Skip to main content

21 July 2017


 ఎలీషా ప్రవక్త మరణించగా, ప్రజలు అతనిని సమాధిలో ఉంచారు.
ఒక సంవత్సరమైన తరువాత మోయాబీయుల సైన్యము ఇశ్రాయేలు దేశము మీదికి వచ్చినప్పుడు..కొంతమంది ఒక శవాన్ని పాతిపెడుతూ సైన్యమునికి భయపడి, ఆ శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో ఉంచారు. ఎలీషా ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి తాకగానే, ఆ వ్యక్తి సజీవుడయ్యాడు(2రాజులు 13: 20,21)  

దేవుడు ఎలీషా ద్వారా చాలా అద్భుతాలు జరిగించాడు.కాని ఎలీషా రోగగ్రస్తుడై చనిపోయ్యాడు. ఎలీషా రోగం వల్ల చనిపోయ్యేట్లు దేవుడే అనుమతించాడు. దేవుడు ఆయనకు నమ్మకమైన వారి జీవితంలో పంపే భాధలన్ని "శిక్షలు" కావు. చాలా సార్లు నమ్మకత్వానికి పరీక్షలుగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎలీషా గ్రహించాడు, కనుకనే దేవుని పట్ల విముఖత చూపలేదు. పైగా ఆయన చిత్తాన్ని గౌరవించాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం కోసం దేవుడు ఎలీషా ఎముకల్ని సైతం వాడుకోనడం ద్వారా, ఎలీషా తనకు నమ్మకమైన సేవకుడని దేవుడు ఆమోదించాడు.
౼ సంతానంలేని అబ్రాహాము, రాజైన అబీమెలేకు ఇంటివారి కొరకు ప్రార్ధించగా, దేవుడు తిరిగి గర్భ ఫలాన్ని ఇచ్చాడు.(ఆది 20:17,18)
౼ అనేక శ్రమల పాలైన యోబు ప్రార్ధించగా, దేవుడు అతని స్నేహితులను శిక్షింపక వదిలిపెట్టాడు.(యోబు 42:8,9)
౼ జబ్బు కళ్ళతో భాధపడే పౌలు చేత, చనిపోయిన వ్యక్తిని సైతం దేవుడు బ్రతికించాడు.(అపో 20:9,10)
దేవుని మార్గాలల్లో నడిచిన ఆయన వారు, శ్రమలో దేవుని నమ్మకత్వాన్ని, ఆయన శక్తిని వారు మరి ఎక్కువగా తమ జీవితాల్లో అనుభవించే వారిగా ఉంటూ, అందులో దేవుడు తమ కోసం దాచివుంచిన శ్రేష్ఠమైన మేలులను గుర్తించే వారిగా ఉంటారు. కనుకనే కృంగిపోరు.
పౌలు౼"ఇప్పటి మన బాధలు తరువాత మనలో వెల్లడి కాబొయ్యే మహిమతో పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను"(రోమా 8:18)
దేవుడు తనకు నమ్మకమైన వారిని వివిధ పరీక్షల గుండా నడిపిస్తూనే, ఇతరులకు ఆశీర్వదకరమైన వ్యక్తుల ఉంచడం వల్ల, వారు తన వారని ఆమోదిస్తున్నాడు. ఇప్పటికి ఆయన వారిని అనేకులను దేవుడు ఇదే మార్గన నడుపుతూ ఉన్నాడు.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...