Skip to main content

6 June 2017

దావీదు తన కుమారుడైన అబ్షాలోము, తనను చంపాలని చూసినప్పుడు బహూరీముకు వచ్చాడు. సౌలు కుటుంబానికి చెందిన వాడైన "షిమీ" దావీదును శపిస్తూ, దావీదు మీద, అతని సేవకులందరి మీదా రాళ్ళు రువ్వుతూ--

"వెళ్ళిపో! హంతకుడా! దుర్మార్గుడా! వెళ్ళిపో! నీవు సౌలు ఇంటివాళ్ళను హత్య చేసి, సౌలు స్థానంలో రాజయ్యావు గాని, నీవు చేసిన రక్తపాతానికి దేవుడు నీకు ప్రతీకారం చేస్తున్నాడు. దేవుడు నీ కొడుకు అబ్షాలోము చేతికి రాజ్యాన్ని ఇచ్చివ
ేశాడు. నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లంటే నువ్వొక హంతకుడవు!" అని దూషించాడు.

అబీషై దావీదుతో- "నా ప్రభువైన రాజును ఈ చచ్చిన కుక్క ఎందుకు తిట్టాలి? నన్ను వెళ్లి షిమీ తల నరికివేయనీయండి!" అన్నాడు.

అందుకు దావీదు వారిస్తూ- "దావీదును శపించమని దేవుడు వాడికి చెప్పితే ‘నీవెందుకు ఇలా చేస్తున్నావు?’ అని ఎవడు అడగగలడు?వాడి జోలికి పోవద్దు. శపించమని దేవుడు వాడికి చెప్పాడు, గనుక వాణ్ణి శపించనియ్యండి. దేవుడు నా బాధను చూచి, ఇవ్వేళ వాడు పలికిన శాపానికి బదులు దేవుడు నాకు మంచి చేస్తాడేమో" 
అని, దావీదు, అతని మనుషులంతా త్రోవలో ముందుకు సాగారు. వారు వెళ్ళిపోతూ ఉంటే షిమీ అతనికి ఎదురుగా కొండప్రక్కన వెళ్తూ, దావీదు మీదికి రాళ్ళు రువ్వుతూ, మట్టి విసరివేస్తూ, దూషిస్తూ వచ్చాడు.


ఇది సాత్వికమైన మనస్సు. అంటే బదులు చెయ్యగల(మాట్లాడగల) సామర్థ్యం ఉన్నా,"మౌనమై", పరిస్థితులంతటిపై అధికారం గల దేవుని నమ్మి, ఆయనపై ఆధారపడి, ఆయనకు మనల్ని మనం అప్పగించుకొనడం. కుక్కల గుంపు తనను చూసి మొరుగుతూ ఉంటే, సింహం మౌనంగా ఉండటం వంటిది.దేవుని అనుమతి లేకుండానే ఇలాంటి అవమానాలు మన జీవితంలోకి వస్తాయా?
మనం కలుగజేసుకుంటే దేవుడు మౌనమౌతాడు.మనం మౌనమై, దేవునికి అప్పగించుకుంటే, ఆయన కలుగజేసుకుంటాడు. నూతన నిబంధన మరింత శ్రేష్టమైనది. అలాంటి వారిని అంతరంగం నుండి క్షమించాలి. ఇది ఆత్మ దేవుని శక్తి ద్వారా మాత్రమే సాధ్యం.

-- ఆయన(యేసు) దూషింపబడినా కూడా, బదులు దూషింపలేదు.ఆయన శ్రమపెట్టబడినా కూడా బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్నుతాను అప్పగించుకొనెను.(1పేతురు 2:23)
"శత్రువులను కాదు, తన్నుతానే దేవుని ఉద్దేశ్యాలకు అప్పగించుకొన్నాడు"

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...