Skip to main content

08Aug2017



❇ దేవుడు ఇశ్రాయేలీయులతో౼"మహా యెండకు కాలిన అరణ్యములో నీతో స్నేహం చేసిన వాడను నేనే! నేను వారికి ఆహారం ప్రసాదించినప్పుడు వారు తిని తృప్తిపడ్డారు. తృప్తిపడి గర్వించారు.అప్పుడు వారు నన్ను మరచిపోయారు"(హోషేయా 13: 5) ❇

✔ లోకం వారి వైపు చూసినప్పుడు వారిలో ఏ అర్హత కనిపించదు. అలాంటి మనుష్యులతో స్నేహం చెయ్యడానికే దేవుడు ఇష్టపడతాడు. ఏ హృదయానికి ఓదార్పు, జాలి, ప్రేమలు అవసరమౌతాయో వారిని దేవుడు వెతుక్కుంటూ వెళ్తాడు. మన మధ్యలో ఉన్న అత్యంత బలహీనులైన వారి చుట్టూ దేవుని కృప విస్తరించి ఉంటుంది అని కనిపెట్టగలవా? బయటికి కనిపించే చక్కటి విలువలతో ఉంటే మనమేంటి, ఈ లోకం కూడా స్నేహం చేస్తుంది కదా! క్రీస్తు కూడా సుంకరులను,పాపులను, వ్యభిచారులను, కుష్ఠురోగులను, జక్కయ్య వంటి తిరస్కరించబడిన వారిని, చదువులేని జాలరులను, దేవుని పట్ల యదార్థవంతులను, చివరికి సిలువపై ఉన్న నేరస్తున్ని, లోకరీత్యా అల్పులు, హీనులతో కలిసి నడిచాడు, వారితో స్నేహం చేశాడు. క్రీస్తులోని పరిశుద్ధత బలహీనులను అంగీకరిస్తూ, నిరీక్షణనిస్తుంది. పరిసయ్యుల భక్తికి, క్రీస్తుకు ఉన్న తేడా అదే! అర్హతలను బట్టి దేవుడు స్నేహం చేసిన్నట్లేతే, నిన్ను-నన్ను దేవుడు ఎప్పుడో దాటిపోయివుండేవాడు. ఈ విషయంలో నీవు కూడా నాతో ఏకీభవిస్తావనుకుంటున్నాను!

✔ మన రక్షకుడు నడచిన మార్గంలో మనం నడవాలని ఆయన ఆదేశించలేదా? కృపను పొందుకున్నాం! కాబట్టి ఇతరులకు ఇవ్వాల్సిన బద్ధులమైవున్నాము. ఒకవేళ క్రీస్తు మన స్థానంలో జీవిస్తునట్లేతే, మనం నిర్లక్ష్యం చేసిన అనేకులను ఆయన హత్తుకొని ఉండి ఉంటాడు.

● మనం దోషాలను-బలహీనతలను విశ్లేషించడంలో ప్రావీణులం అవ్వాలని దేవుడు చూడట్లేదు, కానీ యదార్థవంతులైన ప్రతి ఒక్కరికి సహాయకులంగా (క్రీస్తును పోలి) ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. ఇది క్రీస్తు పరిచర్య.

● మనం ఇతరుల దోషాలను లోతుగా విశ్లేషించి వెతకడం-పట్టడం, మనస్సులో ఒక స్థిరమైన నిర్ధారణకు రావడమే మన పరిచర్య ఐతే, అది మతసంబంధులైన పరిసయ్యుల పరిచర్య.

✔ ఆయన తన మహా పరిశుద్ధతలో నుండి మనుష్యులకు తీర్పు తీర్చాలను కోవట్లేదు! కానీ ఆ వ్యక్తి స్థానంలో నిలువబడి, విస్తారమైన కృపతో జాలిని నిలిపి, అసహ్యమైన జీవితాన్ని సైతం భరించి, క్షమించి, హత్తుకోవాలనుకుంటాడు (హృదయపూర్వకంగా ఆ అపరాధాన్ని అంగీకరించు వారి విషయం గూర్చి చెప్తున్నాను). విశ్వాసులమైన మన జీవితంలో ఎన్నో సార్లు చేసిన తప్పులనే (బలహీనతలనే) పదే పదే చేసి త్రొటిల్లినప్పుడు దేవుడు మనల్ని హత్తుకోలేదా? వాటిని గుర్తు చేసుకొని ఇప్పుడు ఎదుటి వారిని చూడు, వారి బలహీనతలు ఎంత స్వల్పంగా ఉంటాయో! ఉన్నపాటున (బలహీనతలతోనే) అంగీకరించడం దేవుని లక్షణం.

↪పౌలు-"కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనల్ని మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి" (రోమా 15:1)
ఒకడు తను బలవంతుడని భావిస్తే బలహీనుడు మోయ్యలేని భారాన్ని సైతం మోయగలగాలి కదా! లేదంటే వాడు కూడా బలహీనుడని దానర్ధం. అలానే తోటి వ్యక్తులను బలహీనతలతోనే హత్తుకునేవాడే నిజమైన బలవంతుడు. క్రీస్తు బలవంతుడు!

✔ దేవున్నుండి బలం పొందుకొని, లోకం చేత బలహీనులుగా పిలువబడే వారితో స్నేహం చెయ్యడానికి, వారిని వారిగానే అంగీకరిస్తూ, క్రీస్తు పొలికగా మార్చడానికి బలవంతులుగా తయారుచెయ్యడం కోసం, క్రీస్తు మాదిరిని మనలో ధరించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు ఆ విధంగా మనల్ని ఆయన కొరకు ఒక రాజ్యంగా కట్టును గాక!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...