసిని భర్తగా ఆమెకు అనుగ్రహించాడు. ఆమెను లోక రక్షకుడైన క్రీస్తు వంశావళిలో భాగంగా దేవుడు చేశాడు. అనేక మంది రాజులు ఆమె వంశంలో నుండి వచ్చారు. ఇది(ఏమి ఆశించని) విశ్వాసానికి దేవుడు అనుగ్రహించిన బహుమతి.
✔ వీరి ఇద్దరి జీవితాల నుండి విశ్వాసంతో౼నిరీక్షణతో దేవుణ్ని హత్తుకోవటం గూర్చిన పాఠాలు నేర్చుకోవచ్చు. గమనించి చూస్తే నయోమీ కంటే రూతులో (దేవుని విషయంలో) ఎంతో యోగ్యమైన ప్రవర్తన కనిపిస్తుంది. కొన్ని సార్లు మన ద్వారా దేవునిలోకి నడిపించబడిన వారు, (ఆత్మీయంగా)వయస్సులో చిన్నవారు, మన కంటే ఎక్కువగా దేవుణ్ని హత్తుకొని జీవిస్తునట్లేతే, మనం (సిగ్గుపడి) సరిచేసుకోవాలే తప్ప వ్యర్ధమైన అతిశయాలకు/అసూయలకు పోకూడదు. మన ఆత్మీయ జీవితాలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, బలపరచుకోవడానికి ఆదర్శలుగా నిలవాలి. అందరికి దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, నడిపించే ఆత్మ దేవుడు ఒక్కడే! కానీ మనం దేవుణ్ని ప్రేమించి, కోరుకొని జీవించే జీవితం, తీసుకొనే తీర్మానాలు ఒకరి భక్తి నుండి ఒకరిని వేరు చేస్తూ ప్రత్యేక పరుస్తున్నాయి. దేవునిలో ఆ ప్రత్యేకమైన జీవితాలను మనం కొనసాగింతుము గాక!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...