Skip to main content

16 July 2017


❇ "ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లి, ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకొని దేవునికి ఇలా ప్రార్థించాడు-'ప్రభువా, నాకిది చాలు. ఇక నన్ను చనిపోనియ్యండి. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను' అన్నాడు" ❇

✔ ఏలీయా ప్రార్థనను బట్టి దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. వర్షాన్ని కురిపించాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. సూచక క్రియలను చేశాడు. ఈ ప్రార్థనలన్నీ దేవుని చిత్తానుసారం చేశాడు(1రాజు 18:1,36)
ఏలీయా చేసిన అన్ని ప్రార్ధనలను దేవుడు ఆలకించి అంగీకరించాడు. దేవుడు పంపిన ప్రతిచోటికి విశ్వాసంతో ప్రయాణం చేశాడు.

 ✔ కానీ పైన చెప్పిన ఒక్క సందర్భంలో అతని ప్రయాణం, ప్రార్థన విశ్వాసం లేని సొంత ఆలోచన. కనుకనే అతని ప్రార్థనను దేవుడు త్రోసిపుచ్చాడు(ప్రార్థనలో దేవునికి సలహాలవ్వకూడదు. నిర్గమ 4:13,14). నిజానికి అనాధికాల దేవుని సంకల్పంలో ఏలీయా మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్లడం దేవుని చిత్తం. కానీ అల్పవిశ్వాసం, భయం, నిరుస్సాహలు దేవుని చిత్తానికి పూర్తి విరుద్ధమైన ప్రార్థనలోనికి, మార్గంలోకి మనల్ని నడిపిస్తాయి (యోహాను 21:3).

❇ "అప్పుడు ఏలీయా నిద్రపోగా..ఒక దేవదూత అతణ్ణి తట్టి 'నీవు లేచి భోం చెయ్యి!' అన్నాడు. అతడు కండ్లు తెరిచి చూస్తే అతడి తల దగ్గర సీసాలో నీళ్ళు, వేడి రాళ్ళ మీద కాల్చిన రొట్టె కనిపించాయి. అతడు తిని నీళ్ళు త్రాగి మళ్ళీ పడుకొన్నాడు.

తరువాత యెహోవా దూత రెండో సారి వచ్చి అతణ్ణి తట్టి 'లేచి భోం చెయ్యి. లేకపోతే నీవు చేసే ప్రయాణం నీ బలానికి మించిపోతుంది' అన్నాడు" ❇

✔ దేవుని చిత్తానుసారం నడవడానికి ఇష్టపడేవారిని, ఆయనే తన చిత్తంలోకి ప్రవేశపెడతాడు. సమస్తం సిద్ధపరుస్తాడు. కొన్ని అల్ప విశ్వాస, బుద్ధిహీన ప్రార్థనలను దేవుడు అంగీకరించకపోవడమే మనకు మేలు. లేదంటే కొన్ని విలువైన ఆయన ఆలోచనలను (ఏలీయా మరణం చూడకుండా పరలోకానికి వెళ్లడం లాంటివి) కోల్పోతాము.

☑ మన ప్రార్థన విశ్వాసంతో, దేవుని మీద ఆధారపడుతూ, ఆయన ఆలోచనలను గుర్తుపట్టెట్లుగా ఉండవల్సివుంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

20Mar2018

✴️ ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డకు జబ్బు చేసేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డకోసం దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. అతడు ఉపవాసముండి, ఇంటిలోపలికి వెళ్ళి రాత్రులు నేలమీద పడి ఉన్నాడు. ఇంటిలో పెద్దలు అతని దగ్గర నిలబడి ఉండి అతణ్ణి నేల నుండి లేవనెత్తడానికి ప్రయత్నం చేశారు గాని అతడు ఒప్పుకోలేదు. ఐతే 7వ రోజు ఆ శిశువు చనిపోయాడు. శిశువు చనిపోయాడని దావీదుతో చెప్పడానికి భయపడ్డారు. సేవకులు గుసగుసలాడడం చూచి శిశువు చనిపోయాడని దావీదు గ్రహించాడు. “బిడ్డడు చనిపోయాడా?” అని సేవకులను అడిగాడు. “చనిపోయాడు” అని వారు జవాబిచ్చారు. వెంటనే దావీదు నేల నుండి లేచి స్నానం చేసి నూనె పూసుకొని బట్టలు మార్చుకొని యెహోవా నివాసంలోకి వెళ్ళాడు. యెహోవాను ఆరాధించిన తరువాత ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మన్నాడు. వారు వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు...అతని సేవకులు దావీదును చూచి౼బిడ్డ ఇంకా ప్రాణంతో ఉంటే ఒక వేళ యెహోవా నా మీద జాలి చూపి వాణ్ణి బ్రతకనిస్తాడేమో అనుకొన్నాను, గనుక నేను ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు వాడు చనిపోయాడు. నేనెందుకు ఉపవాస ముండాలి? వాడు మళ్ళీ వచ్చేలా చేయగలనా? నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను గాని వాడు నా దగ్గరికి తి...