Skip to main content

26Sep2017


❇ సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో
భోజనానికి కూర్చున్నాడు. వారంతా భోజనం చేస్తుండగా యేసు౼"మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ఒకరి తరువాత ఒకరు ఆయనతో౼"నేను కాదు కదా!" అని ఆయన్ని అడగటం ప్రారంభించారు.
ఆయన౼"నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు. దేవుని నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి 'శిక్ష (యాతన)' తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది." ❇
✔ 'క్రీస్తుకు సిలువ మరణం' దేవుని నిర్ణయమే కానీ ఇస్కరియోతు యూదా కుయుక్తి-ద్రోహం దేవుడు ఆదేశించినవి కావు. దేవుడు ఎన్నడూ చెడుకు కర్త కాదు. కాబట్టి కీడు తలపెట్టి దేవుని చిత్తం జరిగించానని ఎవడూ అనకూడదు. అంటే "క్రీస్తు సిలువ వేయబడి చనిపోవడం వల్లే నేడు అనేకులు రక్షించ బడ్డారు/బడుతున్నారు, కనుక నా ద్వారా దేవుడు ఈ పనిని జరిగించాడు, ఈ మంచి పని కోసం దేవుడు నన్ను వాడుకున్నాడు" అని ఇస్కరియోతు యూదా చెప్ప కూడదు/చెప్పలేడు. దేవుడు అతన్ని శిక్షకు పాత్రునిగా ఎంచాడు.
✔ దేవుడు తన ఉద్దేశ్యాలను బట్టి తన ప్రజలను శ్రమల గుండా తీసుకొని వెళ్తూ అనేక పాఠాలను నేర్పిస్తాడు. వారు దేవునిపై మరి యెక్కువగా ఆధారపడటానికి, భవిష్యత్తుల్లో ఆయన ప్రణాళికలు వారిలో సంపూర్తి చెయ్యడానికి వాటి గుండా నడిపిస్తాడు. ఈ మధ్యలో నీతిమంతులకు కీడు తలపెట్టే భక్తిహీనుల చెడుతనాన్ని సైతం, దేవుడు తన ప్రజలను తర్బీదు నిమిత్తం వాడుకుంటాడు. అయ్యో! ఎవడు ఆ శ్రమకు కారణం అవుడుతాడో వానికి శ్రమ. వాడు నీతిని/దేవుణ్ని ద్వేషించాడు, తన స్వభావాన్ని బట్టి చెడు జరిగించాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు దేవుడు నాకు యేసేపును గుర్తుచేస్తున్నాడు.
✔ నీతిమంతుడైన యోసేపు దేవుణ్ని బట్టి యజమానికి మేలు చేయాలని రాత్రిపగళ్లు కష్టపడ్డాడు. అతని భార్య పాపానికి ప్రేరేపించినా దేవుణ్ణి, తన యజమానుడు తనపై ఉంచిన నమ్మకాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాని పోతిఫరు తప్పుడు విచారణ చేసాడు. భార్య అబద్ధపు మాటలు నమ్మి యేసేపును చెరసాలలో వేయించాడు. గొంత్తెత్తి తను నిర్దోషినని అరిచినా ఎలాంటి ప్రయోజనం లేని పరిస్థితుల్లో యోసేపు కుమిలి పోయాడు. నీతిమంతుడు శ్రమపడ్డాడు, అవమానించబడ్డాడు. దేవుడు అతణ్ణి చూచాడు. చెరసాలలో ఉన్న యోసేపును దేవుడు తనదైన సమయంలో హెచ్చించాడు. ఐగుప్తు సామ్రాజానికి గొప్ప అధికారిగా దేవుడు చేశాడు(నరుడు కాదు). ఇప్పుడు ఫోతిపరు నేను చెరసాలలో వేయించకపోతే ఇతనికి ఈ మేలు జరిగేది కాదు.నా ద్వారానే ఈ మేలు జరిగిందని అనవచ్చా? లేదు..అనకూడదు!దేవుని నిర్ణయం ప్రకారం యోసేపు వెళ్ళాడు..కాని ఎవని మూలంగా శ్రమ పొందాడో వారు శిక్షార్హులు.
౼దేవుడు ఒకనితో భూమిపై సజీవునిగా ఉన్నప్పుడు మాట్లాడితే(తప్పుదిద్దితే) వానికి మేలు. నిత్యత్వంలో సరిద్దిద్దుకునే అవకాశం ఏ వ్యక్తికి ఉండదు. దేవుడు ఎవరిపై ఎక్కువగా పని చేస్తే వారు ధన్యులు. ఎవరు దేవునికి అధికారం ఇవ్వక 'నేను బాగున్నానని' భ్రమపడతారో వారు నిత్యత్వంలో శాశ్వితంగా దుఃఖపడతారు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...