Skip to main content

25Sep2015



❇ బాప్తిస్మమిచ్చే యోహాను పుట్టుక గురించి దేవదూత ముందుగానే అతని తండ్రికి ఈ విధంగా తెలియజేశాడు..
గబ్రియేలు దూత జెకర్యాతో౼"జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు...తల్లి గర్భాన పుట్టింది మొదలు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు. తండ్రుల హృదయాలను పిల్లల వైపుకీ, అవిధేయులను నీతిమంతుల జ్ఞానానికీ మళ్ళించడానికీ, తద్వారా ప్రభువు కోసం సిద్ధపడిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు 'ఏలియా' మనసుతో బలప్రభావాలతో ప్రభువు కంటే ముందుగా వస్తాడు" ❇

✔ బాప్తిస్మమిచ్చే యోహాను తన తల్లిదండ్రుల ముసలితనంలో పుట్టడం వల్ల, వారిని తన చిన్నతనంలోనే కోల్పోయాడు. ఒకవేళ అందువల్లే కాబోలు..అతని జీవనం అరణ్యములో కొనసాగింది. మిడతలు, అడవి తేనెను తింటూ, ఒంటె చర్మం ధరించాడు(మత్తయి 3:4). ఇతని వస్త్రధారణకు, మత పెద్దలు ధరించిన వస్త్రధారణకు చాలా తేడా ఉండేది. చూడగానే అడవి మనిషిని తలపించే ఆకారం.బాప్తిస్మమిచ్చే యోహానును అప్పటి మత పెద్దలు దైవ సంభంధిగా అంగీకరించ లేదు, పైగా దెయ్యం పట్టిన వాడని పిలిచారు(లూకా 7:33, 20:4,5). దేవుని వాక్యము అరణ్యములో ఉన్న యోహాను వద్దకు వచ్చింది. యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి, దేవునితో వ్యక్తిగత సంభంధం కలిగి ఉండి, తనను తాను లోకం నుండి ప్రత్యేక పరచుకున్న యవ్వనుడు (అతని వయస్సు సుమారు 30 ఏళ్ళు). ప్రవచనానుసారం రక్షకుని రాక గూర్చి ముందుగా ప్రకటించడానికి దేవుడే అతన్ని సిద్ధం చేసాడు(యెషయా40:3)

✔ నిజానికి భోధించాల్సిన వారు, ఈ పని చేయాల్సిన వారు ప్రధాన యాజకులు, మత పెద్దలు. వారు దేవునితో సంభంధం లేకుండా జీవిస్తున్నప్పుడు లోకరీత్యా అల్పులను, హీనపర్చబడిన వారిని దేవుడు వాడుకుంటాడు. మార్గం తప్పి౼హృదయాలను కఠిన పర్చుకొన్నవారు దైవ సంబంధులను గుర్తు పట్టకుండా..వారు హీనపర్చుకొనే ముసుగును దేవుడు తన సంబంధులకు ధరింపజేశాడు. అందుకే క్రీస్తు పుట్టుక బెత్లహేములో జరిగిన తర్వాత మళ్ళీ నజరేతుకు తీసుకువచ్చాడు(యోహాను 7:52). అందువల్ల పరిసయ్యులు, ప్రధాన యాజకులకు ఆయనే రక్షకుడనే ఆనవాళ్లు దొరక్కుండా పోయాయి. యదార్థవంతులు మాత్రమే ఆయన్ను గుర్తుపట్టేట్లుగా దేవుడు చేశాడు.నతానియేలు, సుంకారులను, జాలరులు వంటి వారు క్రీస్తును హత్తుకొన్నారు (యోహాను1:47). మన తరంలో కూడా ఈ రెండు రకాల గుంపులు లేకపోలేదు.

✔బాప్తిస్మమిచ్చే యోహాను మనుష్యుల అంగీకారం కోసం గాని, సమన్వయం కోసం గాని ఎన్నడూ ఎదురు చూడలేదు(మత్తయి 3:7). కాని తనను పంపిన వానిని(దేవుణ్ని) ముందు పెట్టుకొని జీవించాడు, దేవుని మాటలు కోసం కనిపెట్టాడు. ఆయన ఏం చెప్తే అదే బోధించాడు..ఇలా ఉంటూనే దీనుడుగా తనను తాను తగ్గించుకొని జీవించాడు(యోహాను 1:27).ఇది దేవుని సంభంధి లక్షణం. క్రీస్తు దైవ సంభంధి కనుకనే మత పెద్దల్లో దైవత్వం లేదని, యోహాను దేవుని వాడని గుర్తు పట్టాడు. దేవత్వం వయస్సులో, చదువుల్లో, స్థాయిలో నివసించదు గాని దేవుణ్ని ఆనుకోని జీవించే వారిలోనే ఉంటుంది. ఇది ఆత్మకు సంభందించిన విషయం.మరొక ఆత్మీయుడు గుర్తు పట్టగలడు. తిండి, బట్ట, వేషభాషాలు కాదు గాని..'ఇతడు దేవునితో అంటుకట్టబడి ఉన్నాడా?' అని అతన్ని ప్రేరేపిస్తున్న ఆత్మను చూడాలి. అతని ఆత్మ ఫలాన్ని చూడాలి(తలాంతులను కాదు)! యేసు యోహానును అలాగే చూచాడు, కనుకనే అతని యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...