❇ యేసు ఒక కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చున్నాడు. ఆయన తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది.
యేసు తన శిష్యుడైన ఫిలిప్పుతో౼"వీళ్ళంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొన బోతున్నాం?" అని అడిగాడు. (యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు)
ఫిలిప్పు౼"రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు" అన్నాడు.
(మరొక శిష్యుడైన) అంద్రెయ౼"ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు యవల రొట్టెలూ, రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?" అని ఆయనతో అన్నాడు.
యేసు౼"ప్రజలందర్నీ కూర్చోబెట్టండి" అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వాళ్ళంతా సుమారు ఐదు వేలమంది ఉంటారు. యేసు ఆ రొట్టెల్ని చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వాళ్లకు ఇష్టమైనంత వడ్డించాడు. అందరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత ఆయన౼"మిగిలిన రొట్టే, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్ధం కానీయ వద్దు" అని శిష్యులతో చెప్పాడు. అందరూ తిన్న తర్వాత మిగిలిన ఐదు యవల రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి. ❇
✔ శిష్యులకు మాములుగా వాళ్ళ భోజనాన్ని, బయట కొనే అలవాటు ఉంది(యోహాను 4:8). ఫిలిప్పు మనుష్యులను, భోజనాలు, వాటి ధరలను బాగా అంచనా వేస్తున్నాడు.ఈ అద్భుతాన్ని యేసు, ఫిలిప్పును ఏమీ ప్రశ్నించకుండానే చెయ్యవచ్చు. కానీ అలా అడగడంలో ఆయనకు ఒక ఉద్దేశ్యం ఉంది. దేవుడు ఫిలిప్పు విశ్వాసాన్ని వృద్ధి చెయ్యాలని చూస్తున్నాడు. అప్పటి వరకు ఉన్న అతని పరిమితమైన విశ్వాస కట్లను తెంచి, మరింత లోతైన విశ్వాసంలోకి నడిపించాలని చూస్తున్నాడు. విశ్వాసిని ఆయన మాటల్లో, పనుల్లో కలుపుకోవడం ద్వారా, అనుభవాల ద్వారా వారి ఆధ్యాత్మిక జీవితాలను మరింతగా మెరుగు పర్చుతున్నాడు (మత్తయి 16:8-10). దేవుడు వాడుకోలేనిది..తప్పిదాలను చేసిన వారిని (failures) కాదు, దేవుడంటే ఆసక్తిలేని వారిని . ఆసక్తి గల విశ్వాసికి నేర్పించడానికి ప్రతి రోజు(ప్రతి నిమిషం) ఒక విలువైన పాఠం దేవుని వద్ద ఉంటుంది.
✔ 5000 మంది ప్రజల్లో ఏ ఒక్కరి దగ్గరా భోజనం లేదా? ఆ చిన్న కుర్రాడి దగ్గరే మాత్రమే ఉందా!? తాను తినాలని తెచ్చుకున్న ఆహారాన్ని దేవుని కోసం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు.ఆ చిన్న హృదయంలో దేవునిపై ఉన్న ప్రేమ ఆ సమూహంలో ఉన్న వారిలో ఎవరికి తెల్సు?..దేవునికి మాత్రమే తెల్సు. దేవుడు దానిని అందరి ముందు బహిరంగ పరిచాడు. ఇది ఆయన స్వభావం(1సమూ 17:45-47). ఒకవేళ మిగితావారి దగ్గర భోజనం ఉన్నట్లేతే అది వారి ఆకలి మాత్రమే తీర్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ కుర్రాడి భోజనం వాని చేతి నుండి దేవుని చేతిలోకి వచ్చిందో అది ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవునికి మనల్ని మనం ఇచ్చివేసుకోకుండా (ప్రేమించకుండా) ఎన్నడూ ఆశీర్వాదకరంగా ఉండలేము. విరువబడనిదే అనేకులకు ఆహారంగా (ఆశీర్వాదంగా) మారలేము. క్రీస్తే దీనికి ఉదాహరణ. ఆయన దేవుణ్ని ప్రేమించి తన ప్రాణాత్మ దేహాలను దేవునికి అర్పణగా, ఆరాధనగా సమర్పించాడు. మన ఆరాధనలు కూడా అలాగే ఉండాలని పరలోక తండ్రి కోరుతున్నాడు.
యేసు తన శిష్యుడైన ఫిలిప్పుతో౼"వీళ్ళంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొన బోతున్నాం?" అని అడిగాడు. (యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు)
ఫిలిప్పు౼"రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు" అన్నాడు.
(మరొక శిష్యుడైన) అంద్రెయ౼"ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు యవల రొట్టెలూ, రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?" అని ఆయనతో అన్నాడు.
యేసు౼"ప్రజలందర్నీ కూర్చోబెట్టండి" అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వాళ్ళంతా సుమారు ఐదు వేలమంది ఉంటారు. యేసు ఆ రొట్టెల్ని చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వాళ్లకు ఇష్టమైనంత వడ్డించాడు. అందరూ కడుపు నిండా తిన్నారు. తర్వాత ఆయన౼"మిగిలిన రొట్టే, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్ధం కానీయ వద్దు" అని శిష్యులతో చెప్పాడు. అందరూ తిన్న తర్వాత మిగిలిన ఐదు యవల రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి. ❇
✔ శిష్యులకు మాములుగా వాళ్ళ భోజనాన్ని, బయట కొనే అలవాటు ఉంది(యోహాను 4:8). ఫిలిప్పు మనుష్యులను, భోజనాలు, వాటి ధరలను బాగా అంచనా వేస్తున్నాడు.ఈ అద్భుతాన్ని యేసు, ఫిలిప్పును ఏమీ ప్రశ్నించకుండానే చెయ్యవచ్చు. కానీ అలా అడగడంలో ఆయనకు ఒక ఉద్దేశ్యం ఉంది. దేవుడు ఫిలిప్పు విశ్వాసాన్ని వృద్ధి చెయ్యాలని చూస్తున్నాడు. అప్పటి వరకు ఉన్న అతని పరిమితమైన విశ్వాస కట్లను తెంచి, మరింత లోతైన విశ్వాసంలోకి నడిపించాలని చూస్తున్నాడు. విశ్వాసిని ఆయన మాటల్లో, పనుల్లో కలుపుకోవడం ద్వారా, అనుభవాల ద్వారా వారి ఆధ్యాత్మిక జీవితాలను మరింతగా మెరుగు పర్చుతున్నాడు (మత్తయి 16:8-10). దేవుడు వాడుకోలేనిది..తప్పిదాలను చేసిన వారిని (failures) కాదు, దేవుడంటే ఆసక్తిలేని వారిని . ఆసక్తి గల విశ్వాసికి నేర్పించడానికి ప్రతి రోజు(ప్రతి నిమిషం) ఒక విలువైన పాఠం దేవుని వద్ద ఉంటుంది.
✔ 5000 మంది ప్రజల్లో ఏ ఒక్కరి దగ్గరా భోజనం లేదా? ఆ చిన్న కుర్రాడి దగ్గరే మాత్రమే ఉందా!? తాను తినాలని తెచ్చుకున్న ఆహారాన్ని దేవుని కోసం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు.ఆ చిన్న హృదయంలో దేవునిపై ఉన్న ప్రేమ ఆ సమూహంలో ఉన్న వారిలో ఎవరికి తెల్సు?..దేవునికి మాత్రమే తెల్సు. దేవుడు దానిని అందరి ముందు బహిరంగ పరిచాడు. ఇది ఆయన స్వభావం(1సమూ 17:45-47). ఒకవేళ మిగితావారి దగ్గర భోజనం ఉన్నట్లేతే అది వారి ఆకలి మాత్రమే తీర్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ కుర్రాడి భోజనం వాని చేతి నుండి దేవుని చేతిలోకి వచ్చిందో అది ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవునికి మనల్ని మనం ఇచ్చివేసుకోకుండా (ప్రేమించకుండా) ఎన్నడూ ఆశీర్వాదకరంగా ఉండలేము. విరువబడనిదే అనేకులకు ఆహారంగా (ఆశీర్వాదంగా) మారలేము. క్రీస్తే దీనికి ఉదాహరణ. ఆయన దేవుణ్ని ప్రేమించి తన ప్రాణాత్మ దేహాలను దేవునికి అర్పణగా, ఆరాధనగా సమర్పించాడు. మన ఆరాధనలు కూడా అలాగే ఉండాలని పరలోక తండ్రి కోరుతున్నాడు.
Comments
Post a Comment