Skip to main content

02Aug2017

 యేసు౼"ఒక స్త్రీ దగ్గర పది వెండి నాణేలు ఉన్నాయనుకోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె దీపం వెలిగించి, యిల్లంతా ఊడ్చి అది దొరికే దాకా జాగ్రత్తగా వెతకదా?
దొరికిన వెంటనే తన స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి పోగొట్టుకున్న నా నాణెం దొరికింది. మనమంతా ఆనందించుదాం! అని అంటుంది.
అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి పరలోకంలో దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెప్తున్నాను" 
 ఆ స్త్రీ మిగిలిన 9 నాణేలు బట్టి ఉరుకోక, కోల్పోయిన ఆ ఒక్క నాణెం కోసం దీపం వెలిగించి, యిల్లంతా ఊడ్చి ఎంతో శ్రద్ధగా వెతికింది. క్రీస్తు చెప్తున్నాడు..ఇవ్వరైతే దేవుని నుండి దూరమైపోతూ పాపంలో జీవిస్తుంటారో, వారిని నీతి మార్గంలోకి తీసుకురావటం కోసం దేవుడు కూడా అలాగే శ్రద్ధగా వెతుకుతాడు. పాపం చేసిన వారి పట్ల పరలోక తండ్రి మనస్సును క్రీస్తు తెలియజేస్తున్నాడు.
 తోటి వారి ప్రవర్తనతో తమను తాము పోల్చుకొని 'నీతి' గా ఉన్నామని సంతోషపడే వారి కంటే అధికంగా, యదార్థంగా తమ తప్పును ఒప్పుకుని, ప్రవర్తన మార్చుకోవాలని ఆశించే వారిపై దేవుని శ్రద్ధ అధికంగా ఉంటుంది. పాపాన్ని యదార్ధంగా ఒప్పుకోలేని వారిని దేవుని హస్తం కూడా రక్షించలేదు. ఆయన చేతి క్రిందకు రాని వారిని ఆయన బలవంతం చేయ్యడు. ఒక మనిషి జీవితకాలంలో తన సృష్టికర్తను తెలుకుకోవటానికి సరిపడే వెలిగింపును, అవకాశాలను, జ్ఞానాన్ని ఆయన అందరికి అనుగ్రహిస్తాడు.
 భూమి మీద ఉన్న ఏ ఒక్కరు దేవుణ్ని విడచి తీర్పులోకి(నరక ఉగ్రత) వెళ్లాలని ఆయన ఆశించట్లేదు. దేవుని శిక్షకు సిద్ధంగా ఉన్న వారిని వెతికి, రక్షించడం కోసమే యేసు ఈ లోకానికి వచ్చాడు. మనుష్యులందరి పాపం(నరక ఉగ్రత) యేసు ఇష్టపూర్వకంగా తానే తన శరీరంలో, ఆత్మలో ఆ యాతనను భరించాడు. మనకు నిరీక్షణ ఇవ్వడం కోసం చనిపోయి, తిరిగి లేచాడు.యేసు ద్వారా దైవప్రేమ ఇలా మనకు ప్రకటించబడింది. యేసును రక్షకునిగా స్వీకరించి, పాపాల విషయమై రక్షకుని దగ్గర పశ్చాత్తాపడి, తమ స్వంత మార్గాలను విడిచి (మారుమనస్సు పొంది), దైవ మార్గంలోకి వచ్చే వారందరిని తన బిడ్డలుగా చేసుకుంటానని దేవుడు మాట ఇచ్చాడు.
 నిత్యం సంతోషం ఏలే పరలోక రాజ్యంలో, ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజల్లో ఒకడ్నినైనా, నాలాంటి వాణ్ని(అల్పుని) బట్టి కూడా దేవుడు ఎంతో సంతోషిస్తునట్లేతే.. ఆయన మనస్సులో నా(నీ) విలువ(స్థానం) ఎలాంటిదో అర్ధమౌతుంది..ఆయన తన విలువైన స్వరక్తమిచ్చి నన్ను కొన్నాడు..కాబట్టి నేను సర్వోన్నతుని దృష్టికి విలువైన వాడనే! అది నా అర్హత కాదు గాని ఆయన కృపే!

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...