Skip to main content

07Aug2017


"నాబాలు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు, అతడు క్రూరుడు, నీచుడు. అతను కాలేబు సంతతివాడు"
నాబాలు  వంశానికి మూలపురుషుడైన కాలేబు దేవునిపై ఎంతో ౼ విశ్వాసం కలిగి, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు కాగా అతని సంతతి వాడైన నాబాలులో మచ్చుకైనా ఆ భక్తి కనిపించదు. 

బాప్తిస్మమిచ్చు యోహాను.. పరిసయ్యులు, సద్దూకయ్యులు చూసి -'సర్పసంతానమా! దేవుని కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి'

✔ ఎవరి భక్తి జీవితం వారిదే! గాని మన పితరుల భక్తి మనకు ఆపాదించబడదు. కొన్ని సార్లు మునుషులు వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. భక్తిగల తల్లిదండ్రుల బట్టి, పితరులను బట్టి, భక్తిగల నాయకులతో వారికున్న సన్నిహిత్యాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి.. ఇలా రకరకాలుగా తమది కానీ భక్తిని బట్టి లోలోపల అతిశయిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా చూడడు. వారు తమ పితరుల జీవితం గూర్చి తెలుసుకొని ఉండొచ్చు కానీ వారు ఎవ్వరితో  నడిచారో ఆ దేవుణ్ణి తెలుసుకున్నవారు కాదు. వారి జీవితాలను చూస్తూ, బోధనలను అభిమానిస్తూ ఉండొచ్చు కానీ దాని శక్తిని తమతో కొనసాగించిన వారు కాకపోవచ్చు. దేవునిలో కాక, ఈ లోక వ్యర్ధాతిశయాల యందే ఆనందించే వారుగా ఉంటారు. కాలేబు విశ్వాసాన్ని బట్టి దేవుని చేత ఆశీర్వదించబడితే, నాబాలు దేవున్ని విడచి, ఆయనచేత చంపబడ్డాడు.

✔ నాబాలు మరణం వరకు ధనవంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడైన దావీదు శ్రమతో, లేమితో గడిపాడు. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధానయాజకులు రాజులకు, అధికారులకు నెళవైన వారీగా ఉన్నారు, కానీ బాప్తిస్మమిచ్చు యోహాను, తిరస్కరించబడి చెఱసాలలో వెయ్యబడ్డాడు.
 ఒకని ఈ లోక పేరు ప్రతిష్టలు, ఒకని భూసంభంధమైన సంమృద్ది దేవుని అంగీకారానికి గుర్తు కాదు. అవి భక్తిహీనులకు కూడా దొరుకుతున్నాయి కదా! కాబట్టి అతిశయించడానికి ఏమీ లేదు!

✔ అతిశయించువాడు తన దేవుణ్ణి నిదానించి చూడటంలో, ఆయన నీతి మనలో కార్యరూపం దాల్చడంలో, క్రీస్తు పునరుద్ధన శక్తిని బట్టి, దేవుని రూపాన్ని పొందటంలోనే అతిశయించాలి. దేవుడు మనకు తోడై ఉంటే లేమిలో(ఏ స్థితిలోనైన) ఉన్న ఆనందం, శ్రమలో ఉన్న సంతోషం, ఆయన ప్రేమలోని పరిపూర్ణతను మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. 

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...