Skip to main content

11Apr2018

✴️ దేవుడు౼"నాకు విరోధంగా మీరు చాలా గర్వంగా మాట్లాడారు" "నిన్ను గూర్చి ఏమని మాట్లాడాం?"అని మీరు అడుగుతారు. "'దేవుణ్ని సేవించడం (సేవ చేయడం) వ్యర్ధం. ఆయన ఆజ్ఞలు పాటించి దేవుని సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉండడంవల్ల ఏమి ఉపయోగం? గర్విష్ఠులే దీవెనలు పొందుతున్నారు, దేవుణ్ణి పరీక్షించే దుర్మార్గులు భద్రంగా ఉంటూ వర్ధిల్లుతున్నారు" అని మీరు చెప్పుకుంటున్నారు.

అప్పుడు యెహోవా పట్ల భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా ఆ మాటలు విన్నాడు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయన నామాన్ని గౌరవించే వారి గురించి జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధానంలో ఒక పుస్తకం రాశారు. "నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను" అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు. (మలాకి 3:13-17) ✴️


■ దేవుడు సర్వజ్ఞాని. ఆయన ప్రతి పని వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యం ఉంటుంది. దేవుడు ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని పరిక్షిస్తాడు. (దీవెన/మేలుకు ముందు కాని లేదా దీవెన తర్వాత కాని). పరీక్షకు ముందు అందరూ ఒకే విధంగా కనిపిస్తారు(స్తుతిస్తారు) కానీ పరీక్ష అనంతరం మాత్రం దేవుడ్ని ప్రేమించేవారు మరియు దేవుని చేతిలో ఉన్న వాటినే ప్రేమించే వారుగా వేరు చెయ్యబడతారు. సహజంగా దేవుడు వివిధ విధాలుగా మనుష్యులను ఆయన సహవాసానికి పిలుచుకుంటాడు. కొన్నిసార్లు వ్యాధిభాధ బలహీనతలు, సూచక క్రియలు-మహత్కార్యాలు, సత్యానేషణ, మానసికంగా క్రుంగుదల మొ||. ఐతే దేవుణ్ని సేవించడంలో దీవెనలను ఆశించే వ్యక్తులు దేవుడు తమ భక్తికి పరిక్షపెట్టినప్పుడు తేలిపోతారు. వారు అన్యాయస్థులను, అవిశ్వాసులను లోకసంబంధమైన దీవెనలు పొందుకుంటున్నప్పుడు, వారి జీవితాల్లో ఆ మేలులు దొరకనప్పుడు 'మన భక్తి వల్ల ఏమి ప్రయోజనం, ఏమీ దొరకట్లేదు మన కంటే వాళ్లే నయ్యం' అనుకుని దేవునిపై తిరుగుబాటు చేస్తారు. తమ సొంత జీవితాలపై దేవుని యెలుబడి ఇష్టపడని, లోక సౌఖ్యల యందే మనస్సు పెట్టుకొను వారు, దేవుణ్ని అవసరానికి వాడుకునే ఒక యంత్రం లాగే చూస్తారు. వారు కోరుకున్నవి దొరికినంతకాలం భక్తిలో ఉంటారు, అవి దొరకనప్పుడు లోపల ఉన్న చెడిపోయిన వక్రబుద్దిని బట్టి దేవుని దూరమౌతారు. వారి స్వభావాన్ని బట్టి తిరిగి లోకంలో కలిసిపోతారు. పైన దేవుని వాక్యం చెప్పిన విధంగా దేవునికి కోపం పుట్టించి, నశించిపోయే వారిగా ఉంటారు.

■ కానీ కొందరు తాము ఏవిధం చేతనైనా దేవుని దగ్గరకు పిలువబడినప్పటికిని, అక్కడితో ఆగిపోక దేవుని శక్తిని చూసినవారై, యదార్థ హృదయులై దేవుడు ఎలాంటి వాడో, రక్షకుడు ఎందుకు వచ్చాడో, వాటిని గూర్చి వెలిగించబడి హత్తుకుంటారు. (ఇటువంటి మనస్సు గల వారిని దేవుడు జీవపు మాటలకు నడిపిస్తాడు) తర్వాత రోజుల్లో ఎన్ని లేమిలు ఉన్నా వారు దేవుణ్ని వదలరు. ఎందుకంటే వారు ప్రేమిస్తున్నది, వారి విశ్వాసం దేవుని చేతిలో ఉన్న వాటిపై కాదు గాని, దేవున్నే. ఈ విశ్వాసం బలమైనది, స్థిరమైనది మరియు నిష్కల్మషమైనది. దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్నవారు కదల్చబడరు. అంత్య దినాన దేవుడు వారి దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడడు. కొదువలతో దేవుడు వారిని పరీక్షించగా, వారు పలికిన విశ్వాస మాటలను దేవుడు భద్రం చేస్తాడు, ఒక రోజు వాటిని సమస్త మానవాళి ముందు బహిర్గతం చేస్తాడు. వారు దేవుని మంచితనాన్ని, శక్తిని తమకు అర్ధంకాని పరిస్థితుల్లో కూడా ఆయన్ను నమ్మి మహిమపర్చే వారిగా ఉంటారు.

■ మనుష్యులు దేవుని చేతిలో ఉన్న వాటినే ప్రేమించే వారుగా ఉండటానికి మరొక కారణం వారిని నడిపించిన భోధకులు! లోక కోరికలు తీరుతాయని, దేవుణ్ని నమ్మమని ఆశ చూపి పిలువగా, గుంపులు గుంపులుగా ప్రజలు దేవుని దగ్గరకు వస్తారు. అద్భుతాలు, సూచక క్రియల వంటి సాక్షాలతో ప్రజలను ఆకర్షిస్తారు. ఇలాంటి భోధకులు నేడు అనేకులు. క్రీస్తు, అపొస్తలులు ఎన్నడూ ఇలా పిలువలేదు. వారు దేవుని రాజ్యాన్ని గూర్చి మాత్రమే ప్రకటించారు. నిజంగా అవసరతల్లో ఉండి వచ్చిన ప్రతి ఒక్కరినీ దైవ చిత్తానుసారం మేలు చేశారు. దేవుని వాక్యాన్ని స్థిరపర్చడానికే ఈ సూచకక్రియలను దేవుడు వాడుకున్నాడు. 'దేవుని రాజ్యం' అంటే పరలోక పట్టణం అని కాదు గాని, దేవుడు ఏలే ప్రదేశం. అది మొదట మన హృదయం(జీవితం). భూమిపై మనలో దేవుని పరిపాలన లేకుండా దేవుని పట్టణం (పరలోకరాజ్యం) లోకి కూడా ప్రవేశించలేము.

౼మనిషి కేంద్రంగా చెప్పే సువార్తలో౼"దేవుని నీ కోసం ఎల్లప్పుడూ పని చేస్తుంటాడు, నీ కోర్కెలు/అవసరాలు తీరుస్తూంటాడు. నీవు ఆయన పట్ల (మత)భక్తి ఉండాలి". దేవున్ని కేంద్రంగా చెప్పే సువార్తలో౼"దేవుడు(క్రీస్తు) లేకుండా నీవు నశించుపొయ్యే వ్యక్తివి, నీ జీవితమంతటిపై ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలని, నీవు ఆయన మార్గంలో నడవాలని క్రీస్తును రాజుగా చూపబడుతుంది. నీపై ఆయన యెలుబడిని చూపిస్తుంది.

Comments

Popular posts from this blog

2 May 2017

ఏలీయాబు(దావీదు అన్న) దావీదుతో-"నీ గర్వం, నీ హృదయంలోని చెడుతనం నాకు తెలుసు"(1సమూ 17: 28). దేవుడు-"దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములన్ని నెరవేరుస్తాడు."(అపో 13: 22) అజర్యా, యోహానాను(గర్విష్టులైన వారు) యిర్మీయాతో-"నీవు అబద్ధమాడుతున్నావు.మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు"(యిర్మియా 1:5). దేవుడు యిర్మీయాతో-"నీవు పుట్టేముందే నిన్ను ప్రత్యేకించుకొన్నాను, జనాలకు ప్రవక్తగా నియమించాను. నా వాక్కులు నీ నోట ఉంచాను."(యిర్మియా 43:2) యోసేపు అన్నలు-“ఇదుగో, కలలు కనేవాడు వచ్చేస్తున్నాడు!వాణ్ణి చంపేసి ఇక్కడ ఏదో గుంటలో పడేద్దాం..వాడి కలలు ఏమవుతాయో చూద్దాం"(ఆది 37:19). దేవుడు యోసేపుకు కలల ద్వారా వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చాడు. పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులు బాప్తిస్మమిచ్చు యోహానును చూచి-"రొట్టెలు తినట్లేదు ద్రాక్షరసం త్రాగట్లేదు కనుక అతనికి దయ్యం పట్టింది"(లూకా 7: 33). యేసు-" స్త్రీలు కన్నవారిలో బాప్తిసమిచ్చే యోహానుకంటే గొప్పవాడైన ప్రవక్త లేడు"(లూకా 7: 28) దేవుడు యేసును గూర్చి-"ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనలో నేను ఆనం...

28May2020

★ఆ దినమందు అనేకులు నన్ను చూచి-"ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?" అని చెప్పుదురు. అప్పుడు -"నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని" వారితో చెప్పుదును. "ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువా డే ప్రవేశించును". (మత్తయి 7:22,23,21)★ ■ పైన చెప్పబడిన గుంపు అబద్ధమాడట్లేదు గాని, నిజంగానే దేవుని పేరిట ఆ కార్యాలు అన్ని చేశారు. వారి మాటను బట్టి చూస్తే వాళ్ళను వెంబడించేవారు అనేకులుండి ఉంటారు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా ఉండటానికి గల కారణాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సేవ పేరిట తీరిక లేకుండా గడిపిన వ్యక్తులు. దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని కోసమే జీవిస్తున్న భ్రమలో బ్రతకడం.. అది నిజంగా సాతాను కుయుక్తి బలైపోవడమే. ■ ఏది ప్రాముఖ్యమైనది? ఒకప్పుడు క్రీస్తు లేని మనమంత...

15Oct2017

❇ యేసు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి౼"ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు. యేసు౼"నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు, మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు. అందుకు ఆయన౼"ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు. ❇ ■ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును అడిగిన ప్రశ్నకు నిజమైన అర్ధం "దేవాలయంలో భోధించడానికి మాలో నీకెవరు అనుమతి ఇచ్చారు? ప్రధానయాజకులు ఇచ్చారా! లేక మా పెద్దలల్లో ఎవ్వరిరైనా ఇచ్చారా? కానప్పుడు నీకు ఇక్కడ అ...